ఎడతెరిపిలేకుండా రాబడి అవుతున్న ధనియాలు హైదరాబాద్ : ఈ ఏడాది ధనియాల ధరలు పురోగమించే అవకాశం లేనందున స్టాకిస్టులకు కంటిమీద కునుకు కరవైంది. ఎందుకనగా ఉత్పాదక మార్కెట్లలో వారంలో 1.50 లక్షల బస్తాలకు పైగా సరుకు అవుతుండడమే ఇందుకు నిదర్శనం. నామమాత్రపు ఎగుమతి డిమాండ్ మరియు మసాలా తయారీదారుల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుంటే వచ్చే ఏడాది కూడా ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని స్పష్టమవుతున్నది. 2026 సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది.మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ లాంటి ధనియాల ఉత్పాదక రాష్ట్రాలలో రాబడులతో పోలిస్తే అమ్మకాలు కొరవడినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 హెచ్చు-తగ్గులు కొనసాగుతున్నాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా రూ. 7056 తో ప్రారంభమైన శుక్రవారం నాటికి కేవలం రూ. 36 వృద్ధి చెంది రూ. 7092, జూలై వాయిదా 40 పెరిగి రూ. 7170 వద్ద కదలాడుతున్నది. రాజస్తాన్లోని రామ్గంజ్మండిలో గత వారం 20 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు రూ. 6500-6600, ఈగల్ రూ. 6800-6900, స్కూటర్ రకం రూ. 7100-7200, బాదామీ హైదరాబాద్ డెలివరి రూ. 7750, ఈగల్ రూ. 7950, స్కూటర్ రకం రూ. 8500 (జిఎస్టితో) ప్రతి క్వింటాలు మరియు తమిళనాడు కోసం బాదామీ బిల్టి 40 కిలోలు రూ. 3450, ఈగల్ రూ. 3550, స్కూటర్ రకం రూ. 3650-3700, కోటా, బారన్, గంగాపూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 20 వేల బస్తాలు బాదామీ రూ. 6300-6500, ఈగల్ రూ. 6600-6700 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్, కుంభరాజ్, గునా, బినాగంజ్, మందసోర్ మరియు పరిసర మార్కెట్లలో కలిసి గత వారం 60 వేల కొత్త ధనియాలు రాబడిపై బాదామీ రూ. 6200-6500, ఈగల్ రూ. 6800-7100, స్కూటర్ రకం రూ. 7100- 7500 ప్రతి క్వింటాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు కొత్త సరుకు ప్రతి 40 కిలోలు రూ. 3325, ఈగల్ రూ. 3375, స్కూటర్ రకం రూ. 3425, బాదామీ ఎసి సరుకు రూ. 3325 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని గోండల్లో 60 వేల బస్తాల సరుకు అమ్మకంపై ఈగల్ రూ. 6350-6500, ఈగల్+రూ. 6700-6850, నాణ్యమైన సరుకు రూ. 7000-8000, రాజ్కోట్లో 7 వేల బస్తాలు సాధారణ రకం రూ. 5750-5875, బాదామీ రూ. 5900- 6150, ఈగల్ రూ. 6250-6400, ఈగల్+రూ. 6500 -6650, స్కూటర్ రకం రూ. 6750-7000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 7250-8250, జూనాగఢ్లో ఈగల్ క్లీన్ సరుకు రూ. 6900, స్కూటర్ రకం రూ. 7700, జామ్నగర్, జామ్జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 14 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ. 6400 -6600, ఈగల్ రూ. 6700-6900, స్కూటర్ రకం రూ. 7000-7500, రంగు సరుకు రూ. 8000-9000 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:51 amదూసుకుపోతున్న పసుపు వాయిదా హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో పసుపు సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో అడుగంటుతున్న పసుపు నిల్వలు కొత్త సరుకు ప్రారంభం కావడానికి ఎనిమిది సమయం ఉంది. గ్రైండింగ్ యూనిట్ల వద్ద నిల్వలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్షీణించాయి. సెప్టెంబర్లో కొనుగోళ్లు జోరందుకునే అవకాశం కనిపిస్తున్నది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా రూ. 14,274తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 336 వృద్ధి చెంది రూ. 14,610, ఆగస్టు వాయిదా రూ. 528 లాభంతో రూ. 14,930 వద్ద స్థిరపడింది. తద్వారా ప్రత్యక్ష విపణిలో ధరలు వృద్ధి నమోదు చేస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 8 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 13,000-14,000, దుంపలు రూ. 11,800-12,500, పాలిష్ సరుకు కొమ్ములు రూ. 14,500-14,600, దుంపలు రూ. 13,700- 13,800, వరంగల్ వూర్కెట్లో 4 వేల బస్తాలు, కేసముద్రంలో 4 వేల బస్తాలు కొమ్ములు రూ. 10,800-13,300, దుంపలు రూ. 10,500-11,200, సదాశివపేట, వికారాబాద్, మర్పల్లి ప్రాంతాలలో 1200 వేల బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 10,200-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో 30 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 12,400-13,500, దుంపలు రూ. 12,000-12,400, బస్మత్నగర్లో 35 వేల బస్తాలు కొమ్ములు రూ. 12,000-14,000, దుంపలు రూ. 11,800- 12,800, నాందేడ్లో 6 వేల బస్తాలు కొమ్ములు రూ. 12,000-13,100, దుంపలు రూ. 11,600-12,200, సాంగ్లీలో 6 వేల బస్తాలు రాజాపురి కొమ్ములు రూ. 15,000-16,000, కొమ్ములు రూ. 13,000-14,500, దుంపలు రూ. 13,000-13,500, వాషిం, రసోడ్, శేగాంవ్, శీరద్షాపూర్, జింతూరు, మాలేగాంవ్, జ్వాలాబజార్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 8 వేల బస్తాలు కొమ్ములు రూ. 11,200-13,000, దుంపలు రూ. 11,800-12,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:50 amగుంటూరు, ఖమ్మం మిర్చి యార్డులకు ముగిసిన వేసవి విడిది హైదరాబాద్ : తెలంగాణలోని వరంగల్లో మిర్చి యార్డులో గత వారం వ్యాపార లావాదేవీలు ప్రారంభం కాగా ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి యార్డు సోమవారం (జూన్ 9) నుండి ప్రారంభం కానున్నాయి. కావున ఆదివారం సాయంత్రం నుండే రైతుల సరుకు మరియు స్టాకిస్టుల ఎసి సరుకు యార్డులకు తరలించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుండి నాణ్యమైన సరుకు సరఫరా అవుతున్నందున ఇక్కడ నాణ్యమైన సరుకుకు మాత్రమే డిమాండ్ కొనసాగే అవకాశం ఉంది. కర్ణాటకలోని బ్యాడ్గీ మార్కెట్లో గత సోమవారం 8 వేల బస్తాల శీతల గిడ్డంగుల మిర్చి రాబడి కాగా 4 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 2043 రూ. 10,000 -14,000, 5531 రూ. 8500 -10,800, డబ్బీ రూ. 17,000 - 23,000, కెడిఎల్ రూ. 16,500 -20,000, తాలు కాయలు 2043 రూ. 3000-3500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 11,500-13,700, షార్క్-1 రూ. 11,000-12,000ధరతో వ్యాపారమైంది. వరంగల్ మార్కెట్ గత వారం 15 వేల బస్తాల మిర్చి రాబడిపై తేజ రూ. 13,500, మీడియం రూ. 11,000 -13,000, 341 రూ. 12,500, మీడియం రూ. 10,000 -12,000, వండర్హాట్ నాణ్యమైన సరుకు రూ. 14,00-14,500, మీడియం రూ. 11,000-13,500, 5531 రూ. 12,000, దీపిక రూ. 13,000, చపాటా రూ. 18,000 -25,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు వుహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 2500 బస్తాలు తేజ మిర్చి రూ. 7500-11,500, సూపర్ -10, ఆర్మూరు రూ. 6500-9500, 341, 2043 రూ. 8500-11,500, సింజెంట రూ. 4500-8500, 273 రూ. 8500-10,000, తాలు కాయలు తేజ రూ. 3500- 5800, ఇతర రకాలు రూ. 1000-3000 మరియు 2500 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 11,500 -13,000, సూపర్-10 రూ. 10,500 -12,000, ఆర్మూరు రూ. 9500-12,000, తాలు కాయలు రూ. 6000-6500, ఇతర రకాలు రూ. 3500-3800 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:50 amఎడతెరిపి లేకుండా రెండేళ్ల పాటు కొనసాగనున్న మినుముల సరఫరా హైదరాబాద్ : దేశంలో ఏటికేడు మినుముల ఉత్పత్తి ఇనుమడిస్తున్నందున వచ్చే రెండేళ్ల పాటు మినుముల సరఫరాకు లోటుండబోదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. తదనుగుణంగా దేశంలో మినుముల ధరల పెరుగుదలకుకళ్లెం పడగలదని తెలుస్తోంది. ఆఫ్రికా దేశమైన టాంజానియా భారతదేశం కర్ణాటకలోని ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి 24 టన్నుల మినుముల విత్తులు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది కోసం కూడా 50 టన్నులు కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ధార్వాడ్ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరిచిన మినుము విత్తులు మాలవి, నేపాల్తో పాటు మరికొన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు వర్షాలు సంతృప్తికరంగా కురిసినందున గత ఏడాదితో పోలిస్తే విశ్వవిద్యాలయం ఈసారి ముందస్తుగా విత్తుల అమ్మకం ప్రారంభించింది. యుఎఎస్డి మరియు వ్యవసాయ సహకార శాఖ (డిఎసి) సలహాపొందిన కంపెనీలకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన విత్తులు సరఫరా చేస్తోంది. విశ్వవిద్యాలయం వద్ద సరిపడునంతగా విత్తులు అందుబాటులో ఉన్నట్లయితే డిఎసితో పాటు ఇతర కంపెనీలకు కూడా సరఫరా చేయనున్నది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం అభివృద్ధిపరిచిన డిఎస్బి-21, డిఎస్బి-34 మరియు 16 క్వింటాళ్ల సోయాచిక్కుడు, 550 క్వింటాళ్ల మినుములు విక్రయించింది. ఈ ఏడాది మినుములు, పెసల విత్తుల అమ్మకాలు భారీగా వృద్ధి చెందినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.కర్ణాటకలో మార్చి 1 - మే 31 మధ్యకాలంలో సాధారణ వర్షపాతం 115 మి.మీ.కి గాను 149 వృద్ధి చెంది 286 మి.మీ. వర్షపాతం నమోదైందున మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7900 హెక్టార్ల నుండి పెరిగి 12,600 హెక్టార్లలో విస్తరించిందని వ్యవసాయ శాఖ పేర్కొన్నది. మయన్మార్ రైతులకు మినుముల కోసం లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున సేద్యం భారీగా విస్తరించారు. ఉత్పత్తి 10 ల.ట.కు చేరవచ్చని భావిస్తున్నారు. ఇందులో 40 శాతం సరుకు అమ్మకం కాగా 60 శాతం సరుకు మిగులు ఉండగలదు. బ్రెజిల్ మరియు ఇతర దేశాల నుండి భారత్కు మినుములు దిగుమతి అవుతున్నాయి. వచ్చే ఏడాది టాంజానియా నుండి కూడా సరుకు పోటెత్తే అవకాశం ఉంది. భారత్లో నిరంతం రబీ, యాసంగిలో మినుముల సేద్యం విస్తృతంగా సాగవుతున్నది. సోయాచిక్కుడు దయాదాక్షిణాలతో ఖరీఫ్ మినుముల సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది. సానుకూల వాతావరణం వలన ఖరీఫ్ సీజన్లో సేద్యం పరిధి పెరగనున్నట్లు తెలుస్తోంది. దిగుమతి అయిన సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉండడం వలన పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములకు స్థిరత్వం చేకూరింది. ఎస్క్యూ మినుములు 840-845 డాలర్, ఎఫ్ఎక్యూ మినుములు 770 డాలర్ ప్రతిపాదించబడుతున్నది. భవిష్యత్తులో 10 డాలర్ తగ్గే అవకాశం ఉంది. చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు రూ. 7500, ఎఫ్ఎక్యూ రూ. 6725, బ్రెజిల్ సరుకు రూ. 7600-7700, ముంబైలో ఎఫ్ఎక్యూ మినుములు రూ. 6850, కోల్కతాలో రూ. 6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.మధ్యప్రదేశ్లోని జబల్పూర్ గ్రేడెడ్ క్లీన్ సరుకు చెన్నై డెరివరి రూ. 7700, ఆంధ్రప్రదేశ్ పియు-38 రూ. 7300, గుజరాత్ టి-9 మినుములు దేశీ మిక్స్ సరుకు రూ. 8100, ఆంధ్ర పాలిష్ సరుకు రూ. 7400, మహారాష్ట్రలోని సాంగ్లీ, బార్షీ, సోలాపూర్లో 7750-7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, నంద్యాల ప్రాంతాలలో పాలిష్ మినుములు రూ. 7300, అన్-పాలిష్ సరుకు రూ. 7050, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ మినుములు రూ. 7200, అన్-పాలిష్ రూ. 7000, మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 35 వేల బస్తాల సరుకు రాబడిలో కేవలం జబల్పూర్లో 10 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6000-6700, దమోహ్లో రూ. 6000-6650 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:49 amగుజరాత్లో అవిశ్రాంతంగా పోటెత్తుతున్న వాము కొత్త సరుకు రాబడులు హైదరాబాద్ :గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ కోసం వాము సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సేద్యం ప్రారంభించేందుకు మరో 45 రోజుల సమయం ఉంది. అడుగంటిన నాణ్యమైన సరుకు నిల్వలు, చిరు సంచుల ప్యాకింగ్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నందున ఉత్పాదక కేంద్రాల వద్ద నాసిరకం సరుకు రాబడి అవు తున్నప్పటికీ ధర ప్రతి క్వింటాలుకు రూ. 600-700 ఎగబాకింది. గుజరాత్ లో భారీగా పెరిగిన ఉత్పత్తితో ధరలు నేలచూపులు చూస్తున్నందున ప్రస్తుతం ఉత్పాదకులకు తమ నిల్వ సరుకు తప్పనిసరి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా వారంలో 30 వేల బస్తాలకు పైగా సరుకు రాబడి అవుతున్నది. కొందరు వ్యాపారులు తమ సరుకు నీమచ్, జైపూర్, దిల్లీ, కోల్కతా, నాగ్పూర్ లాంటి మహానగరాలకు అమ్మకం కోసం సరుకు తరలిస్తున్నారు. జూలై చివరి వరకు సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్లోని జామ్నగర్ మార్కెట్లో గత వారం 8 వేల బస్తాల వాము రాబడి కాగా నాసిరకం సరుకు రూ. 6000-7000, సాధారణ రకం రూ. 8000-9500, మీడియం రూ. 10,000-11,500, మీడియం బెస్ట్ రూ. 13,500- 14,000, ఆకుపచ్చ సరుకు రూ. 16,000-16,500, ఊంఝా మార్కెట్లో 5 వేల బస్తాలు రాబడిపై నాసిరకం సాధారణ రకం రూ. 8500-9000, మీడియం బెస్ట్ రూ. 11,500-12,500, నీమచ్లో 7 వేల బస్తాల గుజరాత్ సరుకు నలుపు రకం రూ. 5500-6000, సాధారణ రకం రూ. 9500-10,000, మీడియం రూ. 11,500-12,000, మీడియం బెస్ట్ రూ. 13,000-13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో మంగళ, శుక్రవారాలలో కలిసి 500 బస్తాల వాము రాబడిపై ఎరుపు రకం రూ. 13,000 -14,000, తెలుపు రూ. 15,000 -18,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 19,000-22,000, తెలంగాణలోని వికారాబాద్, మర్పల్లిలో 200 బస్తాలు సాధారణ రకం రూ. 9000-9500, మీడియం సరుకు రూ. 11,000-11,350, నాణ్యమైన సరుకు రూ. 11,800-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:48 amవరి స్థానంలో మొక్కజొన్న సేద్యం కోసం సిద్ధమవుతున్న పంజాబ్ రైతులు చండీగఢ్ : పంజాబ్లోని భటిండా, సంగ్రూర్, పఠాన్కోట్, గురుదాస్పూర్, జలంధర్, కపుర్తలా జిల్లా రైతులు పంట వైవిధ్యంలో భాగంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 12 వేల హెక్టార్ల వరి స్థానంలో మొక్కజొన్న సేద్యం చేపట్టేందుకు ప్రయోగాత్మకంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి గురుమీత్సింగ్ ఖుదియానా పేర్కొన్నారు. వ్యవసాయ పర్యావరణానికి రక్షణ, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మొక్కజొన్న సేద్యంపై ఆసక్తి గల రైతులకు ప్రతి హెక్టారుకు రూ. 17,500 (విత్తుల కోసం) ఆర్థిక సాయం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎందుకనగా వరి సేద్యంతో పోలిస్తే మొక్కజొన్న కోసం నీటి వనరుల ఆవశ్యకత తగ్గగలదు. అంతేకాకుండా భూమిలో సారం పెరగడంతో పాటు వ్యవసాయ విధానం బలోపేతం చెందగలదు.రాష్ట్ర వ్యాప్తంగా అడుగంటుతున్న భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలం పాటు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. రైతులను ఉత్సాహం మరియు అవగాహన పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 మంది రైతులతో మిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 1500 హెక్టార్లలో ఖరీఫ్ మొక్కజొన్న సేద్యం విస్తరించినట్లు ప్రభుత్వం యంత్రాంగం వెల్లడించింది. అత్యధిక పోషక విలువలు కలిగిన మొక్కజొన్న మానవాళి మరియు పశుగ్రాసం, పిండి మరియు ఇథనాల్ తయారీ కోసం విరివిగా ఉపయోగించబడుతున్నది. పంట వైవిధ్యం విజయవంతం చేసేందుకు సాంకేతిక సహకారం మరియు శిక్షణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనున్నది.
Updated On: June 9, 2025, 6:47 amపెరిగిన యూసంగి పెసల రాబడులు - ప్రారంభమైన ఖరీఫ్ సేద్యం హైదరాబాద్ : దేశంలో యూసంగి సీజన్ కోసం పెసల ఉత్పత్తి తారా స్థారుుకి చేరుతున్నది. ఖరీఫ్ సీజన్ కోసం పంట సేద్యం ప్రారంభం అరుుంది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం కనీస వుద్దతు ధర పెంచి రూ. 8768 ప్రస్తావించింది. తద్వారా పెసల సాగు వృద్ధిచెందే అవకాశం ఉంది. వురియుు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నట్లరుుతే, 2026లో సంవత్సరంలో సువూరు 8-10 శాతం కంటే పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. దేశంలో వుుందుగానే బుుతుపవనాల ఆగవునం అరుునందున దక్షిణ భారత దేశంలోని ఉత్పాదక కేంద్రాల వద్ద పంట సేద్యం పనులు ప్రారంభవుయ్యూరుు. వురియుు కర్ణాటకలో వాతావరణం సానుకూలంగా ఉన్నందున 2025 వూర్చి 1 నుండి మే 31 వరకు పంట సేద్యం గత ఏడాది 16,400 హెక్టార్లతో పోలిస్తే పెరిగి 16,600 హెక్టార్లకు విస్తరించగా, సేద్యం పనులు వుువ్మురవుయ్యూరుు. వ్యాపారస్తుల అభిప్రాయుం ప్రకారం ఉత్తర కర్ణాటకలోని కల్బుర్గి, బిదర్, రారుుచూర్ ప్రాతాలలోని రైతులు సోయూబీన్ సేద్యం నత్తనడకన చేస్తున్నారు. అరుుతే పెసలు, మినువుులు లాంటి పంటల సేద్యంలో అత్యాసక్తి కనపరుస్తున్నారు. తద్వారా రాబోవు సీజన్లో రాబడులు గత ఏడాదికి ధీటుగా ఉండే అవకాశం ఉన్నది.దేశంలోని ప్రవుుఖ యూసంగి సీజన్ పెసర ఉత్పాదక రాష్ట్రాలలో సరఫరా నిరంతరం కొనసాగుతున్నందున ధరలు యుధావిధిగా ఉన్నారుు. జబల్పూర్, హర్దా, హోషంగాబాద్, రత్లాం వురియుు పరిసర ప్రాంతాల వూర్కెట్లలో కలిసి ప్రతిరోజు సువూరు 15-20 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 5500-7250, గుజరాత్లోని రాజ్కోట్లో 5-7 వేల బస్తాలు వురియుు ఇతర ప్రాంతాలలో సువూరు 15 వేల బస్తాల పెసలు రాబడి కాగా, ధరలు క్షీణించి రూ. 6000-8000, మిటుకులు రూ. 4000-5400 వురియుు ఉత్తరప్రదేశ్లోని ఉరైలో 5 వేల బస్తాలు రూ. 6000-6510, లలిత్పూర్లో 4-5 వేల బస్తాలు రూ. 6000-6300, నాణ్యమైన సరుకు రూ. 6500-7400 ధరతో వ్యాపారమైంది. వుహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్, జాల్నా ప్రాంతాలలో సువూరు 700-800 బస్తాల యూసంగి పెసల రాబడిపై మిల్లు రకం పెసలు రూ.6000-7200, చమ్కీ రూ. 7800-8550 వురియుు రాజస్థాన్లోని నాగోర్, కిషన్ఘడ్, జోధ్పూర్, బికానీర్ ప్రాంతాలలో 8-9 వేల బస్తాల సరుకు రాబడి కాగా, సాదా పెసలు రూ. 5300-6200, నాణ్యమైన సరుఉక రూ. 6800-7400, కేక్డిలో 2200-2500 బస్తాల రాబడిపై రూ. 6800-7200, మెుగర్ పెసలు రూ. 9550-9650, జోధ్పూర్లో మిటుకులు రూ. 4200-4800 వురియుు నోఖాలో 800 బస్తాల రాబడి కాగా, రూ. 4500-5000 వురియుు జైపూర్లో పెసలు రూ. 6600-7500, పెసర పప్పు రూ. 8400-8900 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రాంతపు పెసర పప్పు చెనె్నై డెలివరి రూ. 7400, పాలిష్ సరుకు రూ. 7650, గుజరాత్లోని పోర్బందర్, వేరావెల్ ప్రాంతాలలో పాలిష్ సరుకు రూ. 8350 వురియుు వుధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో క్లీన్ సరుకు రూ. 7900 ధరతో వ్యాపారమైంది. బఠాణీల దిగుమతి సుంకం మినహాయింపుతో ప్రయోజనం పొందుతున్న కెనడా ఉత్పాదకులు సాస్కటూన్ ః భారత ప్రభుత్వం గత ఏడాది పచ్చ పఠాణీలపై ఎత్తివేసిన దిగుమతి సుంకం తుది గడువు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినందున కెనడా ఉత్పాదకులకు భారీ ఊరట చేకూరుతున్నది. నిన్నమొన్నటి వరకు కెనడా నుండి పచ్చ బఠాణీల కోసం చైనా ప్రముఖ దేశంగా ప్రసిద్ధి గాంచింది. అయితే డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి పగ్గాలు చేపట్టిన తర్వాత చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, అల్యూమినియంపై సుంకం విధించిన తర్వాత కెనడా బఠాణీలు, కనోలానూనె మరియు కనోలాపిండిపై చైనా 100 శాతం ప్రతీకార సుంకం విధించింది. ఇలాంటి పరిస్థితులలో కెనడా బఠాణీల కోసం భారత్పైనే ఆశలు పెంచుకుంటున్నది. అంతేకాకుండా దిగుమతి సుంకం మినహాయింపు తుది గడువు వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించడం కెనడాకు భారత్ వెలుదివ్వెలా కనిపిస్తోంది. కెనడాలో బఠాణీల ఉత్పత్తి 31.30 ల.ట. నుండి 13 ల.ట. ఎగుమతి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. ఇందులో సింహభాగం అనగా 12 ల.ట. భారత్ దిగుమతి చేసుకునే అవకాశం విశ్వసిస్తోంది. రష్యాలో 45 ల.ట. ఉత్పత్తికి గాను 20.23 ల.ట. ఎగుమతి అయ్యే అంచనా వ్యక్తమవుతున్నది. ఇందులో అత్యధికంగా 21 ల.ట. చైనాకు ఎగుమతి చేసే అవకాశం ఉంది.శనగలు ః ఈ ఏడాది భారత్ను రుతుపవనాలు ముందస్తుగా స్పృశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణ వర్షపాతంతో (గడిచిన 50 ఏళ్ల సగటు వార్షిక వర్షపాతం) పోలిస్తే 105 శాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ధీమా వ్యక్తం చేసింది. తదనుగుణంగా దేశ వ్యాప్తంగా శనగ ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శనగలతో పాటు నూనెగింజల శ్రేణిలో కుసుమలు, సన్ఫ్లవర్ కోసం రైతులకు లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని జిల్లాలలో ఈ ఏడాది పెసలు, మినుములు, మొక్కజొన్న సేద్యం గత ఏడాదికి ధీటుగా విస్తరించే అవకాశం ఉంది. సంతృప్తికరమైన వర్షాలు కురవడం వలన భూగర్భ జలాలు కూడా పెల్లుబికే అవకాశం ఉంది. 2024-25 సీజన్ కోసం దేశంలో శనగ ఉత్పత్తి 113.40 ల.ట.కు చేరగలదని ప్రభుత్వం భావించింది. గడిచిన ఐదేళ్ల సగటు 119.70 ల.ట. తో పోలిస్తే తక్కువనే చెప్పవచ్చు. తద్వారా ప్రభుత్వం పచ్చ బఠాణీల దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయింపు తుది గడువు పొడిగించాల్సి వచ్చింది.
Updated On: June 9, 2025, 6:40 amపతనమవుతున్న జీలకర్ర వాయిదా ముంబై : ఈ ఏడాది రాజస్తాన్లో జీలకర్ర ఉత్పత్తి సంతృప్తికరంగా రాణిస్తుండగా గుజరాత్, రాజస్తాన్ రైతులు భవిష్యత్తులో ధరలు పెరిగే అంచనాతో సరుకు అమ్మకాలు కుదించినందున సీజన్లో ధరలు దూసుకుపోతున్నాయి. అయితే, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరుకు అమ్మకాలు ప్రారంభించారు. నామమాత్రపు ఎగుమతి డిమాండ్ మరియు పరిమితమైన కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు మరియు సరఫరా అనుగుణంగా డిమాండ్ కొరవడినందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. గత వారం వాయిదా మార్కెట్లో అమ్మకాలు ఒత్తిడికి గురికావడంతో పాటు కొనుగోళ్లు కొరవడినందున పరోక్ష (వాయిదా) ధర ప్రతి క్వింటాలుకు రూ. 1000- 1100 మరియు ప్రత్యక్ష ధర రూ. 500-600 పతనమైంది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా రూ. 20,960 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 1165 పతనమై రూ. 19,795, జూలై వాయిదా 1095 తగ్గి రూ. 20,005 వద్ద కదలాడుతున్నది.గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో 50 వేల బస్తాల జీలకర్ర రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 20,500-21,000, మీడియం రూ. 18,500-19,000, సాధారణ రకం రూ. 17,000-17,500, రాజ్కోట్లో 6 వేల బసాలు సాధారణ రకం రూ. 17,000-17,750, మీడియం రూ. 17,800-18,250, నాణ్యమైన సరుకు రూ. 18,300-18,750 యూరప్ రకం రూ. 19,000-19,250, గోండల్, జామ్నగర్లో 5 వేల బస్తాలు రూ. సాధారణ రకం రూ. 16,000- 17,000, మీడియం రూ. 17,500 - 18,600, నాణ్యమైన సరుకు రూ. 19, 500-20,000 ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని మెడతా, జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 7 వేల బస్తాల జీలకర్ర రాబడిపై సాధారణ రకం రూ. 16,000-17,200, మీడియం రూ. 17,800- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,000 -20,500 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:38 amయూరప్కు పెరిగిన వేరుసెనగ దిగుమతులు - అమెరికాలో కొనసాగుతున్న సేద్యం బ్రసెల్స్ : ఈసారి ఐరోపా సమాఖ్యకు వేరుసెనగ దిగుమతులు భారీగా వృద్ధి చెందాయి. ఇందులో అర్జెంటీనా భాగస్వామ్యం క్రితం ఏడాదితో పోలిస్తే 65 శాతం వృద్ధి నమోదైంది. యూరప్ కోసం వేరుసెనగ ఎగుమతులలో అమెరికాను అధిగమించి చైనా రెండో స్థానం దక్కించుకున్నది. అయితే, యూరప్ కోసం అమెరికా నుండి ఎగుమతులు 60 శాతం తగ్గినప్పటికీ సేద్యం రాకెట్ వేగంతో విస్తరిస్తోంది. యూరప్ దేశాలలో వేరుసెనగ దిగుమతుల కోసం నెదర్లాండ్ ముందు వరుసలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుమతులు 20 శాతం పెరిగాయి. తర్వాత వరుస క్రమంలో ఇటీలీ, స్పెయిన్, పోలండ్ దేశాలు ఉన్నాయి.అంతర్జాతీయ విపణిలో ప్రతి టన్ను హెపిఎస్ 40-50 కౌంట్ 1190 డాలర్, 50-60 కౌంట్ 1150, 60-70 కౌంట్ 1135, జావా 50-60 కౌంట్ 1245, 60-70 1160, 70-80 కౌంట్ 1165 వద్ద కదలాడుతున్నది. జనవరి 1-మే 18 మధ్యకాలంలో ఐరోపా సమాఖ్యకు వేరుసెనగ దిగుమతులు క్రితం ఏడాది ఇదే వ్యవధిలో పోలిస్తే 2,54,259 టన్నుల నుండి 11 శాతం పెరిగి 2,80,835 టన్నులకు చేరాయి. ఇందులో అర్జెంటీనా 1,08,243 నుండి పెరిగి 1,78,518 టన్నులు, చైనా 30,651 నుండి 31,252, ఈజిప్టు 17,592 నుండి 21,445 మరియు దక్షిణాఫ్రికా 688 నుండి పెరిగి 747 టన్నుల సరుకు ఎగుమతి చేశాయి. అమెరికా నుండి ఐరోపా సమాఖ్యకు వేరుసెనగ ఎగుమతులు 54,803 టన్నుల నుండి తగ్గి 22,037 టన్నులు, బ్రెజిల్ 20,041 నుండి 10,798, నికరాగువా 10,267 నుండి 6707, భారత్ 4252 నుండి 3697, ఇజ్రాయెల్ 2923 నుండి 2403, పరాగ్వే 3004 నుండి 879 టన్నులకు పరిమితమయ్యాయి. అమెరికాలో వేరుసెనగ సేద్యం ః అమెరికాలో మే చివరి వారం నాటికి వేరుసెనగ సేద్యం నిర్ధారిత లక్ష్యంలో 69 శాతానికి చేరగా క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4 శాతం అధికమని అమెరికా వ్యవసాయ శాఖ (యుఎస్డిఎ) పేర్కొన్నది. వర్జీనియాలో 90 శాతానికి చేరినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 3 శాతం తరుగు నమోదైంది. నార్త్ కరోలినా, జియోజార్జియా, అలబామా రాష్ట్రాలు ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందినవి. 2025-26 సీజన్ కోసం వేరుసెనగ పంట నూర్పిడి కోసం వాతావరణం సానుకూలించినట్లయితే సెప్టెంబర్ నుండి ప్రారంభం కాగలదు. దాదాపు 7.58 ల.హె.లో విస్తరించగా ఉత్పత్తి 31 ల.ట.కు చేరవచ్చని యుఎస్డిఎ వెల్లడించింది. ఓలామ్ రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు తాండవిస్తున్నాయి.
Updated On: June 9, 2025, 6:38 amపోటెత్తుతున్న కొత్త నువ్వులు - మందగమనంలో ధరలు హైదరాబాద్ : ప్రస్తుతం తూర్పు భారత్లో ఎర్రనువ్వులు కొత్త సరుకు ప్రతి రోజు 15 వేల బస్తాలు, గుజరాత్లో 30 వేల బస్తాల యాసంగి సరుకు, తమిళనాడులో 15 వేల బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో 8 వేల బస్తాలు, ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో 5 వేల బస్తాలు కలిసి మొత్తం 70 వేల బస్తాలు రాబడి అయినందున స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదు. కిరాణా వ్యాపారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. గుజరాత్ తెల్లనువ్వులు ఇతర రాష్ట్రాలకు రూ. 9900-10,100, సార్టెక్స్ రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాష్ట్రంలో మార్చి 1-మే 31 మధ్యకాలంలో సాధారణ వర్షపాతం 115 మి.మీ.కి గాను 149 శాతం పెరిగి 286 మి.మీ. వర్షం కురిసినందున నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4700 హెక్టార్ల నుండి 7100 హెక్టార్లలో విస్తరించింది. సేద్యం ప్రక్రియ కొనసాగుతున్నది.పశ్చిమ బెంగాల్ మార్కెట్లలో ఎర్రనువ్వులు రూ. 6500-6600, ఈరోడ్ డెలివరి రూ. 7800-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.గుజరాత్లో తెల్లనువ్వులు యాసంగి క్రషింగ్ సరుకు రూ. 7500-8500, 98.2 రకం సరుకు రూ. 9000-9500, 99.1 రూ. 9750-9900, కిరాణా రకం రూ. 10,000-10,100, నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 14,250-15,700, సాధారణ రకం రూ. 11,500-13,750, తమిళనాడులోని ఈరోడ్, విరుధ్నగర్, మదురై, ట్రిచి డెలివరి 75 కిలోల బస్తా రూ. 7200 (టాక్స్-పెయిడ్) ధరతో వ్యాపారమైంది.ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాలలో 4 వేల బస్తాల నువ్వులు రాబడిపై రూ. 8900-9000, నరసరావుపేట, ఒంగోలు, కడప ప్రాంతాలలో 6 వాహనాల సరుకు రాబడిపై ఎర్రనువ్వులు రూ. 9000 మరియు తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి ప్రాంతాలలో 10 వాహనాల నువ్వుల రాబడిపై రూ. 8700-9700 మరియు మహారాష్ట్రలోని యవత్మల్, ఆర్ణి, కరంజా ప్రాంతాలలో తెల్లనువ్వులు రూ. 8000-9200, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు రూ. 8700-8800, 99.1 శాతం సరుకు రూ. 9600-9700, కాన్పూర్, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు రూ. 8700-8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:36 am