Subscription Service

All Ads in Telugu

భారీగా విస్తరించిన శనగ సేద్యం - స్టాకిస్టుల అమ్మకాలపై ఒత్తిడి

హైదరాబాద్ : దేశంలో డిసెంబర్ 20 నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 84.42 ల.హె. నుండి పెరిగి 86 ల.హె.లో విస్తరించింది. ఇందులో కర్ణాటకలో 9.41 ల.హె. నుండి 10.34 ల.హె.లో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 2024 అక్టోబర్లో ఆస్ట్రేలియా నుండి 1,09,622 టన్నుల శనగలు ఎగుమతి చేయగా ఇందులో భారత్కు 82,481 టన్నులు ఎగుమతి చేసిందని ఆస్ట్రేలియాకు చెందిన ఏజెన్సీ వెల్లడించింది. సేద్యం సంతృప్తికరంగా విస్తరించడంతో పాటు ఆస్ట్రేలియా, కెనడా లాంటి ఉత్పాదక దేశాల నుండి సరుకు దిగుమతి అవుతున్నందున శనగల ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. కొత్త సీజన్లో పెరుగుతున్న ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ధర రూ. 5000 దిగువన చలించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం జెజె శనగలు సేలం, మదురై, విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 7100, కర్ణాటక సరుకు రూ. 7250, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6500-6600, ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6250, పాత సరుకు రూ. 6100, ఆస్ట్రేలియా కొత్త శనగలు రూ. 6500, సూడాన్ కాబూలీ శనగలు రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర శనగలు తమిళనాడులోని సేలం, మదురై విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 7000, కర్ణాటక ప్రాంతం సరుకు రూ. 7300, య్యుడికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 6500-6550, ముంబైలో రూ. 6050, ఆస్ట్రేలియా నుండి దిగుమతి సరుకు రూ. 6250, సూడాన్ కాబూలీ శనగలు రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 6300- 6500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 8300, డాలర్ శనగలు రూ. 11,800, హైదరాబాద్లో మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల సరుకు రూ. 6600-6650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం 50-55 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్లోని శెఖావటి శనగలు రూ. 6750-6775, మధ్యప్రదేశ్ సరుకు రూ. 6650-6675 మరియు వుధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ శనగలు రూ. 6350- 6600,, డాలర్ శనగలు రూ. 11,000- 12,700, కాబూలీ శనగలు 40-42 కౌంట్ రూ. 14,100, 42-44 కౌంట్ రూ. 13,900, 44-46 కౌంట్ రూ. 13,600, 46-48 కౌంట్ రూ. 13,300, 50-52 కౌంట్ రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వుహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు రూ. 6500-6650, అన్నిగిరి శనగలు రూ. 6700-7000, అకోలాలో ప్రతి రోజు 2500-3000 బస్తాలు మిక్స్ శనగలు రూ. 6500, సాధారణ రకం రూ. 6000, పప్పు రూ. 8000-8200, రాజస్తాన్లోని కోటాలో రూ. 5000-6800, జైపూర్లో రూ. 6700-6750, పప్పు రూ. 7525, గుజరాత్లోని రాజ్కోట్లో దేశీ శనగలు రూ. 6200-6500, దాహోద్లో శనగలు రూ. 6100-6400 మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్, ఝాన్సీలో రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:49 am