Subscription Service

All Ads in Telugu

దక్షిణాదిలో వేరుసెనగ సేద్యానికి శ్రీకారం చుట్టగా - ఉత్తరాదిలో కొత్త సరుకు ప్రారంభం

దక్షిణాదిలో వేరుసెనగ సేద్యానికి శ్రీకారం చుట్టగా - ఉత్తరాదిలో కొత్త సరుకు ప్రారంభం హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని అనంతపురం జిల్లా దేశంలో వేరుసెనగ సేద్యానికి ప్రసిద్ధి గాంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 18.80 ల.హె. వేరుసెనగ సాగవుతుండగా ఇందులో అనంతపురం జిల్లా భాగస్వామ్యం 8 ల.హె. ఉంది. ఈసారి రుతుపవనాల ముందస్తుగా రావడంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ధరతో సరఫరా చేస్తున్న విత్తులు సాగు చేస్తున్నారు. నూనె రికవరీ అధికంగా ఉండడం వలన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు రాయలసీమ విత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాగి రుతుపనాలు ముందస్తుగా ప్రవేశిండమే కాకుండా సంతృప్తికరమైన వర్షాలు కురిశాయి. తద్వారా ప్రభుత్వం సబ్సిడీ ధరతో సరఫరా చేస్తున్న విత్తులు రైతులు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఏడాది రుతుపవనాల వర్షాలు సంతృప్తికరంగా కురిసినందున వేరుసెనగ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మార్చి 1-మే 31 మధ్యకాలంలో సాధారణ వర్షపాతం 115 మి.మీ.కి గాను 149 శాతం పెరిగి 286 మి.మీ. వర్షం కురిసింది. సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2600 హెక్టార్ల నుండి పెరిగి 6100 హెక్టార్లలో విస్తరించింది. సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమెరికాలో మే చివరి వారం నాటికి వేరుసెనగ సేద్యం నిర్ధారిత లక్ష్యంలో 69 శాతానికి చేరగా క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4 శాతం అధికమని అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్డిఎ) పేర్కొన్నది. వర్జీనియాలో 90 శాతానికి చేరినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 3 శాతం తరుగు నమోదైంది. నార్త్ కరోలినా, జియోజార్జియా, అలబామా రాష్ట్రాలు ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందినవి. 2025-26 సీజన్ కోసం వేరుసెనగ పంట నూర్పిడి కోసం వాతావరణం సానుకూలించినట్లయితే సెప్టెంబర్ నుండి ప్రారంభం కాగలదు. దాదాపు 7.58 ల.హె.లో విస్తరించగా ఉత్పత్తి 31 ల.ట.కు చేరవచ్చని యుఎస్డిఎ వెల్లడించింది. ఓలామ్ రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఈసారి ఐరోపా సమాఖ్యకు వేరుసెనగ దిగుమతులు భారీగా వృద్ధి చెందాయి. ఇందులో అర్జెంటీనా భాగస్వామ్యం క్రితం ఏడాదితో పోలిస్తే 65 శాతం వృద్ధి నమోదైంది. యూరప్ కోసం వేరుసెనగ ఎగుమతులలో అమెరికాను అధిగమించి చైనా రెండో స్థానం దక్కించుకున్నది. అయితే, యూరప్ కోసం అమెరికా నుండి ఎగుమతులు 60 శాతం తగ్గినప్పటికీ సేద్యం రాకెట్ వేగంతో విస్తరిస్తోంది. అంతర్జాతీయ విపణిలో ప్రతి టన్ను హెపిఎస్ 40-50 కౌంట్ 1190 డాలర్, 50-60 కౌంట్ 1150, 60-70 కౌంట్ 1135, జావా 50-60 కౌంట్ 1245, 60-70 1160, 70-80 కౌంట్ 1165 వద్ద కదలాడుతున్నది. ఇలాంటి పరిస్థితులలో జావా హెచ్పిఎస్ ధర రూ. 10,580 అధిగమించే అవకాశం లేదు. భారత్ నుండి ఎగుమతులు నామమాత్రంగా ఉండగలవని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో వేరుసెనక కొత్త సరుకు రాబడులు ప్రారంభమైనందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 పతనమైంది. ఇటా, మైన్పురి, మాధవ్గంజ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ఇప్పటి వరకు 1000 బస్తాల కొత్త వేరుసెనగ రాబడి కాగా నిమ్ము సరుకు రూ. 3600-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వచ్చే వారం నుండి రాబడులు పోటెత్తనున్నాయి. మహారాష్ట్ర పర్బణి, హింగోళి, నాందడ్, వాశిం ప్రాంతాలలో గత వారం 30 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై ధర రూ. 200-250 తగ్గి గులాబీ రకం రూ. 5000-5500, తెలుపు రకం రూ. 5800-5900 మరియు మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్, మందసోర్ మరియు పరిసర ప్రాంతాలలో 50 వేల బస్తాల వేరుసెనగ రాబడి కాగా నాణ్యమైన సరుకు రూ. 4850-5150, మీడియం రూ. 4600-4900, సాధారణ రకం రూ. 4250-4550 ఒడిశ్శాలోని బరంపురం, కటక్ ప్రాంతాలలో ప్రతి రోజు 8 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5100-5200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణ స్థానిక మార్కెట్లలో రూ. 4800-6330, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, అనంతపురం ప్రాంతాలలో రూ. 5000-6500, హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9400-9500, మహారాష్ట్ర కోసం 70-80 కౌంట్ రూ. 9800-10,000, 60-70 కౌంట్ రూ. 10,500, 60-65 కౌంట్ రూ. 10,700-10,800, 90-100 కౌంట్ రూ. 9000-9100, కళ్యాణి స్థానికంగా రూ. 7300, చెన్నై కోసం రూ. 7500, నందికొట్కూరులో హెచ్పిఎస్ 90-100 కౌంట్ రూ. 8500, 80-90 కౌంట్ రూ. 9000, 70-80 కౌంట్ రూ. 9200, 60-70 కౌంట్ రూ. 10,000, 50-60 కౌంట్ రూ. 10,700, 140-160 కౌంట్ రూ. 7000 మరియు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వారంలో 6 వేల బస్తాలు రాబడిపై కదిరి లేపాక్షి రూ. 4500- 5500, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9400, 60-70 కౌంట్ రూ. 9800, 60-65 కౌంట్ రూ. 10,000, 90-100 కౌంట్ రూ. 9200, కళ్యాణి రూ. 7700, తమిళనాడులోని కొడుముడి, బోతపాడి ప్రాంతాలలో వేరుసెనగ రూ. 6800-7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని మార్కెట్లలో వేరుసెనగ రూ. 5000-5400, హెచ్పిఎస్ 50-60 కౌంట్ ముంద్రా డెలివరి రూ. 8100, 50-55 కౌంట్ రూ. 8175, 40-50 కౌంట్ రూ. 8250, 38-42 కౌంట్ రూ. 8450, టిజె 80-90 కౌంట్ రూ. 8250, 50-60 కౌంట్ రూ. 8550, టిజె సరుకు స్థానికంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరుకు 80-90 కౌంట్ రూ. 8000, 50-60 కౌంట్ రూ. 8350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: June 9, 2025, 6:36 am
దూసుకుపోతున్న కొబ్బరి ధరలు

దూసుకుపోతున్న కొబ్బరి ధరలు హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన ఉత్పత్తి మరియు పెరిగిన దేశీయ వినియోగం వలన రైతుల వద్ద సరుకు నిల్వలు అడుగంటుతున్నాయి. కొనుగోళ్లకు అనుగుణంగా సరఫరా అందుబాటులో లేనందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 500-700 ఎగబాకింది. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై బంతికొబ్బరి రూ. 20,500-21,000, కిరాణా రకం నాణ్యమైన సరుకు రూ. 20,000, మీడియం రూ. 17,000-17,500, మెరికో రూ. 19,200-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 19,900, స్పెషల్ రూ. 20,400, మెరికో రూ. 20,800, కిరాణా రకం రూ. 21,000, ఎక్స్పోర్డు రకం రూ. 21,500, కోజికోడ్లో బంతికొబ్బరి రూ. 21,000, రాజాపురి కొబ్బరి రూ. 23,500, మిల్లింగ్ సరుకు రూ. 21,300, ఇలమతూరు, కొడుముడి, పెరుందురై, అవిల్పుందురై ప్రాంతాలలో కలిసి గత వారం 10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 20,800-21,500, మీడియం రూ. 16,500-17,000, త్రిచూర్లో కొబ్బరినూనె రూ. 32,400, కోజికోడ్లో రూ. 33,600, కొచ్చిలో రూ. 29,900, కాంగేయంలో రూ. 31,975 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం వ్యాపారుల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలలో రాబడులు తగ్గి 55 వాహనాలకు పరిమితంగా కాగా గుజరాత్ రకం కొబ్బరికాయల రాబడిపై పాత సరుకు పెద్దసైజు కాయలు రూ. 20,000, మీడియం రూ. 18,000, సాధారణ రకం రూ. 17,000, నాణ్యమైన కొత్త సరుకు రూ. 18,000, మీడియం రూ. 16,000, సాధారణ రకం రూ. 14,000 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.

Updated On: June 9, 2025, 6:34 am
మెంతులు

మెంతులు జావ్రా : రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉత్పాదక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో గత వారంలో నాలుగు రోజులు నిర్వహించిన మార్కెట్లో దాదాపు 80 వేల బస్తాల రాబడి అయ్యాయి. పొరుగు రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు జోరందుకున్నందున సార్టెక్స్ సరుకు ధరలకు మద్దతు లభిస్తున్నది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో 12 వేల బస్తాల కొత్త మెంతుల రాబడిపై సాధారణ రకం రూ. 4400-4700, మీడియం రూ. 5000-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: April 21, 2025, 6:51 am
పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు

పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 17, 2025, 7:00 am
బెల్లం నిల్వలు అడుగంటే అవకాశం

హైదరాబాద్ ః దేశంలో ఈసారి చెరకు రైతులు తమ ఉత్పత్తిని నేరుగా పంచదార మిల్లులకు సరఫరా చేస్తున్నందున బెల్లం ఉత్పత్తి కుంటుపడుతోంది. ఉత్తరప్రదేశంలో బెల్లం తయారైన తక్షణమే పొరుగు రాష్ట్రాల శీతల గిడ్డంగులలో సరుకు నిల్వ చేస్తున్నారు. కొత్త సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినప్పటికీ ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జనవరి 6 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2,96,857 బస్తాల నుండి తగ్గి 74,127 బస్తాలకు పరిమిటఈతమైంది. ఇందులో చాకూబెల్లం 1,57,309 బస్తాల నుండి తగ్గి 19,223 బస్తాలు, పాప్డి 28,199 నుండి 730, రస్కట్ 16,034 నుండి 826, ఖరుపా 1384 నుండి 337, చదరాలు 12,744 నుండి 3390, రాబిటన్ 81,187 నుండి 49,621 బస్తాలకు పరిమితమైంది. ముజఫర్నగర్లో గత వారం 8-10 వేల మణుగుల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1480-1750, ముద్దబెల్లం రూ. 1500-1700, ఖరుపా రూ. 1500-1550, రస్కట్ రూ. 1230-1280 మరియు పాప్డి 100 కిలోలు రూ. 3400-3500 మరియు హాపూర్లో 50-55 వాహనాలు కొత్త బెల్లం రూ. 1300-1450, ఖతౌలిలో రూ. 1300-1350, అమ్రోహ్లో 3-4 వాహనాల బెల్లం ప్రతి క్వింటాలు రూ. 3630-3700, ముద్దబెల్లం రూ. 3750-3850, మురాదానగర్లో రూ. 3750 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో 20-22 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 4000-4050, ఎరుపు రూ. 3600-3700, నలుపు-ఎరుపు మిక్స్ సరుకు రూ. 3000-3100, సోలాపూర్లో 7-8 వేల దిమ్మల కొత్త బెల్లం సురభి రూ. 3900-4000, ఎరుపు రూ. 3500-3600, మిక్స్ సరుకు రూ. 3000-3100, సాంగ్లీలో 8-10 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సురభి రూ. 3600-3900, గుజరాత్ రకం రూ. 3800-3900, ముంబై రకం రూ. 3850- 4000, తెలుపు రూ. 4000-4150, కొల్హాపూర్లో 5-6 వేల దిమ్మల్లు రూ. 3400-3450, పూణెలో 8-10 వేల క్వింటాళ్లు నాణ్యమైన సరుకు రూ. 4100- 4200, మీడియం బెస్ట్ రూ. 3700-3850, మీడియం రూ. 3400-3550, సాధారణ రకం రూ. 3200, గ్లాస్ రకం రూ. 4400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బైతుల్, నర్సింగ్పూర్, ఛింద్వాడ, కరేలి మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 125-130 వాహనాల బెల్లం రాబడిపై రూ. 3100-3300, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మారుమూల గ్రామాల నుండి ప్రతి రోజు 7-8 వేల క్వింటాళ్ల సరుకు రాబడిపై ముద్దబెల్లం రూ. 4100-4250, చాకూబెల్లం రూ. 3900-3950, అచ్చులు రూ. 4400-4500, మధ్యప్రదేశ్ సరుకు రూ. 3400-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 40-45 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు రూ. 4900-5000, మీడియం రూ. 4000-4100, నలుపు రూ. 3200-3250, చిత్తూరులో 30-35 వాహనాల సరుకు అవ్ముకంపై సూపర్-ఫైన్ రూ. 4900-5000, సురభి రకం రూ. 4600-4700, నలుపు రకం రూ. 4150-4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 55-60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3500, సింగిల్ ఫిల్టర్ రూ. 3600, డబుల్ ఫిల్టర్ రూ. 3700, చదరాలు రూ. 4000, శిమోగాలో 18-20 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం రూ. 3800-3850, మహాలింగాపూర్లో 8-10 వాహనాల సరుకు బాక్స్ రకం నాణ్యమైన సరుకు రూ. 4200, మీడియం రూ. 3800-3900, 200 గ్రాముల దిమ్మలు రూ. 4250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం (10 కిలోల దిమ్మలు) రూ. 4200-4300, చదరాలు రూ. 4600-4700, సాంగ్లీ సరుకు రూ. 4600-4700, ఒక కిలో దిమ్మలు రూ. 4300-4400, అర కిలో దిమ్మలు రూ. 4400-4500, ముద్దబెల్లం మహారాష్ట్ర సరుకు రూ. 4000-4100, మంగుళూరు ముద్దబెల్లం రూ. 4500-4600 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలంలో 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం రూ. 1370-1380, సురభి రూ. 1350-1370, ఎరుపు రకం రూ. 1340-1360, పిలకలపాలయంలో 7 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1260-1280, సురభి రూ. 1240-1260, ఎరుపు రకం రూ. 1220-1240, చిత్తోడ్లో 6 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1280-1300, సురభి రూ. 1260-1280, ఎరుపు రకం రూ. 1240-1260 వురియుు అచ్చులు 400 బస్తాలు రాబడిపై రూ. 1260-1280 మరియు 6 వేల బస్తాల పొడి బెల్లం రూ. 1230-1250, కౌందప్పాడిలో 3 వేల బస్తాలు రూ. 1260-1280 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

Updated On: January 12, 2025, 1:23 pm
ఊరట చెందుతున్న కందిపప్పు వినియోగదారులు

ముంబై ః వచ్చే వారం నుండి కందుల రాబడులు పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్పుర్గి, బీదర్, బాల్కీ, రాయిచూర్, సేడెం, చితాపూర్, కుస్తగి ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 80-85 వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కల్బుర్గిలో 5000-5500 బస్తాలు, బాల్కీలో 2000-2500 బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా స్థానిక మార్కెట్లలో రూ. 6300-7100, నాణ్యమైన సరుకు రూ. 8400-8750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ సరుకు దేశంలోని పప్పు మిల్లులకు సరఫరా అవుతున్నది. మహారాష్ట్రలోని లాతూర్, ఔరద్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 8300, అహ్మద్నగర్లో గ్రేడెడ్ సరుకు రూ. 8400, మీడియం రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. సంక్రాంతి తర్వాత రాబడులు పోటెత్తనున్నాయి. మహారాష్ట్ర ఉత్పాదక కేంద్రాల వద్ద ప్రతి రోజు 50-60 వేల బస్తాలు రాబడి అవుతుండగా ఇందులో సోలాపూర్లో 75-80 వాహనాలు, లాతూర్, అకోలాలో 14-15 వేల బస్తాల చొప్పున సరుకు రాబడిపై తెల్లకందులు రూ. 7700, మారుతి కందులు రూ. 7800, గులాబీ కందులు రూ. 7900-8000, సాధారణ రకం రూ. 7600-7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చెనె్నైలో లెమన్ కందులు రూ. 6800-6850, ముంబైలో రూ. 6900, మెుజాంబిక్ గజరి కందులు రూ. 6300, తెల్ల కందులు రూ. 6500-6550, వుట్వారా కందులు రూ. 6250-6300, కెన్యా తెల్లకందులు రూ. 6400, అరుశ రూ. 6800-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక కొత్త కందులు కట్ని డెలివరి రూ. 8300-8400, పప్పు మేలిమి రకం రూ. 12,800-13,000, కర్ణాటక కందులు ఇండోర్ డెలివరి రూ. 8200, మహారాష్ట్ర సరుకు రూ. 7900, నాగ్పూర్లో పప్పు మేలిమి రకం రూ. 13,700-13,800, సవానంబర్ రూ. 12,800-12,900, లాతూర్లో మేలిమి రకం రూ. 13,400-13,600, సవానంబర్ రూ. 11,400-11,600, అకోలాలో మేలిమి రకం రూ. 12,600-13,800, సవానంబర్ రూ. 11,000-11,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పెరగనున్న వాము రాబడులు హైదరాబాద్ ః దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణలో వాము రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. మరో వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఇప్పటికే కోతల ప్రక్రియ ప్రారంభమైనందున కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరో రెండు మూడు వారాలలో అన్ని మార్కెట్లల4 కొత్త సరుకు రాబడులు పోటెత్తే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా ధరలు మందగమనంలో కొనసాగగలవు. వుధ్యప్రదేశ్లోని నీవుచ్లో గత వారం 400-500 బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం రూ. 11,500-12,500, మీడియం రూ. 13,500- 13,700. నాణ్యమైన సరుకు రూ. 14,500-15,000 మరియు 1800-2000 బస్తాల పాత సరుకు సాధారణ రకం రూ. 13,500-14,000, మీడియుం రూ. 13,500-14,000, మీడియం బెస్ట్ రూ. 14,500-15,500, పోహరిలో 300-350 బస్తాలు నిమ్ము సరుకు రూ. 8000-8500, మీడియం రూ. 11,500-12,000, మీడియం బెస్ట్ రూ. 12,200-12,600, ఎసి సరుకు రూ. 10,500-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్నగర్లో 4-5 వేల బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం రూ. 14,000-14,500, మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, ఆకుపచ్చ సరుకు మీడియం రూ. 20,000-24,000, ఆకుపచ్చ బోల్డు సరుకు రూ. 28,000-28,500 మరియు 400-500 బస్తాల పాతసరుకు రాబడిపై సాధారణ రకం రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైనసరుకు రూ. 17,500-18,000, మీడియం బెస్ట్ రూ. 16,500-17,000, మీడియం రూ. 15,500-15,500 మరియు తెలంగాణలోని వికారాబాద్లో 100 బస్తాల కొత్త వాము రూ. 10,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరిపల్లి, పరిగి,

Updated On: January 12, 2025, 1:22 pm
జీలకర్ర దిగుబడులు పెరిగే అవకాశం

ఊంఝా ః గుజరాత్లో జనవరి 6 నాటికి జీలకక్ర సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,60,841 హెక్టార్ల నుండి 87,226 హెక్టార్లు తగ్గి 4,73,615 హెక్టార్లకు పరిమితమైనప్పటికీ ప్రస్తుత సేద్యం 15 శాతం మాత్రమే తరుగు నమోదైందని రాష్ట్ర వ్యసాయ శాఖ పేర్కొన్నది. 2023 లో సేద్యం 2022 తో పోలిస్తే భారీగా విస్తరించిందని వ్యవసాయ శాఖ తెలిపింది. గుజరాత్, రాజస్తాన్లో ఉత్పాదకుల వద్ద సరుకు నిల్వలు ఇప్పటికీ అమ్మకం కాకుండా మూలుగుతున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడులు వృద్ధి చెందడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మార్చి, ఏప్రిల్లో ధరలు తగ్గినట్లయితే సరుకు నిల్వ చేయడం శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 24,500 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 625 పెరిగి రూ. 23,875, మార్చి వాయిదా రూ. 5 తగ్గి రూ. 23,370 వద్ద ముగిసింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 65-70 వేల బస్తాల రైతుల సరుకు రాబడి అవుతుండగా 75-80 శాతం సరుకు అమ్మకమవుతున్నందున ధరలు పురోగమించడంలేదు. గుజరాత్లోని గోండల్లో బుధవారం 15 వేల బస్తాల జీలకర్ర రాబడి అయింది. అయితి నిమ్ము మరియు నాసిరకం సరుకు వలన ప్రతి క్వింటాలు రూ. 9500 ధరతో ముహూర్త వ్యాపారమైంది. 4-5 వేల బస్తాల పాత సరుకు రాబడిపై మీడియం రూ. 21,000-21,500, మీడియం బెస్ట్ రూ. 22,500-23,000 మరియు ఊంఝా మార్కెట్లో గత వారం 30-32 వేల బస్తాలు సాధారణ రకం రూ. 20,000- 20,500, మీడియం రూ. 21,500-22,500, నాణ్యమైన సరుకు రూ. 23,000-23,500, క్లీన్ సరుకు రూ. 24,300, రాజ్కోట్లో 6-7 వేల బస్తాలు సాధారణ సరుకు రూ. 20,000-21,000, మీడియం రూ. 21,000-21,500, నాణ్యమైన సరుకు రూ. 21,500-22,000, యూరప్ రకం రూ. 22,000-22,250, కిరాణా రకం రూ. 22,300-22,500, హల్వాడ్ వురియుు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 20,500-21,000, మీడియుం బెస్ట్ రూ. 22,500- 22,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 12, 2025, 1:21 pm
కొనుగోలుదారులు కరవైన మెంతులు

జావ్రా ః మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్లో ఇప్పటి వరకు మెంతుల పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. సానుకూల పవనాలు వీస్తున్నందున సరుకు నాణ్యత కూడా ఇనుమడించగలదని ఉత్పాదకులు భావిస్తున్నారు. మరో నెల రోజులలో కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది. కిరాణా వ్యాపారులు తమ అమ్మకాలకు అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకం కావడంలేదు. తద్వార ధర ప్రతి క్వింటాలుకు రూ. 300-400 పతనమైంది. మధ్యప్రదేశ్లోని జావ్రా మార్కెట్లో ప్రతి రోజు 1500 బస్తాల మెంతులు రాబడిపై సాధారణ రకం రూ. 5200-5400, మీడియం రూ. 5500-5600, నాణ్యమైన సరుకు రూ. 6100-6500, బోల్టు సరుకు రూ. 6800-7000, పాప్డా రూ. 7500-8000, నీమచ్ మార్కెట్లో 1600-1800 బస్తాలు సాధారణ రకం రూ. 5100-5200, మీడియం రూ. 5400-5500, నాణ్యమైన సరుకు రూ. 5800-6000, బోల్డు సరుకు రూ. 6800, మందసోర్లో 300-400 బస్తాలు సాధారణ రకం రూ. 5000-5200, మీడియం రూ. 5400-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 600 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 4500-5150, మీడియుం రూ. 5200-5600, నాణ్యమైన సరుకు రూ. 5650-5900, కిరాణా రకం రూ. 6000-6250 వురియుు రాజస్తాన్లోని కోటా, రామ్గంజ్మండి, నోఖా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 800-1000 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 4500-4600, మీడియం బెస్ట్ రూ. 5000-5200, నాణ్యమైన సరుకు రూ. 5500-5700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 12, 2025, 1:18 pm
దక్షిణాదిలో పోటెత్తుతున్న చింతపండు రాబడులు

హైదరాబాద్ ః కర్ణాటకలోని మైసూరులో చెట్ల నుండి చింతపండు రాల్చే ప్రక్రియ జోరందుకున్నది. గత వారం 50 బస్తాల కొత్త చింతపండు రాబడి కాగా ఫ్లవర్ రూ. 9000, గింజ సరుకు రూ. 1800-2000 మరియు కేరళలోని ఫాల్గాట్లో కూడా 80-90 బస్తాలు ఫ్లవర్ రూ. 9500-10,000, గింజ సరుకు రూ. 3000-5000, నలగ్గొట్టని చింతపండు రూ. 2000-3500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మరో వారం రోజుల తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు, ధర్మపురి, థేని, క్రిష్ణగిరి, కర్ణాటకలోని తుమకూరు, బెల్గాంవ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు సానుకూల వాతావరణం నెలకొన్నందున రంగు, రుచి సంతృప్తికరంగా ఉండగలదని తెలుసోంది. వినియోగం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 10-15, పుంగనూరులో 20-25, సాలూరులో 10-15 వాహనాలు కలిసి మొత్తం 65 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమి ఫ్లవర్ రూ. 10,000, మీడియుం రూ. 8000, సాధారణ రకం రూ. 7000, గింజ సరుకు రూ. 3800-4000, రంగు వెలిసిన సరుకు రూ. 3600-3800, సిల్వర్ మేలిమి రకం రూ. 20,000-27,000, మేలిమి రకం రూ. 16,000-20,000, మీడియం బెస్ట్ రూ. 13,000-15,500, సాధారణ రకం రూ. 11,000-13,000, హిందూపూర్ స్థానిక మార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్డ్ రూ. 9000-11,000, మీడియం రూ. 7500-11,000, సాధారణ రకం రూ. 7500-8500 మరియు రూ. 6000-7000, పుంగనూరులో మేలిమి రకం రూ. 12,000-16,000, చపాతీ రూ. 11,000-12,000, మహారాష్ట్ర సరుకు రూ. 12,500, ఫ్లవర్ రూ. 8500-9500, గింజ సరుకు రూ. 4000-4500, మహారాష్ట్ర సరుకు రూ. 4800-5000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో 8-10 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై తెలంగాణ ఫ్లవర్ రూ. 7000-10,000, కర్ణాటక సరుకు రూ. 6500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 9000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంవ్లో స్వల్పంగా కొత్త సరుకు రాబడి కాగా ఫ్లవర్ రూ. 9000-10,000 మరియు 1-2 వాహనాల పాత సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 8500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 11,000-12,000, తుమకూరులో మేలిమి రకం ఎసి సరుకు రూ. 16,000-18,000, మీడియం రూ. 10,000, బార్షీలో మార్చి నెల సరుకు రూ. 10,500, ఏప్రిల్ రూ. 9000, మే రూ. 8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10-12 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు రూ. 4100-4200, మీడియం రూ. 3200-3500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7000-8500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ రూ. 11,000, మీడియం సరుకు రూ. 8000-8500, గింజ సరుకు రూ. 3800-3900, తరానాలో 2-3 వాహనాల గింజ సరుకు అమ్మకంపై రూ. 3900-4100, మీడియం రూ. 3800-3900 బిల్టికట్ ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 20-25 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 8500-9000, మహారాష్ట్ర సరుకు రూ. 9500-9600, గింజ సరుకు స్థానికంగా రూ. 3500-4000, మహారాష్ట్ర సరుకు రూ. 4000-4500, నలగ్గొట్టని చింతపండు స్థానికంగా రూ. 2000-2400, మహారాష్ట్ర సరుకు రూ. 3100-3400, క్రిష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు రూ. 5600-6000, చపాతీ రూ. 4500-4700, మీడియం రూ. 3800-4000, ధర్మపురిలో చపాతీ మీడియం రూ. 7500-8000, గింజ సరుకు రూ. 3800-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు ః కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కొత్త చింతపండు సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది. సరుకు నుండి గింజలు వేరుచేసే మరో రెండు వారాలలో ప్రారంభం కానున్నది. ఇదే విధంగా కర్ణాటకలోని దావణగెరె, చెల్లకేరి, బెల్గాంవ్, తుమకూరు తదితర ప్రాంతాలలో ఫిబ్రవరి మొదటి వారం వరకు చింతగింజల రాబడలు కాగలవని తెలుస్తోంది. సీజన్ ప్రారంభంలో చౌక ధరతో కొనుగోలుచేసి నిల్వ శ్రేయస్కరం. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు రూ. 2900-3000, పప్పు సూరత్ డెలివరి రూ. 5300, పొడి రూ. 7400-7500, సాలూరులో చింతగింజలు రూ. 2900-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బార్షీ డెలివరి రూ. 3400, బార్షీలో పప్పు రూ. 5300-5550, పొడి రూ. 5800-6000, తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు రూ. 2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 12, 2025, 1:16 pm
స్థిరత్వం నెలకొన్న పెసల ధరలు

ముంబై ః దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో పెసల ఉత్పత్తి పెరగడంతో పాటు రాబడులు జోరందుకున్నందున దిగజారుతున్న కందిపప్పు ధరల వలన పెసరపప్పు వినియోగం కుంటుపడుతోంది. తద్వారా అన్ని ఉత్పాదక ప్రాంతాలలో ధరలకు స్థిరత్వం చేకూరింది. పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేయడం మరో కారణమని చెప్పవచ్చు. రాజస్తాన్లోని నాగోర్, మెడతాలో పెసలు పాలిష్ చెన్నై డెలివరి రూ. 9400, నాగోర్లో 10 వేల బస్తాల కొత్త పెసల రాబడిపై రూ. 7200-8000, కిషన్గఢ్, మెడతా, సుమేర్పూర్, కేక్డి, పాలి ప్రాంతాలలో 10-12 వేల బస్తాలు స్థానిక మార్కెట్లలో రూ. 6000-7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం ఈ సరుకు ఉత్తరప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు పప్పు మిల్లులకు రవాణా చేయబడుతున్నది. రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల మిటుకుల రాబడిపై స్థానిక మార్కెట్లలో రూ. 4300-4800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని గదగ్లో రూ. 7000-8011, బీదర్లో 6050-8300 మరియు వుహారాష్ట్రలోని లాతూర్, ఉద్గిర్లో రూ. 6000- 8800, గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్లో రూ. 6000-9000, మధ్యప్రదేశ్లోని పిపరియా, హర్దాలో రూ. 6000-8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 12, 2025, 1:14 pm