Subscription Service

All Ads in Telugu

నిజామాబాద్‌లో పెరగనున్న పసుపు రాబడులు

హైదరాబాద్ : నిజామాబాద్ మార్కెట్‌లో గత వారం 10 వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా సోమవారం (ఫిబ్రవరి 2) నుండి ప్రతి రోజు 5 వేల బస్తాల సరుకు రాబడి కాగలదని తెలుస్తోంది. ప్రస్తుతం రాబడి అవుతున్న సరుకులో నిమ్ము అధికంగా ఉంది. తేమ శాతం అనుసరించి కొమ్ములు, దుంపలు రూ. 9500-14,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పాత సరుకు సింగిల్ పాలిష్ రూ. 14,200-14,300 ధరతో వ్యాపారం నామమాత్రంగా ఉంది. ఈ ఏడాది మహారాష్ట్రలో పసుపు సేద్యం పరిధి భారీగా విస్తరించింది. నాందేడ్ లగాయతు జల్గాంవ్ వరకు సేద్యంపై సమాచారం లభించినందున సరఫరా జోరందుకోగలదని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలోని కరీంనగర్, మెట్‌పల్లిలో కొత్త సరుకు రాబడులు పోటెత్తడానికి మరో 15-20 రోజుల సమయం పట్టగలదు. అయితే, ప్రస్తుతం మెట్‌పల్లిలో 150 బస్తాల కొత్త సరుకు రాబడి అవుతున్నది. వరంగల్, కేసముద్రం, వికారాబాద్ కొత్త సరుకు మార్చి నుండి ప్రారంభం కానున్నది. కావున మసాలా తయారీదారుల కొనుగోళ్లు మార్చిలో జోరందుకోగలవు. ఇదే వ్యవధిలో మహారాష్ట్రలోని నాందేడ్, బస్మత్‌నగర్, హింగోళి ప్రాంతాలలో కూడా కొత్త సరుకు ప్రారంభం కాగలదు. ఎన్‌సిడిఇఎక్స్ వద్ద సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 17,380 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 670 తగ్గి రూ. 16,710, మే వాయిదా రూ. 524 క్షీణించి రూ. 16,782, జూన్ వాయిదా రూ. 16,702 తో ప్రారంభమైన తర్వాత రూ. 294 కోల్పోయి రూ. 16,996 వద్ద కదలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గిరాలలో ప్రతి రోజు 1000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు, దుంపలు రూ. 13,500-13,700 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో 5 వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి పసుపు రూ. 17,000-18,000, కొమ్ములు, దుంపలు రూ. 16,000-17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారం కాగా, హింగోళి మార్కెట్‌లో 6 వేల బస్తాల సరుకు రాబడి అయింది. తమిళనాడులోని ఈరోడ్‌లో 7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ. 9019-16,477, దుంపలు రూ. 8799-14,699, కొమ్ములు పాత సరుకు రూ. 8789-16,333, దుంపలు రూ. 8109-14,475, పెరుందురైలో 2 వేల బస్తాలు కొమ్ములు రూ. 14,699, దుంపలు రూ. 14,812, పాత సరుకు కొమ్ములు రూ. 9869-16,559, దుంపలు రూ. 8699-14,809, గోబిచెట్టిపాలయంలో 70 బస్తాల కొత్త సరుకు కొమ్ములు రూ. 9899-14,904, దుంపలు రూ. 10,599-13,604 మరియు ఒడిశ్శాలోని బరంపురంలో 500 బస్తాలు అన్-పాలిష్ సరుకు రూ. 12,800, పాలిష్ సరుకు రూ. 13,500 పతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:49 am
గుంటూరులో పెరగనున్న మిర్చి రాబడులు

హైదారాబాద్ : దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్‌లలో మిర్చి ధరలు ఒంటెద్దు పోకడ అనుసరిస్తున్నందున రైతులు తమ సరుకు వెనువెంటనే మార్కెట్‌లకు తరలిస్తున్నారు. వచ్చే వారం నుండి ఖమ్మం, వరంగల్, గుంటూరు మార్కెట్‌లలో కొత్త సరుకు రాబడులు పెరగనున్నట్లు తెలుస్తోంది. మసాలా యూనిట్ల కొనుగోళ్లు ఇప్పటికీ నామమాత్రంగానే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో స్టాకిస్టులు మరియు మసాలా తయారీదారుల కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్‌లలో మసాలా తయారీదారుల డిమాండ్ నెలకొన్నందున రాబడి అయిన మొత్తం సరుకు తక్షణమే అమ్మకమవుతున్నది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సీడ్ రకాల ధరలు దూసుకుపోతుండగా తేజ నిలకడగా కదలాడుతున్నది. వచ్చే వారం నుండి పొరుగు రాష్ట్రాల వ్యాపారుల తేజ మిర్చి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.దక్షిణాది రాష్ట్రాలు మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అన్ని మార్కెట్‌లలో కలిసి ఇప్పటి వరకు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే సరుకు రాబడులు 60 శాతం మించలేదు. ఉత్పత్తి తగ్గినందున సీజన్ ప్రారంభం నుండే సీడ్ రకాల ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి. జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు మేడారం (సమ్మక్క-సారలమ్మ) జాతర సందర్భంగా ఖమ్మం, వరంగల్ మార్కెట్‌లు మూసివున్నాయి. సోమవారం నుండి మార్కెట్‌లు పునఃప్రారంభమైన వెంటనే సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మార్కెట్‌లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం క్రిష్ణా, పల్నాడు మరియు తెలంగాణలోని మహబూబ్‌నగర్, గద్వాల, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల నుండి గత వారం 1 లక్ష 90 వేల బస్తాల మిర్చి రాబడి కాగా 1 లక్ష 80 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో తేజ, 341, కుబేరా, 273, 334, రోమి, షార్క్-స్పార్క్ రకాలు రూ. 500, నెంబర్-5, ఆర్మూర్, బంగారం, బుల్లెట్, సీడ్ తాలు కాయులు రూ. 1000, బడిగ-355, డిడి రూ. 1500, సింజెంట బడిగ-5531 రూ. 2000 వృద్ధి నమోదు చేయగా పసుపు పచ్చ సరుకు ధర రూ. 4000 పతనమైంది. మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కదలాడుతున్నాయి. గుంటూరు మార్కెట్‌లో గత వారం శీతల గిడ్డంగుల నుండి 2 లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా 1 లక్ష 60 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో బడిగ-355, 2043 రకాల ధర రూ. 2000, సింజెంట్ బడిగ, నెంబర్-5, క్లాసిక్ రూ. 1000, ఆర్మూరు రూ. 500 వృద్ధి నమోదు చేయగా మిగిలిన రకాలు స్థిరంగా కదలాడుతున్నాయి. గుంటూరు మార్కెట్‌లో తేజ కొత్త సరుకు రూ. 16,000-18,000, డీలక్స్ రూ. 18,200- 18,500, సుపీరియర్ రకం రూ. 19,000, బడిగ-355 రూ. 18,000 -22,000, డీలక్స్ రూ. 22,500-23,000, సింజెంట బడిగ- 5531 రూ. 18,000-23,000, డీలక్స్ రూ. 23,500-24,000, డిడి రూ. 24,000-26,000, సుపీరియర్ రూ. 26,500, 341 రకం రూ. 23, 000-25,000, డీలక్స్ రూ. 25,500, బిసిఎం రూ. 21,000-24,000, పాలా రకం రూ. 21,000-23,000, నెంబర్-5 రకం రూ. 21,000-24,000, డీలక్స్ రూ. 24,500-25,000, 273, కుబేరా రకం రూ. 18,000-21,000, 334, సూపర్-10 రూ. 19,000-22,000, సుపీరియర్ రూ. 22,500, ఆర్మూరు రకం రూ. 16,000-17,500, సుపీరియర్ రూ. 18,000, రోమి రూ. 16,000-18,000, షార్క్-స్పార్క్ రూ. 16,000-17,500, బంగారం, రకాలు రూ. 19,000-22,000, బుల్లెట్ రూ. 19,000-22,000, డీలక్స్ రూ. 22,500-23,000, పసుపు పచ్చ సరుకు రూ. 35,000-41,000, తాలు కాయలు తేజ రూ. 11,000-13,500, ఇతర రకాల తాలు కాయలు రూ. 9000-11,000, సీడ్ తాలు కాయలు రూ. 12,000-16,000 ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్‌లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ రూ. 16,000- 18,000, అత్యధిక సరుకు రూ. 16,000-17,500, బడిగ-355 రూ. 18,000-24,000, సుపీరియర్ రూ. 24,500 -25,000, సింజెంట బడిగ రూ. 18,000-22,000, డిడి రూ. 20,000-22,000, బడిగ-2043 రూ. 25,000-31,000, నెంబర్-5 రూ. 19,000-23,000, సుపీరియర్ రూ. 23,500-24,000, 341 రూ. 19,000-22,000, సుపీరియర్ రూ. 22,500-23,000, సూపర్-10, 334 రూ. 18,000 -22,000, డీలక్స్ రూ. 22,500, ఆర్మూరు రకం రూ. 16,000-17,000, డీలక్స్ రూ. 17,500, బంగారం రూ. 19,000-22,500, రోమి రూ. 16,500-18,000, క్లాసిక్ రూ. 17,000-18,500, తాలు కాయలు తేజ రూ. 10,500-12,000, ఇతర రకాల తాలు కాయలు రూ. 8000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి ప్రాంతాల శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు 25 వేల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఇందులో గత ఆదివారం 700 బస్తాల సరుకు రాబడి కాగా, తేజ రూ. 18,500, 2043 రూ. 33,000, సూపర్-10 రూ. 22,000 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు 7 లక్షల 48 వేల 300 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. గత మంగళ, బుధవారాలలో కలిసి సుమారు 30 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ రూ. 19,000, మీడియం రూ. 17,000-18,000, తాలు కాయలు నాణ్యమైన సరుకు రూ. 9000 మరియు 4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 18,500 మరియు వరంగల్ మార్కెట్‌లో మంగళవారం 19 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా, తేజ నాణ్యమైన సరుకు రూ. 18,500-19,000, మీడియం రూ. 14,000, 341 రూ. 25,000-26,000, మీడియం రూ. 22,000, వండర్‌హాట్ రూ. 25,000-31,000, పచ్చ సరుకు రూ. 39,000 మరియు 7 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000-17,500, మీడియం రూ. 14,000, 341 నాణ్యమైన సరుకు రూ. 20,000-21,000, మీడియం రూ. 17,000, వండర్‌హాట్ నాణ్యమైన సరుకు రూ. 28,000-29,000, మీడియం రూ. 17,000, దీపిక నాణ్యమైన సరుకు రూ. 25,000-26,000, మీడియం రూ. 22,000, చపాటా నాణ్యమైన సరుకు రూ. 17,000-38,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో గత వారం 17 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 16,000-19,000, సూపర్-10 రూ. 17,000, ఆర్మూరు రూ. 16,000-17,000, నెంబర్-5, డిడి, 273 రూ. 18,000-24,000, సింజెంట బడిగ రూ. 19,000-25,000, 341 రూ. 20,000-26,000, 2043 రూ. 30,000-35,000, నాణ్యమైన సరుకు రూ. 40,000, కెడిఎల్ రూ. 40,000-41,000, తాలు కాయులు తేజ రూ. 10,000-12,000, ఇతర రకాలు రూ. 8000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్గీలో మంగళ, గురువారాలలో కలిసి 80 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై బడిగ శ్రేణిలో డబ్బి కొత్త సరుకు రూ. 72,000-73,300, డీలక్స్ రూ. 62,000-66,000, కెడిఎల్ డీలక్స్ రూ. 50,000-53,000, నాణ్యమైన సరుకు రూ. 45,000-48,000, 2043 రూ. 29,000-35,000, 5531 రూ. 20,000-26,000, డిడి రూ. 23,000-27,000, కేడిఎల్ మీడియం రూ. 26,000-30,000, మీడియం బెస్ట్ రూ. 33,000-38,000, తాలు కాయలు కెడిఎల్ రూ. 9500-11,000, 5531 తాలు కాయలు రూ. 9500-11,000, 5531 లాల్-కట్ రూ. 15,000-17,000 మరియు 40 వేల బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 20 వేల సరుకు అమ్మకంపై 2043 డీలక్స్ రూ. 39,500, నాణ్యమైన సరుకు రూ. 27,000-34,000, మీడియం బెస్ట్ రూ. 22,000-23,000, కెడిఎల్ నాణ్యమైన సరుకు రూ. 38,000-41,000, హుబ్లీలో బుధవారం 7 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి డీలక్స్ రూ. 66,000-72,000, కెడిఎల్ డీలక్స్ రూ. 51,000-55,000, నాణ్యమైన సరుకు రూ. 48,000-50,500 మరియు 5531 రూ. 22,000-25,000, 2043 రూ. 35,000-40,000, కెడిఎల్ లాల్-కట్ రూ. 38,000-46,000, మీడియం రూ. 22,000-32,000, తాలు కాయలు రూ. 8500-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:48 am
డిమాండ్ పెరిగి బలోపేతం చెందుతున్న బెల్లం ధరలు

హైదరాబాద్ : గత వారం వరంగల్‌లో జరుగుతున్న మేడారం జాతర సందర్భంగా బెల్లం కోసం భారీ డిమాండ్ నెలకొన్నందున ధరలు భారీగా ఎగబాకాయి. మహారాష్ట్రలో మరో రెండు వారాల తర్వాత కొత్త సరుకు రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. హోళీ పండుగ నుండి శ్రీరామనవమి వరకు కొనసాగనున్న డిమాండ్‌తో ధరలు దూసుకుపోయే అవకాశం ఉంది. ముజఫర్‌నగర్‌లో గత వారం 20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1500-1575, రస్‌కట్ అచ్చులు రూ. 1490-1510, ముద్ద్డబెల్లం రూ. 1600-1650, ఖుర్పా రూ. 1480-1510 మరియు పాప్‌డి 100 కిలోలు రూ. 3700-3800, హాపూర్‌లో 4 వాహనాలు బిల్టి బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1385 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 3 వేల దిమ్మల బెల్లం రాబడిపై రూ. 3800-4200, కొల్హాపూర్‌లో 38 వేల దిమ్మలు రూ. 4000-4500, లూతూర్‌లో 1000 దిమ్మలు రూ. 3600-4200, లూతూర్‌లో 16 వేల దిమ్మలు రూ. 3500-4000, పొడిబెల్లం రూ. 3100-3150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్‌లోని బైతుల్, నర్సింగాపూర్, జబల్‌పూర్, ఛింద్‌వాడ ప్రాంతాలలో ప్రతి రోజు 3 వేల క్వింటాళ్ల సరుకు రాబడిపై రూ. 3471-3675 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో గురువారం 5 వాహనాల సరుకు రాబడిపై సేంద్రియ బెల్లం రూ. 5500-5600, తెలుపు రకం రూ. 4900-5500, నలుపు రకం రూ. 4100-4200, అనకాపల్లిలో 3 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 4225, మీడియం రూ. 3800-3890, నలుపు సరుకు రూ. 3450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని శివమొగలో 24 వాహనాల సరుకు రాబడిపై రూ. 4100-4150, ్గ, మహాలింగాపూర్‌లో 3 వాహనాల సరుకు 10 కిలోల దిమ్మల బెల్లం రూ. 4000, 5 కిలోలు దిమ్మలు రూ. 4010-4020, 1 కిలో దిమ్మలు రూ. 4210-4220, అర కిలో దిమ్మలు రూ. 4320, 200 గ్రాముల దిమ్మలు రూ. 4360, హైదరాబాద్‌లో మాండ్యా ప్రాంతం సరుకు 10 కిలోల దిమ్మలు రూ. 4700-4800, సాంగ్లీ సరుకు బిల్టి బెల్లం రూ. 4800-4900, ఒక కిలో దిమ్మలు రూ. 4900-5000, మహారాష్ట్ర ముద్దబెల్లం రూ. 4400-4500, మంగుళూరు సరుకు రూ. 4800-4900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:48 am
వృద్ధి చెందుతున్న కొత్త కందుల రాబడులు

హైదరాబాద్ : మయన్మార్‌లో కంది పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. ఫిబ్రవరి మూడో వారం నుండి రాబడులు పురోగమించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 20-25 శాతం కోసుకుపోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాత సరుకు నిల్వలు 10-15 శాతం మాత్రమే మిగిలాయి. ఈ సరుకు సరఫరా మనుగడలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తి కుంటుపడినందున దూసుకుపోతున్న ధరలతో మయన్మార్ నుండి నిర్విరామంగా సరుకు సరఫరా అవుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విదేశీ మారకం విలువ రూ. 92 వద్ద కదలాడుతున్నందున ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ వరకు దేశంలో ధర పెరిగి ప్రతి క్వింటాలు రూ. 9500-10,000 చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా కొత్త సరుకు రాబడులు ప్రారంభమైన తక్షణమే స్టాకిస్టుల కొనుగోళ్లు మరియు పప్పు కోసం వినియోగదారుల డిమాండ్ నెలకొన్నందున సరఫరా తగ్గి మహారాష్ట్ర మార్కెట్‌లలో ప్రతి క్వింటాలు రూ. 8400-8800 వద్ద కదలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం మరియు మహారాష్ట్రలోని అకోలా, ఖాంగాంవ్ ప్రాంతాలలో రాబడులు ధరలు మరోసారి దిగజారాయి. కందుల దేశీయ వినియోగం దాదాపు 45 లక్షల టన్నులకు గాను ఉత్పత్తి 32-35 లక్షల టన్నులకు పరిమితమైంది. గతంలో ధరలు భారీగా పతనమైనందున తగ్గిన సేద్యం మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో పంట కోతలకు ముందు కురిసిన అతిభారీ వర్షాలతో పంటకు తీరని నష్టం వాటిల్లింది. ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, టాంజానియా, కెన్యా ఉత్పాదకులకు గత సీజన్‌లో లాభసాటి ధరలు గిట్టుబాటు కానందున ఈ ఏడాది పరిమితంగా విస్తరించారు. అంతర్జాతీయ విపణిలో కందుల ఎగుమతి ధర ప్రతి టన్ను 940 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు రూ. 8000, మట్వారా కందులు రూ. 6550-6600, మొజాంబిక్ గజరి కందులు రూ. 6750-6800, చెన్నైలో మయన్మార్ లెమన్ కందులు రూ. 7950-7550 మరియు మహారాష్ట్ర కందులు లారీ బిల్టి రూ. 8400-8500, కట్ని డెలివరి రూ. 8800-8900, కట్నిలో పప్పు మేలిమి రకం రూ. 12,500-12,600, సవానంబర్ రూ. 11,500-11,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మార్కెట్‌లో 10 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్‌లలో 7 వేల బస్తాల కందుల రాబడిపై హైదరాబాద్ డెలివరి రూ. 8450-8500, కర్ణాటక సరుకు రూ. 8500-8600, మహారాష్ట్ర, కర్ణాటక సరుకు నాగ్‌పూర్ డెలివరి రూ. 8600-8650, నాగ్‌పూర్‌లో పప్పు మేలిమి రకం రూ. 12,600-12,800, సవానంబర్ రూ. 11,600-11,800, లాతూర్‌లో 10 వేల బస్తాల కందుల రాబడిపై రూ. 8500-8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 2-3 శాతం మిషన్ కటింగ్ మరియు 4 శాతం ఆకుపచ్చ గింజల సరుకు చెన్నై డెలివరి రూ. 9100, గ్రేడింగ్ చేసిన లాతూర్ పప్పు రూ. 9600 మరియు 55 వాహనాల గులాబీ కందులు కొత్త సరుకు రాబడిపై రూ. 7500-8700 మరియు 3 వాహనాల మారుతి కందులు రూ. 7300-7850, 3 వాహనాల జిఆర్‌జి కందులు రూ. 8111 మరియు 4 వాహనాల పాత కందులు గులాబీ రూ. 8100, జిఆర్‌జి రూ. 6700-8200, లాతూర్‌లో 8 వేల బస్తాల రాబడిపై 63-నంబర్ మారుతి కందులు రూ. 8500-8800, తెల్లకందులు రూ. 8500-8600, గులాబీ కందులు రూ. 8500, అకోలాలో ప్రతి రోజు 7 వేల బస్తాల సరుకు రాబడి కాగా మారుతి కందులు స్థానికంగా రూ. 8600, పాత సరుకు రూ. 8400, అమరావతిలో రూ. 8000-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి. జునాగఢ్‌లో శనివారం 10 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 7000-8750, గోండల్‌లో 4 వేల బస్తాలు రూ. 6500-8200, రాజ్‌కోట్‌లో 7 వేల బస్తాలు రూ. 6500-7500, దాహోద్‌లో ఎర్ర కందులు రూ. 6400-6800, పాత సరుకు రూ. 5800-6000, తెల్లకందులు రూ. 7000-7300, పాత సరుకు రూ. 5300-5400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మంలో కొత్త కందులు రూ. 8300, పాత సరుకు రూ. 7800, సార్టెక్స్ రూ. 12,200 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వినుకొండలో కొత్త కందులు రూ. 8300, సార్టెక్స్ రూ. 11,600, మాచర్లలో పొదిలి ప్రాంతం కందులు పాత సరుకు రూ. 8000, ఎండు సరుకు రూ. 12,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని లాతూర్ కందులు తమిళనాడులోని విరుధ్‌నగర్, సేలం డెలివరి రూ. 9000, తెల్లకందులు రూ. 9100, మహారాష్ట్ర, కర్ణాటక సరుకు కట్ని, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, భాటాపారా డెలివరి రూ. 8700-9000, ఇండోర్ డెలివరి రూ. 6500-7600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జాప్యమవుతున్న జీలకర్ర పంట కోతలు - భవిష్యత్తు ఉజ్జ్వలం హైదరాబాద్ ః గత వారం వరంగల్‌లో జరుగుతున్న మేడారం జాతర సందర్భంగా బెల్లం కోసం భారీ డిమాండ్ నెలకొన్నందున ధరలు భారీగా ఎగబాకాయి. మహారాష్ట్రలో మరో రెండు వారాల తర్వాత కొత్త సరుకు రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. హోళీ పండుగ నుండి శ్రీరామనవమి వరకు కొనసాగనున్న డిమాండ్‌తో ధరలు దూసుకుపోయే అవకాశం ఉంది. ముజఫర్‌నగర్‌లో గత వారం 20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1500-1575, రస్‌కట్ అచ్చులు రూ. 1490-1510, ముద్ద్డబెల్లం రూ. 1600-1650, ఖుర్పా రూ. 1480-1510 మరియు పాప్‌డి 100 కిలోలు రూ. 3700-3800, హాపూర్‌లో 4 వాహనాలు బిల్టి బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1385 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 3 వేల దిమ్మల బెల్లం రాబడిపై రూ. 3800-4200, కొల్హాపూర్‌లో 38 వేల దిమ్మలు రూ. 4000-4500, లూతూర్‌లో 1000 దిమ్మలు రూ. 3600-4200, లూతూర్‌లో 16 వేల దిమ్మలు రూ. 3500-4000, పొడిబెల్లం రూ. 3100-3150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్‌లోని బైతుల్, నర్సింగాపూర్, జబల్‌పూర్, ఛింద్‌వాడ ప్రాంతాలలో ప్రతి రోజు 3 వేల క్వింటాళ్ల సరుకు రాబడిపై రూ. 3471-3675 మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో గురువారం 5 వాహనాల సరుకు రాబడిపై సేంద్రియ బెల్లం రూ. 5500-5600, తెలుపు రకం రూ. 4900-5500, నలుపు రకం రూ. 4100-4200, అనకాపల్లిలో 3 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 4225, మీడియం రూ. 3800-3890, నలుపు సరుకు రూ. 3450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:47 am
పప్పు కోసం పెరిగిన డిమాండ్‌తో మినుములకు లభిస్తున్న మద్దతు

హైదరాబాద్ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లుల కోసం నాన్-డ్యామేజీ మినుములకు నెలకొన్న డిమాండ్, ఖరీఫ్ సీజన్ సరుకు ప్రకృతి వైపరీత్యంతో ధ్వంసమైనందున ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ప్రాంతం మిషన్-క్లీన్ బోల్డు సరుకు చెన్నై డెలివరి రూ. 9200, తెలంగాణ సరుకు రూ. 9300, తమిళనాడు సరుకు రూ. 9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 8600, అన్-పాలిష్ రూ. 8300, నంద్యాల పాలిష్ సరుకు రూ. 8700, అన్-పాలిష్ రూ. 8500, ప్రొద్దుటూరు, కడప కొత సరుకు పాలిష్ రూ. 8600, అన్-పాలిష్ రూ. 8400, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 12,000, నాణ్యమైన సరుకు రూ. 14,100, పప్పు రూ. 10,500-11,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అంతర్జాతీయ విపణిలో ఎఫ్‌ఎక్యూ మినుములు ప్రతి టన్ను 850 డాలర్, ఎస్‌క్యూ 950 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మరియు రూపాయి విదేశీ మారకం విలువ క్షీణించినందున దిగుమతులు పెరిగి ముంబైలో ఎఫ్‌ఎక్యూ రూ. 300 పెరిగి రూ. 8050, దిల్లీలో రూ. 8400, ఎస్‌క్యూ రూ. 9150, చెన్నైలో రూ. 8750, ఎఫ్‌ఎక్యూ రూ. 8000, బ్రెజిల్ సరుకు రూ. 9200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో జనవరి 23 నాటికి రబీ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5 లక్షల 25 వేల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి 4 లక్షల 81 వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

Updated On: February 2, 2026, 6:46 am
నీమచ్‌లో కొత్త ధనియాలు

హైదరాబాద్ : దేశంలో ధనియాల ఉత్పత్తికి ప్రముఖ రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మూడు రాష్ట్రాల మార్కెట్‌లలో కలిసి కేవలం 8 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అవుతున్నది. రాబడులు పోటెత్తడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టగలదు. దేశీయ మార్కెట్‌లో మసాలా తయారీదారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ప్రత్యక్ష, పరోక్ష విపణిలో ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. గుజరాత్‌లో జనవరి 27 నాటికి రబీ సీజన్ ధనియాల సేద్యం క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1 లక్ష 30 వేల 731 హెక్టార్ల నుండి తగ్గి 1 లక్ష 26 వేల 112 హెక్టారకు పరిమితమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఎన్‌సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 11,450 తో ప్రారంభమై శుక్రవారం నాటికి 220 వృద్ధి చెంది రూ. 11,670, మే వాయిదా రూ. 508 లాభంతో రూ. 11,808 వద్ద స్థిరపడింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మంగళ, బుధవారాలలో కలిసి 55 వేల బస్తాల కొత్త ధనియాలు రాబడిపై రూ. 9550, హల్వాడ్‌లో శుక్రవారం 15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9000, గోండల్‌లో వారంలో 6 వేల బస్తాల కొత్త సరుకు నిమ్ము సరుకు రూ. 4000-5000, ఎండు సరుకు రూ. 5500-7500 మరియు 3 వేల బస్తాల పాత సరుకు బాదామీ ధనియాలు రూ. 9200-9500, ఈగల్ రూ. 9600-9800, స్కూటర్ రకం రూ. 9800-10,400, రాజ్‌కోట్‌లో 2 వేల బస్తాల కొత్త ధనియాలు నిమ్ము సరుకు రూ. 6750-7500, మీడియం రూ. 7750 -7900 మరియు 800 బస్తాల పాత సరుకు సాధారణ రకం రూ. 8250-8750, బాదామీ ధనియాలు రూ. 8875-9250, ఈగల్ రూ. 9375-9625, స్కూటర్ రకం రూ. 9750-10,250, జునాగఢ్‌లో మిషన్-క్లీన్ ఈగల్ రూ. 10,600, స్కూటర్ రకం రూ. 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్‌లోని రామ్‌గంజ్‌మండిలో గత వారం 7 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా బాదామీ ధనియాలు రూ. 9700-9800, ఈగల్ రూ. 9900-10,000, స్కూటర్ రకం రూ. 10,200-10,300, బారన్‌లో 3 వేల బస్తాలు బాదామీ రూ. 9500-9800, ఈగల్ రూ. 9800-10,2000 మరియు మధ్యప్రదేశ్‌లోని నీమచ్ మార్కెట్‌లో మంగళ, బుధవారాలలో కలిసి 300 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 7500 మరియు 3 వేల బస్తాల పాత సరుకు బాదామీ రూ. 9300-9800, ఈగల్ రూ. 9800-10,100, స్కూటర్ రకం రూ. 10,200-10,500, గునాలో 4 వేల బస్తాలు, కుంభరాజ్‌లో 2 వేల బస్తాల చొప్పున సరుకు రాబడిపై బాదామీ ధనియాలు రూ. 9500-9700, ఈగల్ రూ. 9800-10,100, స్కూటర్ రకం రూ. 10,200-10,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:45 am
బెల్లం తయారీ కర్మాగారాలకు తోడ్పాటు

న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు ప్రణాళికల ద్వారా బెల్లం ప్రాసెసింగ్ (బెల్లం తయారీ మరియు ప్యాకింగ్) పరిశ్రమతో పాటు ప్రాసెసింగ్ సెక్టర్‌కు తోడ్పాటు అందిస్తోందని ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్‌పిఐ) లోక్‌సభలో వెల్లడించింది. డిసెంబర్ 31 వరకు దేశంలోని ఐదు ప్రాసెసింగ్ కర్మాగారాలకు రూ. 17.07 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా 3528 ఆహార సూక్ష్మ పరిశ్రమల కోసం రూ. 102.31 ఆమోదించినట్లు కూడా తెలిపింది. మార్కెటింగ్ అవకాశాలు పెంపొందించడంతో పాటు ఎగుమతులు తోడ్పాటు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా అమలుచేయబడిన ప్రాజెక్టులు ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిబంధనలు మరియు అంతర్జాతీయ ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తాయని ఎగుమతులతో సహా మార్కెట్ విస్తరించడానికి ఇవి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఢానం ద్వారా బెల్లం ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటు మరియు ఉత్పత్తి సామర్థ్యం విస్తరించేందుకు ఎంఒఎఫ్‌పిఐ కృషి చేస్తుందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి పేర్కొన్నారు. పిఎంఎఫ్‌ఎంఇ పథకం కింద రైతు ఉత్పాదక సంస్థలు, సహకార సంఘాలు, సూక్ష్మ ఆహర ప్రాసెసింగ్ యూనిట్లకు బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ మద్దతు కోసం ఖర్చులో 50 శాతం అందించబడుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రణాళిక కింద బెల్లంతో పాటు స్థానిక పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ఒక జిల్లా - ఒక ఉత్పత్తి* నినాదంతో స్వీకరించబడింది. ఉత్పత్తిలో భాగంగా దేశంలో 19 జిల్లాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ సంపద ప్రణాళిక (పిఎంకెఎస్‌వై) కింద ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఉత్పత్తితో ముడిపడిన ఆర్థిక సాయం ప్రణాళిక మరియు ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌తో బెల్లం నుండి తయారయ్యే సంబంధిత కర్మాగారాలను స్థాపించి విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి రవనీత్ సింగ్ తెలిపారు.

Updated On: February 2, 2026, 6:44 am
మహారాష్ట్రలో విస్తరించిన నువ్వుల సేద్యం - ఆం.ప్ర.లో కొత్త సరుకు ప్రారంభం

హైదరాబాద్ : ఈసారి తమిళనాడులో రబీ సీజన్ నువ్వుల ఉత్పత్తి 10-15 శాతం మేర తగ్గనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని వర్ద్, హింగన్‌ఘాట్, యవత్‌మాల్, అమరావతి, కరంజా ప్రాంతాలలో నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే వృద్ధి నమోదైంది. సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోని ఆదిలాబాద్‌లో విస్తరించిన సేద్యం మరియు వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి అంచనా త్వరలో వెలువడనున్నది. కొత్త సరుకు రాబడులు మార్చి మాసాంతం నాటికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో తెల్లనువ్వులు సేద్యం భారీగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా వరకు సేద్యం భారీగా విస్తరించింది. కడప, బద్వేలు ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాగా ఉత్పత్తి దాదాపు 30 వేల బస్తాలు ఉండగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం స్థానిక మార్కెట్‌లలో తెల్ల నువ్వులు ప్రతి క్వింటాలు రూ. 10,800, ఎర్రనువ్వులు రూ. 9000-9500, ఒంగోలులో రూ. 9800 మరియు తమిళనాడు డెలివరి 75 కిలోల బస్తా రూ. 7600 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నువ్వులు 75 కిలోల బస్తా (33-34 కిలోలు నూనె కండిషన్ సరుకు) కనీస మద్దతు ధర అధిగమిస్తున్నందున రబీ, యాసంగి సేద్యం విస్తృతంగా విస్తరిస్తోంది. మార్చి చివరి వారం నుండి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు తమిళనాడులోని ముత్తూరు, శివగిరి, విల్లుప్పురం ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నందున ధరలు పెరిగే అంచనా వ్యక్తం కావడంలేదు. పశ్చిమ బెంగాల్‌లో నువ్వుల యాసంగి సేద్యం మరో వారం రోజుల తర్వాత ప్రారంభం కానున్నట్లు సమాచారం. కొత్త సరుకు మే ద్వితీయార్థం నుండి ప్రారంభమై ఆగస్టు వరకు కొత్త సరుకు మనుగడలో ఉండగలదు. ఇదే విధంగా తూర్పు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం,, శ్రీకాకుళం, చీపురుపల్లి ప్రాంతాలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని అన్ని మార్కెట్‌లలో కలిసి ప్రతి రోజు 8 వేల బస్తాల సరుకు రాబడిపై రాజ్‌కోట్‌లో హళ్లింగ్ సరుకు తెల్లనువ్వులు రూ. 9150-9500, 98.2 శాతం సరుకు రూ. 9100-9400, 99.1 శాతం రూ. 10,000-10,250 మరియు 3 వేల బస్తాల నల్ల నువ్వులు జడ్ బ్లాక్ రూ. 23,000-23,375, సాధారణ రకం రూ. 16,000-22,750 మరియు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, కాన్పూర్‌లో హళ్లింగ్ సరుకు రూ. 10,000-10,300, 99.1 శాతం సరుకు రూ. 11,300, 99.97 రకం ముంబై, ముంద్రా డెలివరి రూ. 12,800-13,100 మరియు 99.98 సరుకు రూ. 12,900-13,200, పశ్చిమ బెంగాల్ నువ్వులు 3 శాతం ఎఫ్‌ఎఫ్ కండిషన్ సరుకు 75 కిలోల బస్తా రూ. 7800-7900, 2 శాతం ఎఫ్‌ఎప్ రూ. 8500, అన్-క్లీన్ సరుకు రూ. 6500 ధరతో వ్యాపారమైంది.ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఎర్రనువ్వులు రూ. 9300-9500, ఒంగోలులో రూ. 9800, బద్వేలు, కడప, రాజంపేట, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో 4 వాహనాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 10,800 ప్రతి క్వింటాలు మరియు ఈరోడ్ డెలివరి 75 కిలోల బస్తా రూ. 8400-8500 ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:43 am
కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతున్న వేరుసెనగ ధరలు

హైదరాబాద్ : దేశంలో తొలిసారి రైతులు పండించిన వేరుసెనగ ధర ప్రతి క్వింటాలు రూ. 7000-10,300 వద్ద కదలాడుతున్నది. కర్ణాటకలోని యాద్గిర్, రాయిచూర్ మరియు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, అచ్చంపేట, జడ్చర్ల, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి ప్రాంతాల మార్కెట్‌లలో కలిసి ప్రతి రోజు కొత్త వేరుసెనగ రాబడులు 1 లక్ష బస్తాలను అధిగమిస్తున్నాయి. ప్రాంతాల వారీగా యాద్గిర్ మార్కెట్‌లో 12 వేల బస్తాల రాబడిపై రూ. 8300-10,300, వనపర్తిలో 20 వేల బస్తాలు, మహబూబ్‌నగర్‌లో 15 వేల బస్తాలు రూ. 8000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణ ఉత్పాదక మార్కెట్‌లలో హెచ్‌పిఎస్ 50-60 మరియు 60-65 కౌంట్ రూ. 17,000-18,000, 60-70 కౌంట్ రూ. 15,500-15,700, 70-80 మరియు 80-90 కౌంట్ రూ. 14,000-14,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, చెన్నై ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది.గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలలో ప్రభుత్వం కొనుగోళు చేసిన గత ఏడాది సరుకు అమ్మకాలు నిలిపివేసింది. రబీ సీజన్‌లో తగ్గిన సేద్యం మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో రైతులు వేరుసెనగ బదులు నువ్వు సేద్యం కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. దక్షిణ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో అడుగంటిన ఖరీఫ్ సీజన్ నిల్వలు మరియు ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని యాసంగి సేద్యం విత్తనాల కోసం డిమాండ్ నెలకొనే అంచనా వ్యక్తమవుతున్నది. ఎందుకనగా ఈ ఏడాది కురిసిన అతిభారీ వర్షాలతో సాగునీటి వనరులు సమృద్ధిగా అందుబాటు ఉన్నాయి. నేలలో సంతృప్తికరమైన తేమ శాతం నిక్షిప్తమై ఉన్నందున రైతులు యాసంగి సేద్యం విస్తరించచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కిరాణా వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వేరుసెనగ గింజల కోసం డిమాండ్ కొనసాగుతున్నందున ధరలు దూసుకుపోతున్నాయి. దేశంలో జనవరి 23 నాటికి రబీ సీజన్ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3 లక్షల 37 వేల హెక్టార్ల నుండి స్వల్పంగా పెరిగి 3 లక్షల 52 వేల హెక్టార్లలో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలలోని అన్ని మార్కెట్‌లలో కలిసి గత వారం 25 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 8000-13,500, హెచ్‌పిఎస్ 80-90 కౌంట్ ముంబై డెలివరి రూ. 16,500, 70-80 కౌంట్ రూ. 17,000, 60-65 కౌంట్ రూ. 17,900, 50-60 కౌంట్ రూ. 18,200-18,300, కళ్యాణి రూ. 13,200-13,300, హైదరాబాద్ డెలివరి రూ. 13,500 మరియు గుజరాత్‌లో జి-20 రకం రూ. 7750-8050, మీడియం రూ. 7600-7750, సాధారణ రకం రూ. 7250-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణ హెచ్‌పిఎస్ హైదరాబాద్ డెలివరి 140-160 కౌంట్ కొత్త సరుకు రూ. 12,500, 80-90 కౌంట్ రూ. 700 తగ్గి రూ. 14,800, 70-80 కౌంట్ రూ. 400 పతనమై రూ. 15,400, 60-70 కౌంట్ రూ. 500 కోసుకుపోయి రూ. 15,700, 60-65 కౌంట్ రూ. 400 క్షీణించి రూ. 16,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముంబైలో ఆంధ్రప్రదేశ్ సరుకు జావా 60-65 కౌంట్ రూ. 15,000-15,500, కర్ణాటక సరుకు 80-90 కౌంట్ రూ. 14,000-14,500, గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ బిజె రకం 60-65 కౌంట్ రూ. 13,500-14,000, 90-100 కౌంట్ రూ. 12,000-12,500, రాజస్తాన్ సరుకు జాడా 40-50 కౌంట్ రూ. 11,700-11,900, టిజె-20 రూ. 11,400-11,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని చెల్లకేరిలో ఎగుమతి రకం సరుకు రూ. 500-1000 క్షీణించి 80-90 కౌంట్ రూ. 15,000-15,100, 70-80 కౌంట్ రూ. 15,500-15,600, 100-130 కౌంట్ రూ. 13,000-13,100, కళ్యాణి రూ. 11,000-11,100 మరియు గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌లో నంబర్-24 సరుకు 60-65 కౌంట్ రూ. 13,400-13,500, 90-100 కౌంట్ రూ. 12,000-12,100, నెంబర్-39 రకం సరుకు 35-40 కౌంట్ రూ. 11,400-11,500, 40-50 కౌంట్ రూ. 11,200-11,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.ముంద్రా ఓడరేవు వద్ద రూ. 200 వృద్ధి చెంది హెచ్‌పిఎస్ 50-60 కౌంట్ రూ. 11,200, 40-50 కౌంట్ రూ. 11,400, 38-42 కౌంట్ రూ. 11,600, రాజస్తాన్ సరుకు 50-60 కౌంట్ రూ. 11,400, 40-50 కౌంట్ రూ. 11,600, 38-42 కౌంట్ రూ. 11,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 2, 2026, 6:43 am
మెంతులు

మెంతులు జావ్రా : రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉత్పాదక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో గత వారంలో నాలుగు రోజులు నిర్వహించిన మార్కెట్లో దాదాపు 80 వేల బస్తాల రాబడి అయ్యాయి. పొరుగు రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు జోరందుకున్నందున సార్టెక్స్ సరుకు ధరలకు మద్దతు లభిస్తున్నది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో 12 వేల బస్తాల కొత్త మెంతుల రాబడిపై సాధారణ రకం రూ. 4400-4700, మీడియం రూ. 5000-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: April 21, 2025, 6:51 am