Subscription Service

All Ads in Telugu

పసుపు వాయిదా

హైదరాబాద్ : దేశంలోని పసుపు ఉత్పాదక కేంద్రాల వద్ద నెలకొన్న మసాలా గ్రైండింగ్ యూనిట్ల డిమాండ్ మరియు అడుగంటిన వలన మిగులు నిల్వల వలన ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-250 వృద్ధి చెందింది. తెలంగాణలో పసుపు తవ్వకాల ప్రక్రియ మరో రెండు వారాలలో ప్రారంభం కానున్నది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 14,038 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 106 నృద్ధి చెంది రూ. 14,144, మే వాయిదా రూ. 372 లాభంతో రూ. 14,272 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో సోమ, మంగళవారాలలో కలిసి 1800-2000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 13,000-13,800, దుంపలు రూ. 12,000-12,400 లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి పాలిష్ సరుకు కొమ్ములు రూ. 14,500-14,600, దుంపలు రూ. 13,700-13,800, వరంగల్లో 150-200 బస్తాలు కొమ్ములు రూ. 11,500- 12,000, దుంపలు రూ. 10,500-11,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 400-500 బస్తాలు కొమ్ములు దుంపలు రూ. 10,800-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 12,000-13,500, నాణ్యమైన సరుకు రూ. 11,200-12,500, మీడియం రూ. 13,000-13,500, దుంపలు రూ. 13,000-13,200, మీడియం రూ. 12,500-12,800, నాందేడ్లో 3 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 12,000-14,000, దుంపలు రూ. 10,500-13,300, సాంగ్లీలో 6-7 నేల బస్తాలు రాజాపురి పసుపు రూ. 14,500-15,500, దుంపలు రూ. 13,800-14,000, కొమ్ము, దుంపలు మీడియుం రూ. 12,500-13,200 మరియు ఒడిశ్శాలోని బరంపురంలో 500-600 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 12,000, పాలిష్ సరుకు రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 16-17 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 6888-14,215, దుంపలు రూ. 6355-13,380, పెరుందురైలో 1000-1200 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 10,869-14,510, దుంపలు రూ. 9665-13,358, గోబిచెట్టిపాలయంలో కొమ్ములు రూ. 10,022-14,499, దుంపలు రూ. 11,122-13,299 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:49 am
धनिया में सामान्य ग्राहकी

हैदराबाद : व्यापारिक सूत्रों के अनुसार गुजरात में बुवाई पिछले वर्ष के मुकाबले कम होने से कुछ स्टाकिस्ट सक्रिय हो गये, लेकिन मध्यप्रदेश, राजस्थान में बुवाई की स्थिति सामने नहीं आ रही है, लेकिन अनुमान है कि दोनों की कुल बुवाई में अधिक कमी नहीं आयेगी और पुराना माल अभी तक बकाया स्टॉक रहने से नया सीजन आने तक अधिक तेजी की संभावना नहीं रहेगी। पिछले सप्ताह एनसीडीईएक्स पर धनिया का जनवरी वायदा 7884 रुपये खुलने के बाद शुक्रवार तक 196 बढकर 8080 रुपये अप्रैल वायदा 62 बढकर 8600 रुपये पर बंद हुआ। राजस्थान के रामगंजमंडी में पिछले एक सप्ताह में 15 से 16 हजार बोरी की आवक पर बादामी 6900-7100, ईगल 7300-7400, स्कूटर 7800-8000 रुपये, कोटा में 3 से 4 हजार बोरी, बारन में 4 से 5 हजार बोरी की आवक पर बादामी 6600-7000, ईगल 7200-7500 रुपये एवं मोटर बिल्टी प्रति 40 किलो बादामी 3450, ईगल 3650, स्कूटर 3800 रुपये तथा धनिया दाल बादामी 7600, ईगल 7800, स्कूटर किस्म 8100 रुपये प्रति क्विंटल क्वालिटी के अनुसार व्यापार हुआ। मध्य प्रदेश के गुना में एक सप्ताह में 8 से 98 हजार बोरी, कुम्भराज में 7 से 8 हजार, नीमच में 4 से 5 हजार और बीनागंज में 500 से 600 बोरी, मंदसोर में 4 से 5 हजार बोरी की आवक पर बादामी 6800-7200, ईगल 7300-7600, स्कूटर 7700-8100, कलर वाला 8600-9500 रुपये के मूल्य पर व्यापार हुआ। गुजरात के गोंडल में एक सप्ताह में 17 से 18 हजार बोरी की आवक पर ईगल 7000-7300 रुपये, ईगल प्लस 7400-7500, स्कूटर 7800-8000, कलर वाला माल 8500-9500 रुपये एवम् राजकोट में 5 से 6 हजार बोरी, जुनागढ में 3 से 4 हजार बोरी और अन्य मंडियो में 8 से 10 हजार बोरी की आवक पर बादामी 6600-6800, ईगल 7000-7250, ईगल प्लस 7500-7700, स्कूटर 7800-7875 रुपये, कलर वाला 8300-9250 रुपये के मूल्य पर व्यापार हुआ। आंध्र में बादामी 3625, ईगल 3700, स्कूटर 3780 रुपये, एसी का माल 3650 रुपये प्रति 40 किलो के मूल्य पर व्यापार हुआ।

Updated On: January 8, 2025, 7:47 am
తగ్గనున్న ప్రపంచ సన్ఫ్లవర్ ఉత్పత్తి

ముంబై : రష్యా, ఉక్రెయిన్లో సన్ఫ్లవర్ ఉత్పత్తి కుంటుపడినందున 2024-25 సీజన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సన్ఫ్లవర్ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే 10 శాతం తగ్గి 5.05 కోట్ల టన్నులకు పరిమితం కాగలదని అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్డిఎ) పేర్కొన్నది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్, రష్యా ఉత్పత్తిపై తుది నిర్ణయం తొందరపాటు చర్య అవుతుందని యుఎస్డిఎ తెలిపింది. అయితే, 2023 తో పోలిస్తే 11 శాతం తగ్గగలదని స్పష్టమవుతున్నదని ప్రకటించింది. ఐరోపా సమాఖ్య, టర్కీ, అమెరికాలో కూడా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఐరోపా సమాఖ్య, ఉక్రెయిన్, రష్యా, అమెరికాలో క్రషింగ్తో పాటు 2024-25 సీజన్లో సన్ఫ్లవర్ క్రషింగ్ గత మార్కెటింగ్ సంవత్సరంతో పోలిస్తే 10 శాతం తగ్గి 4.73 కోట్ల టన్నులకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తద్వారా 2024-25 సీజన్లో ప్రపంచ సరఫరా 14 శాతం కొరవడగలదని స్పష్టమవుతున్నది. అమెరికా సన్ఫ్లవర్ ఎగుమతులు కూడా ఇందుకు భిన్నంగా లేదు. 2025 సెప్టెంబర్ 30 తో ముగియనున్న సీజన్ చివరి నాటికి ప్రపంచ సన్ఫ్లవర్నూనె నిల్వలు 25 శాతం తగ్గి 22.30 ల.ట.కు పరిమితం కానున్నది. గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే కనిష్ఠ స్థాయికి చేరగలదు. సరఫరా తగ్గే అంచనాతో అంతర్జాతీయ మార్కెట్లో సన్ఫ్లవర్ నూనె ధర క్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధి నమోదైంది. 2025 లో సన్ఫ్లవర్నూనె పరిశ్రమ కోసం పలు సవాళ్లతో కూడుకొని ఉండగలదు. ఎందుకనగా సన్ఫ్లవర్ విత్తుల పెట్టుబడి వ్యయం పెరగడం వలన నూనె మిల్లులకు క్రషింగ్పై లాభాలు తరిగిపోగలవు. అయినప్పటికీ వచ్చే నెలలో ధర దక్షిణ అమెరికాలోని నూనెగింజలు ప్రధానంగా సోయాచిక్కుడు పంటపై ఆధారపడి ఉండగలదు. అంతేకాకుండా అమెరికా డాలర్తో పోలిస్తే బలోపేతం చెందే అవకాశం ఉంది. తద్వారా దిగుమతి దేశాలకు దిగుమతి వ్యయం భారీగా పెరగడం వలన ఎగుమతులు కుంటుపడే అవకాశం ఉంది.

Updated On: January 8, 2025, 7:47 am
పోటెత్తుతున్న కొత్త కందుల రాబడులు

ముంబై : దేశంలో కంది సేద్యం భారీగా విస్తరించడంతో పాటు గణనీయమైన ఉత్పత్తి సాధించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కందుల ధర రూ. 12,000 నుండి దిగివచ్చి రూ. 7800-8200 వద్ద కదలాడుతున్నది. మరో వారం రోజులలో ఉత్తర కర్ణాటకలో పంట కోతల ప్రక్రియ ప్రారంభం కానున్నది. తద్వారా అన్ని మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. మహారాష్ట్రలోని అహ్మద్గనర్, జామ్ఖేడ్ ప్రాంతాలలో కొత్త కందులు చెన్నై డెలివరి రూ. 8400-8500, ఔరంగాబాద్ నాణ్యమైన సరుకు రూ. 8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైన తర్వాత మందగమనం కొనసాగుతున్నది. చెనె్నైలో లెమన్ కందులు రూ. 7700, ముంబైలో రూ. 7500, మెుజాంబిక్ గజరి కందులు రూ. 6350, తెల్ల కందులు రూ. 6500, వుట్వారా కందులు రూ. 6350,, కెన్యా తెల్లకందులు రూ. 6400, అరుశ రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక కొత్త కందులు కట్ని డెలివరి రూ. 8800-8900, పప్పు మేలిమి రకం రూ. 13,000-13,200, కర్ణాటక కందులు ఇండోర్ డెలివరి రూ. 8000-8100, దిల్లీలో కర్ణాటక కందులు రూ. 8400-8500, రాయిపూర్లో రూ. 8500-8750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2024 ఖరీఫ్ సీజన్ కోసం కందుల మద్దతు ధర రూ. 7550 తో 9,66,575 టన్నుల సరుకు కొనుగోలు చేయాలని నాఫెడ్ను ఆదేశించింది. ఇందులో ఉత్తరప్రదేశ్ నుండి 3,95,170, కర్ణాటక 3,06,150, ఆంధ్రప్రదేశ్ 95,620, తెలంగాణ 1,65,140 మరియు హరియాణా నుండి 495 టన్నుల కందులు కొనుగోలు చేయనున్నది. హరియాణాలో 2024 డిసెంబర్ 1-31 కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుండగా మిగిలిన రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో చేపట్టబడుతుందని నాఫెడ్ తెలిపింది. మహారాష్ట్రలోని లాతూర్లో ప్రతి రోజు 4-5 వేల బస్తాలు, సోలాపూర్లో 90-100 వాహనాలు, అకోలాలో 10-12 వేల బస్తాలు, జాల్నాలో 4000-4500 బస్తాలు, దూధిని, అహ్మద్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 15-20 వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా సోలాపూర్లో మారుతి కందులు రూ. 7000-7650, గులాబీ కందులు రూ. 7500-8450, సాధారణ రకం రూ. 7700-7900, లాతూర్లో 63-నంబర్, మారుతి, తెలుపు మరియు గులాబీ కందులు రూ. 7500-8200, అహ్మద్నగర్లో నల్లకందులు రూ. 7600, తెల్లకందులు రూ. 7800, ఎర్ర కందులు రూ. 7700, అకోలాలో మారుతి కందులు రూ. 8200, కర్ణాటక గులాబీ కందులు రూ. 8550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కల్బుర్గి, యాద్గిర్, బీదర్, బాల్కీ, రాయిచూర్ ప్రాంతాలలో 8-10 వేల బస్తాల కొత్త కందులు రూ. 7000-8150, తెలంగాణలోని తాండూరులో 4-5 వేల బస్తాలు రూ. 7800-8800, లాతూర్లో పప్పు మేలిమి రకం రూ. 14,000, సవానంబర్ రూ. 12,800, అకోలాలో మేలిమి రకం సార్టెక్స్ రూ. 14,500, నాన్-సార్టెక్స్ రూ. 14,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ ప్రాంతం కందులు రూ. 7700, పప్పు సార్టెక్స్ రూ. 12,900, మాచర్లలో పాలిష్ పప్పు సార్టెక్స్ రూ. 12,500 మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్, దమోహ్, కరేలి ప్రాంతాలలో కందులు మీడియం సరుకు రూ. 6500-8000, గుజరాత్లోని దాహోద్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో మీడియం కందులు రూ. 7000-8000, నాణ్యమైన సరుకు రూ. 8500-8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:46 am
నిలకడగా కొనసాగుతున్న నువ్వుల ధరలు

హైదరాబాద్ : గత వారం బలహీనపడిన నూనె మిల్లర్ల కొనుగోళ్లు, అవసరానికి అనుగుణంగా వ్యాపారులు సరుకు కొనుగోలు చేస్తున్నందున నువ్వుల ధరలకు స్థిరత్వం చేకూరింది. పశ్చిమ బెంగాల్లో గత వారం 4-5 వాహనాల యాసంగి నువ్వుల అమ్మంకపై 3 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు స్థానికంగా రూ. 9100-9200, 2 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 10,000-10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద హళ్లింగ్ సరుకు రూ. 12,000, 99.98 మరియు 99.97 శాతం సరుకు ముంబై, ముంద్రా డెలివరి హళ్లింగ్ నువ్వులు రూ. 15,750-15,800, గుజరాత్ సరుకు 99.1 శాతం యాసంగి క్లీన్ సరుకు రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు రూ. 10,000-11,000, కడప, బద్వేలు ప్రాంతాలలో నువ్వులు స్థానికంగా రూ. 11,000, విరుధ్నగర్ డెలివరి (75 కిలోల బస్తా) రూ. 8500, విజయనగరంలో తెల్లనువ్వులు రూ. 10,500-11,000 వురియుు తమిళనాడులోని శివగిరి, ముత్తూరు ప్రాంతాలలో నల్లనువ్వులు స్థానికంగా రూ. 16,300-17,000, ఎర్రనువ్వులు రూ. 13,600-15,125 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద 10-12 వేల బస్తాల నువ్వుల రాబడిపై 95.5 శాతం సరుకు రూ. 8500-9750, హళ్లింగ్ సరుకు మీడియం రూ. 10,000-10,150, నాణ్యమైన సరుకు రూ. 10,875-11,500, 98.2 శాతం సరుకు రూ. 11,300-11,650, 99.1 శాతం రూ. 12,000-12,500, తెల్లనువ్వులు కిరాణా రకం రూ. 13,500-14,000, జడ్-బ్లాక్ ప్రీమియం సరుకు రూ. 24,500-25,000, నల్లనువ్వులు రూ. 23,250-24,500, సాధారణ రకం రూ. 17,500-22,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:46 am
స్థిరత్వం నెలకొన్న కొబ్బరి మరియు నూనె ధరలు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలు పెంచిన తర్వాత దేశంలోని కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా దక్షిణాది రాష్ట్రాల ఉత్పాదకుల వద్ద సరుకు నిల్వలు సమృద్ధిగా పేరుకుపోవడమే ఇందుకు తార్కాణం. ప్రభుత్వం కొనుగోలు చేసిన సరుకు ఏ క్షణాననైనా విక్రయించే అవకాశం ఉంది. కావున స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 9-10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై కిరాణా కొబ్బరి రూ. 13,400-13,500, బంతికొబ్బరి రూ. 14,000-14,300, మెరికో రూ. 13,200-13,300, సాధారణ రకం రూ. 11,000-11,300, అరిసెకేరిలో 500 బస్తాలు స్థానికంగా రూ. 13,700- 14,400, మీడియం రూ. 9800-11,000 మరియు తమిళనాడులోని కొడుముడి, పెరుందురై, వెల్లకోవిల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 9-10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 13,700-14,800, మీడియం రూ. 13,100-14,000 మరియు కేరళలోని కోజికోడ్లో నూనె రూ. 24,500-25,000, బంతి కొబ్బరి రూ. 17,750, మిల్లింగ్ సరుకు రూ. 17,200, దిల్పసంద్ రూ. 17,000, రాజాపురి రూ. 20,500, కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 13,600, స్పెషల్ రూ. 14,300, మెరికో రూ. 14,000, కిరాణా రకం రూ. 16,600-17,000, రూ. 13,250, త్రిచూర్లో నూనె రూ. 22,000-22,400, కొచ్చిలో రూ. 21,900-22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో ప్రతి రోజు 25-30 వాహనాల కొబ్బరికాయల రాబడిపై గుజరాత్ రకం పెద్దసైజు కాయలు రూ. 16,000, మహారాష్ట్ర సరుకు రూ. 13,000, మీడియం రూ. 10,000-11,000, సాధారణ రకం రూ. 7000-8000, గుజరాత్ రకం పాత సరుకు రూ. 13,000, మహారాష్ట్ర రూ. 12,000, మీడియం రూ. 9000-10,000 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:46 am
పెరిగిన వేరుసెనగ సరఫరా - ధరలు బలోపేతం

హైదరాబాద్ : దేశంలో డిసెంబర్ 20 నాటికి నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.89 కోట్ల హెక్టార్ల నుండి తగ్గి 95.22 ల.హె.కు పరిమితమైంది. ఇందులో ఆవాల సేద్యం 93.73 ల.హె. నుండి 88.50 ల.హె., వేరుసెనగ 3.12 ల.హె. నుండి 2.89 ల.హె.కు పరిమితమైంది. అయితే, సానుకూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు సంతృప్తికరంగా ఉండగలవని తెలుస్తోంది. 2024-25 రబీ సీజన్ కోసం డిసెంబర్ 21 నాటికి కర్ణాటకలో వేరుసెనగ సేద్యం 1.08 ల.హె. నుండి పెరిగి 1.45 ల.హె.లో విస్తరించింది. దేశంలోని ప్రముఖ వేరుసెనగ ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ రాబడులు సన్నగిల్లినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-250 వృద్ధి చెందింది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 60-70 వేల బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 80-90 వేల బస్తాలు, రాజస్తాన్ 1.50 లక్షల బసాలు, మధ్యప్రదేశ్ 85-90 వేల బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారంలో 40-50 వేల బస్తాలు, కర్ణాటకలో 50-60 వేల బస్తాల వేరుసెనగ రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని 4-6 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 8-9 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 4500-6400, కర్నూలులో 4-5 వేల బస్తాలు, అనంతపురంలో 3-4 వేల బస్తాలు కదిరి లేపాక్షి రూ. 4200-5000, కె-6 బెస్ట్ పీ-నట్ మిక్స్ సరుకు రూ. 5000-6300. హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9000-9200, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 9400-9500, 60-70 కౌంట్ రూ. 9800-10,000, 60-65 కౌంట్ రూ. 10,800 మరియు తెలంగాణలోని వనపర్తిలో గత వారం 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 5000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు రూ. 3800-4300, హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 7200, 50-60 కౌంట్ రూ. 8150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో రూ. 4500-6200, రాజ్కోట్లో 20-నంబర్ సూపర్ రకం ఎండు సరుకు రూ. 5650-5900, మీడియం రూ. 5400-5700, సాధారణ రకం రూ. 5150-5400, బిటి-39 సూపర్ రకం సరుకు రూ. 5250-5900, మీడియుం రూ. 4500-5000, సాధారణ రకం రూ. 4250-4500, హెచ్పిఎస్ ముంద్రా ఓడరేవు డెలివరి 50-60 కౌంట్ కొత్త సరుకు బోల్డు రూ. 7600, 40-50 కౌంట్ రూ. 8000, 38-42 కౌంట్ రూ. 8200, 39 రకం బోల్డు కొత్త సరుకు 40-50 కౌంట్ రూ. 8100, 35-40 కౌంట్ రూ. 8200, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80-90 కౌంట్ రూ. 7200, 50-60 కౌంట్ రూ. 8150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతి రోజు 40-50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5300-5600, మీడియం రూ. 5000-5300, సాధారణ రకం రూ. 4900-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, దావణగెరి, శీరా, చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి రూ. 4000-5000, కె-6 రూ. 6000-6800, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 8900-9000, 90-100 కౌంట్ రూ. 8700-8800, 70-80 కౌంట్ రూ. 9500-9600, 60-70 కౌంట్ రూ. 9900-10,000, కళ్యాణి రూ. 7300-7400, కె-6 మిక్స్ సరుకు రూ. 8500-8600, 90-100 కౌంట్ రూ. 8700-8800 మరియు రాజస్తాన్లోని జైపూర్, భికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుసెనగ రూ. 4700-5200, హెచ్పిఎస్ 40-50 కౌంట్ రూ. 7700, 50-60 కౌంట్ రూ. 7500, 60-65 కౌంట్ రూ. 7300, 60-70 కౌంట్ రూ. 7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:45 am
నాణ్యమైన చింతపండుకు డిమాండ్ - ఎగబాకుతున్న ధరలు

హైదరాబాద్ : దక్షిణాది రాష్ట్రాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున కొత్త సరుకు కోతల ప్రక్రియ జాప్యమవుతున్నది. దేశవ్యాప్తంగా మట్రోనగరాల కిరాణా మార్కెట్లలో రంగు సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ మార్కెట్లో గత వారం 25-30, పుంగనూరులో 20-25, సాలూరులో 10-15 వాహనాలు కలిసి మొత్తం 70-75 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమి ఫ్లవర్ రూ. 10,000-10,100, మీడియుం రూ. 8000, సాధారణ రకం రూ. 7000, గింజ సరుకు రూ. 4000-4200, రంగు వెలిసిన సరుకు రూ. 3600-3800, హిందుపూర్లో సిల్వర్ మేలిమి రకం రూ. 20,000-27,000, మేలిమి రకం రూ. 15,000-18,000, మీడియం బెస్ట్ రూ. 14,500-15,000, సాధారణ రకం రూ. 11,000-13,500, హిందూపూర్ స్థానిక మ్జార్కెట్లలో ఫ్లవర్ మీడియం బెస్డ్ రూ. 11,500-12,000, మహారాష్ట్ర సరుకు రూ. 12,500, ఫ్లవర్ రూ. 8500-9500, గింజ సరుకు రూ. 4200-4600, మహారాష్ట్ర సరుకు రూ. 4800-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ 11-12 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 9000- 10,500, కర్ణాటక సరుకు రూ. 7500-10,000, మహారాష్ట్ర సరుకు రూ. 9000- 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బెల్గాంవ్లో 2-3 వేల బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ రూ. 8500-9500, మహారాష్ట్ర సరుకు రూ. 12,000-12,500, తుమకూరులో మేలిమి రకం రూ. 16,000-18,000, మీడియం రూ. 12,500-13,000, బార్షీలో మార్చి నెల సరుకు రూ. 10,000-10,500, ఏప్రిల్ రూ. 9500-9800, మే రూ. 9000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 10-15 వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు రూ. 4000-4200, మీడియం రూ. 3400-3800, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ రూ. 11,000, మీడియం సరుకు రూ. 8000-8500, గింజ సరుకు రూ. 3800-4200, తరానాలో 3-4 వాహనాల గింజ సరుకు అమ్మకంపై రూ. 4150-4250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. ప్రస్తుతం తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు చింతపండు తయారీ కష్టతరమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి, పాపరంపట్టి, దిండిగల్ ప్రాంతాలలో గత వారం 30-35 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ. 9000, మహారాష్ట్ర సరుకు రూ. 9800-10,000, గింజ సరుకు స్థానికంగా రూ. 3800-4000, మహారాష్ట్ర సరుకు రూ. 4500-4700, నలగ్గొట్టని చింతపండు స్థానికంగా రూ. 2500-2600, మహారాష్ట్ర సరుకు రూ. 3500-3700, క్రిష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు రూ. 5500-6200, చపాతీ రూ. 4500-4700, మీడియం రూ. 3800-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు ః గత వారం కర్మాగారాల కొనుగోళ్లు కొరవడినందున చింతగింజల ధర ప్రతి క్వింటాలుకు రూ. 100-150 పతనమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు రూ. 3400, పప్పు సూరత్ డెలివరి రూ. 6200, పొడి రూ. 7500-7600, సాలూరులో చింతగింజలు రూ. 3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ చింతగింజలు బార్షీ డెలివరి రూ. 3800, బార్షీలో పప్పు రూ. 6200-6300, పొడి రూ. 6300-6400, తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో చింతగింజలు రూ. 3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:44 am
ధనియాల కొనుగోళ్లు నామమాత్రమే

హైదరాబాద్ : గుజరాత్లో ధనియాల సేద్యం గత ఏడాదితో పోలిస్తే తగ్గినందున స్టాకిస్టులు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్లో సేద్యంపై స్పష్టత లేనప్పటికీ సంతృప్తికరంగానే విస్తరించగలదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. పాత సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున సీజన్ పర్యంతం ధరలు నిలకడగా కొనసాగగలవని చెప్పవచ్చు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 7884 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 196 వృద్ధి చెంది 8080, ఏప్రిల్ వాయిదా రూ. 62 పెరిగి రూ. 8600 వద్ద ముగిసింది. రాజస్తాన్లోని రామ్గంజ్మండిలో గత వారం 15-16 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు రూ. 6900-7100, ఈగల్ రూ. 7300-7400, స్కూటర్ రకం రూ. 7800-8000, కోటాలో 3-4 వేల బస్తాలు, బారన్లో 4-5 వేల బస్తాలు రాబడిపై బాదామీ రూ. 6600-7000, ఈగల్ రూ. 7200-7500 ప్రతి క్వింటాలు మరియు బాదామీ 40 కిలోలు లారీ బిల్టి రూ. 3450, ఈగల్ రూ. 3650, స్కూటర్ రకం రూ. 3800 మరియు ప్రతి క్వింటాలు ధనియూల పప్పు బాదామీ రూ. 7600, ఈగల్ రూ. 7800, స్కూటర్ రకం రూ. 7800 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని గునా మార్కెట్లో 8-9 వేల బస్తాలు, కుంభరాజ్లో 7-8 వేల బస్తాలు, నీమచ్లో 4-5 వేల బస్తాలు, బినాగంజ్లో 500-600 బస్తాలు, మందసోర్లో 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 6800-7200, ఈగల్ రూ. 7300-7600, స్కూటర్ రకం రూ. 7700-8100 ఆకుపచ్చ సరుకు రూ. 8600-9500 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని గోండల్ మార్కెట్లో 17-18 వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ రూ. 7000-7300, ఈగల్+ రూ. 7400-7500, స్కూటర్ రకం రూ. 7800-8000, ఆకుపచ్చ సరుకు రూ. 8500-9500, రాజ్కోట్లో 5-6 వేలు జునాగఢ్లో 3-4 వేల బస్తాలు మరియు ఇతర మార్కెట్లలో 8-10 వేల బస్తాలు బాదామీ రూ. 6600-6800, ఈగల్ రూ. 7000-7250, ఈగల్+ రూ. 7500-7700, స్కూటర్ రూ. 7800-7875, ఆకుపచ్చ సరుకు రూ. 8300-9250 ప్రతి క్వింటాలు వురియుు ఆంధ్ర లోని ఒంగోలులో బాదామీ ధనియూలు రూ. 3625, ఈగల్ రూ. 3700, స్కూటర్ రకం రూ. 3780, ఎసి సరుకు రూ. 3650 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:50 am
సాధారణ కొనుగోళ్లతో స్థిరత్వం చేకూరిన మిర్చి ధరలు

హైదరాబాద్ : ప్రస్తుతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సరఫరా వృద్ధి చెందినప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారడంలేదు. అయితే, మసాలా తయారీదారులు మరియు కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో మసాలా తయారీదారుల నుండి నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలు, తీప్రమైన చలి వీస్తున్నందున ఆశించిన స్థాయిలో సరుకు రాబడి కావడంలేదు. కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ జోరందుకున్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతుల సరుకు తగ్గాయి. వచ్చే వారం నుండి పెరగగలవని తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో డీలక్స్ రకాలదే పైచేయిగా ఉంది. శీతల గిడ్డంగుల నుండి మీడియం, మీడియం బెస్ట్ రకాల రాబడులు అధికంగా అవుతున్నాయి. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారం అవుతున్నందున ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు శీతల గిడ్డంగులలో దాదాపు 25-26 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ సరుకు సరఫరా జనవరి నుండి పోటెత్తవచ్చని తెలుస్తోంది. గత వారం గుంటూరు మార్కెట్ యార్డులో కేవలం నాలుగు రోజుల లావాదేవీలలో 1.50 లక్షల బస్తాలు, పరిసర శీతల గిడ్డంగుల నుండి 60 వేల బస్తాలు కలిసి మొత్తం 2.10 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 1.85 లక్షల బస్తాలు అమ్మకమైంది. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ రూ. 12,500-16,000, అత్యధిక సరుకు రూ. 14,000-15,500, బడిగ-355 రూ. 9000-11,500, సింజెంట బడిగ-5531 రూ. 9000-13,000, డిడి రూ. 10,000-13,000, 341 రూ. 10,000-15,000, నెంబర్-5 రూ. 10,000-14,000, కుబేరా, 273 రూ. 9000-11,000, సూపర్-10, 334 రూ. 13,500-14,500, మీడియం, మీడియం బెస్ట్ రూ. 11,500-13,000, ఆర్మూరు రూ. 10,000-12,000, స్పార్క్-శార్క్ రూ. 12,000-14,500, రోమి రూ. 12,500-15,000, బడిగ-2043 రూ. 10,000-12,000, క్లాసిక్ రూ. 8000-11,000, బుల్లెట్, బంగారం రూ. 9000-13,500, ఎఫ్బి రూ. 6500-8500, తాలు కాయలు తేజ రూ. 7500-8500, ఇతర రకాలు రూ. 3500-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాలలో 56 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 52 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. తేజ, 341, డిడి లాంటి డీలక్స్ రకాలకు డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు రూ. 13,000-16,000, డీలక్స్ రూ. 16,200-16,300, డిడి రూ. 12,000-14,500, సింజెంట బడిగ-5531 రూ. 10,000-13,000, ఆర్మూరు, బడిగ-355 రూ. 10,000-12,000, సూపర్-10, 334 రూ. 11,000-13,000, స్పార్క్-షార్క్ రూ. 10,000-13,000, కుబేరా, 273 రూ. 10,000-12,000, సీడ్ రకాలు మీడియం రూ. 8000-11,000, బడిగ-273 రూ. 10,000-12,000, తాలు కాయలు తేజ రూ. 8000-10,000, డీలక్స్ రూ. 10,500, సాధారణ రకాలు రూ. 4500-7000, డీలక్స్ రూ. 7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం 3-4 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 16,011, తాలు కాయలు రూ. 7000-8000 మరియు 30-35 వేల బస్తాల శీతలగిడ్డంగల సరుకు అవ్ముకం కాగా, తేజ నాణ్యమైన సరుకు రూ. 16,000, మీడియం రూ. 15,000-15,500, తాలు కాయలు రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 2 వేల బస్తాల కొత్త మిర్చి తేజ రూ. 14,000-16,000, 341 రూ. 12,000-14,000 మరియు 25-30 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,000-15,500, మీడియం రూ. 11,000-13,300, 341 నాణ్యమైన సరుకు రూ. 11,500-14,500, 5531 రూ. 10,000-12,000, అగ్ని రూ. 11,000-12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు వుహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి 7-8 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా , సీడ్ క్వాలిటీ నివుు్మ సరుకు రూ. 8000-12,000, తేజ రూ. 12,000-16,000, ఆర్మూర్ రకం రూ. 10,000-12,300, డిడి రూ. 9000-14,000, బడిగ-2043, డిడి రూ. 11,000-14,000, 273 సింజంట రూ. 10,000-12,000, తాలు కాయులు తేజ రూ. 6000-8000, ఇతర రకాలు రూ. 3000-5500 వురియుు 2 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-15,000, ఆర్మూర్ రూ. 10,500-12,000, సింజెంట రూ. 10,000-12,000, సూపర్-10 రూ. 10,000-14,000, డిడి, 341, రూ. 10,000-13,000, 273 రకం రూ. 10,000-12,000, 2043 నాణ్యమైన సరుకు రూ. 10,000-12,500, తాలు కాయులు సీడ్ రూ. 4000-5000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్గీలో సోవు, గురువారాలలో కలిసి 0.95-1.00 లక్ష బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి రూ. 32,000-35,000, 5531 నాణ్యమైన సరుకు రూ. 9,500-13,000, కెడిఎల్ డీలక్స్ రూ. 28,000-31,000, నాణ్యమైన సరుకు రూ. 20,000-24,000, మీడియం రూ. 9000-11,500, 2043 రూ. 10,000-13,000, డిడి రూ. 12,500-14,000, తాలు కాయలు 5531 రూ. 5500-7500, 2043, కెడిఎల్ రూ. 2500-4000 మరియు 30-35 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 20 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బి రూ. 18,000-21,000, మీడియం 16,000-17,000, కెడిఎల్ రూ. 14,000- 16,000, 2043 రూ. 10,000-13,000, 5531 రూ. 9000-11,500, తాలు కాయలు సీడ్ రూ. 5000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై సానియా రూ. 12,000-14,000, రవ్వ రూ. 12,500-15,000, మీడియం రూ. 9000-11,000, తాలు కాయలు రూ. 3500-6000, మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం 20-25 వాహనాల మిర్చి రాబడిపై తేజ రూ. 13,000-15,000, మీడియం రూ. 8000-8500, నందూర్బార్లో 4-5 వేల క్వింటాళ్లు తేజ నిమ్ము సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 3000-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం 40-45 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై వుహి ఫుల్కట్ రూ. 14,500-16,800, మీడియుం రూ. 8500-11,000, తొడిమె సరుకు రూ. 10,500-13,000, తొడిమె తీసిన తాలు కాయులు రూ. 6500-7500, తొడిమె సరుకు రూ. 6000-7000 వురియుు ధామనోద్, ఇండోర్, కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి 10-12 వేల బస్తాల సరుకు రాబడి కాగా, వుహీ రూ. 16,000- 16,500, మీడియుం రూ. 18,000, లాల్కట్ రూ. 17,000- 17,500, తాలు కాయులు రూ. 5500-6000, బోల్డు సరుకు రూ. 4000-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3-4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 14,000-16,000, 4884 రూ. 9000-12,000, తాలు కాయులు తేజ రూ. 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: January 8, 2025, 7:50 am