దూసుకుపోతున్న బంతికొబ్బరి ధరలు బెంగళూరు : బంతి కొబ్బరి ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన కర్ణాటక మరియు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో గతి తప్పిన వాతావరణంతో బంతికొబ్బరి ఉత్పత్తి 50-60 శాతం మేర క్షీణించినందున కిరాణా రకంతో పాటు అన్ని రకాల కొబ్బరి ధరలు రెక్కలు తొడిగాయి. మార్చి నుండి ఇప్పటి వరకు ధరలు దాదాపు 50 శాతం వృద్ధి నమోదు చేశాయి. దక్షిణ భారత్లోని బంతికొబ్బరి మొత్తం ఉత్పత్తిలో కర్ణాటక భాగస్వామ్యం 72.8 శాతం ఉండగా కేరళ 10.2, ఆంధ్రప్రదేశ్ 9, తమిళనాడు భాగస్వామ్యం 7.6 శాతం ఉంది. వేసవి దాహం తీర్చుకునేందుకు కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగి రైతులకు మంచి లాభాలు గిట్టుబాటయ్యాయి. తద్వారా అధిక ధరలు లభ్యమయ్యే బంతి కొబ్బరి ఉత్పత్తి కుంటుపడింది. మార్చి ప్రారంభంలో టిప్టూరులోని ఎపిఎంసి మార్కెట్లో బంతి కొబ్బరి ప్రతి క్వింటాలు నమూనా ధర రూ. 14,000-15,000 నుండి పెరిగి జూన్లో రూ. 20,000, జూన్ 9న రూ. 21,500ను తాకిన తర్వాత ప్రస్తుతం రూ. 22,500 పలుకుతోంది. హుళీయార్, సిరా, తురువెకెరె, చెన్నరాయపట్నం మరియు ఇతర మార్కెట్లలో ప్రస్తుత వారం నమూనా ధర రూ. 20,000 అధిగమిస్తోంది. భారత్లో రెండు రకాలు అనగా మిల్లింగ్ మరియు బంతి కొబ్బరి ఉత్పత్తి అవుతున్నది. మిల్లింగ్ కొబ్బరి ప్రధానంగా నూనె తీయడానికి ఉపయోగిస్తుండగా బంతికొబ్బరి మానవాళి కోసం వంటలలో వినియోగిస్తుంటారు. కొబ్బరికాయలు చెట్టు నుండి కోసిన తర్వాత పగులగొట్టి ఎండలో లేదా డ్రైయర్లో రెండు రోజులు ఆరబెడతారు. ఇదే విధంగా బంతి కొబ్బరి తయారు చేయడానికి దాదాపు 10 రోజుల సమయం పడుతుంది. పక్వానికి వచ్చిన కొబ్బరికాయలు 10-11 నెలల పాటు రైతులు ఆరబెడుతుంటారు. ఇందులోని నీరు లోపలనే ఇంకిపోవడం వలన కొబ్బరిలో మాధుర్యం మరింత పెరిగి రుచి ఇనుమడిస్తుంది. భారతదేశంలో కొబ్బరికాయల మొత్తం ఉత్పత్తిలో 49 శాతం కొబ్బరి తయారీకి వినియోగిస్తుండగా ఇందులో 32 శాతం మిల్లింగ్ మరియు 17 శాతం బంతి కొబ్బరి తయారీకి వినియోగిస్తున్నారని కొబ్బరి అభివృద్ధి బోర్డు పేర్కొన్నది.
Updated On: June 16, 2025, 7:00 amదిగజారుతున్న మెంతుల ధరలు నీవుచ్ - సానుకూల వాతావరణం వలన గుజరాత్, రాజస్థాన్, వుధ్యప్రదేశ్లలోని రైతుల సరుకు విక్రయూలు ఊపందుకున్నారుు. తద్వారా అన్ని వూర్కెట్లలో కలిసి సంతరోజు 55-60వేల బస్తాల సరుకు రాబడి అరుునప్పటికీ, కొనుగోలుదారులు ప్రస్తుతం అనేక దినుసులలో తగ్గుతున్న ధరల దృష్ట్యా తవు అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు దిగజారుడు బాటలో ఉన్నారుు. అరుుతే 2026లో కూడా ధరలు పెరిగే అవకాశం లేదని కొందరు వ్యాపారులు అభిప్రాయుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ట్రేడింగ్ వ్యాపారులకు లాభసాటిగా ఉండగలదు. గత వారం నీవుచ్ వూర్కెట్లో సువూరు 8-9 వేల బస్తాలు, జావ్రాలో 10-12 వేల బస్తాలు, వుందసోర్లో 3-4 వేల బస్తాల సరుకు రాబడి కాగా, సాధారణర రకం రూ. 4000-4200, మీడియుం రూ. 4500-4600, మీడియుం బెస్ట్ రూ. 5000-5500, నాణ్యమైన సరుకు రూ. 6000-6200, నాణ్యమైన ఫాఫ్డా రకం రూ. 9000-9500, మీడియుం రూ. 8000-8500 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. రాజస్థాన్లోని రామ్గంజ్వుండీ, కోటా, నోఖా ప్రాంతాలలో వారంలో 5-6 వేల బస్తాల సరుకు రాబడి కాగా, సాధారణ రకం రూ. 4000-4200, మీడియుం రూ. 4500-4700, నాణ్యమైన సరుకు రూ. 5800-6000 వురియుు గుజరాత్లోని రాజ్కోట్లో 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 4150-4900, మీడియుం రూ. 4950-5750, నాణ్యమైన సరుకు రూ. 5800-6250 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 16, 2025, 6:59 amప్రారంభమైన ఖరీఫ్ సీజన్ కంది సేద్యం - ఆం.ప్ర.లో కొనుగోలు ప్రక్రియ పొడిగింపు హైదరాబాద్ : ఈ ఏడాది నెలకొన్న సానుకూల వాతావరణం, ముందస్తుగా రుతుపవనాలు వ్రవేశించినందున ఖరీఫ్ సీజన్ కంది సేద్యం ప్రారంభించినట్లు కర్ణాటక వ్యవసాయ శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఈసారి కంది సేద్యం కోసం 16.80 ల.హె. లక్ష్యం నిర్దేశించగా జూన్ 6 నాటికి కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 35,600 హెక్టార్ల నుండి తగ్గి 16,600 హెక్టార్లలో విస్తరించింది. సేద్యం కోసం చాలా సమయం ఉంది. దేశంలోని రైతులు మరియు వ్యాపారుల వద్ద భారీగా పేరుకుపోయిన సరుకు నిల్వలు, విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అవుతున్నందున తగ్గించిన ధరలతో ప్రతిపాదిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో జనవరి మొదటి వారంలో లెమన్ కందులు కొత్త సరుకు మార్చి లోడింగ్ కండిషన్పై 785 డాలర్ ప్రతిపాదించగా తాజాగా మరో 85 డాలర్ పతనమై ప్రతి టన్ను 700 డాలర్ వద్ద కదలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ధరల మద్దతు ప్రణాళిక (పిఎస్ఎస్) కింద కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న కందుల కోసం తుది గడువు జూన్ 26 వరకు పొడిగించినట్లు ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ఎందుకనగా దేశీయ సరుకు మరియు దిగుమతి అవుతున్న సరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ధరల పెరుగుదలకు కశ్లెం పడింది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు గడిచిన రెండు వారాలలో 20 డాలర్ తగ్గి ప్రతి టన్ను 700 డాలర్కు పరిమితమైనందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు రూ. 175 తగ్గి రూ. 6100-6125, మట్వారా, మొజాంబిక్ తెల్లకందులు రూ. 5700, గజరి కందులు రూ. 5750, సూడాన్ కందులు రూ. 6300, చెన్నైలో లెమన్ కందులు రూ. 6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర కందులు అన్-క్లీన్ సరుకు చెన్నై డెలివరి జనవరి నుండి ఇప్పటి వరకు రూ. 700 తగ్గి రూ. 7350, గ్రేడింగ్ చేసిన క్లీన్ సరుకు రూ. 7700, గుజరాత్ బిడిఎన్-2 కందులు రూ. 7600, కర్ణాటక ఎర్రకందులు విరుధ్నగర్, సేలం డెలివరి రూ. 7200, తెల్లకందులు రూ. 7500, కట్ని డెలివరి రూ. 6900-7000, రాయిపూర్ డెలివరి రూ. 6700-6725 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో 15 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ. 5800-6650, సాధారణ రకం రూ. 6400-6600, లాతూర్లో మారుతి, తెల్లకందులు, గులాబీ కందులు రూ. 6200-6530, గుజరాత్లోని రాజ్కోట్, దాహోద్ ప్రాంతాల మార్కెట్లలో కందులు మీడియం సరుకు రూ. 5100-5300, కర్ణాటకలోని కల్బుర్గిలో రూ. 6000-6500, పప్పు మేలిమి రకం రూ. 9100- 9200, నాణ్యమైన సరుకు రూ. 9800, సవానంబర్ పప్పు రూ. 8400-8800, లాతూర్, అకోలా, నాగ్పూర్, కట్ని ప్రాంతాలలో పప్పు మేలిమి రకం రూ. 9300-9600, సవానంబర్ రూ. 8600-8900 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 16, 2025, 6:59 amయాసంగి పెసలు, వేరుసెనగ కొనుగోలుకు అనుమతి న్యూదిల్లీ : రైతులు తాము పండించిన పంటలకు లాభసాటి ధరలు గిట్టుబాటయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ధరలు మద్దతు ప్రణాళిక (పిఎస్ఎస్) ఉపయోగిస్తుంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పిఎస్ఎస్ కింద పంటల కొనుగోలు ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 54,166 టన్నుల పెసలు, ఉత్తరప్రదేశ్ నుండి 50,750 టన్నుల వేరుసెనగ కనీస మద్దతు ధర (ఎంఎస్పి) తో కొనుగోలు చేయనున్నట్లు చౌహాన్ తెలిపారు. ఈ కొనుగోళ్లు 2025-26 యాసంగి పంటతో ముడి పెట్టనున్నది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) మరియు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సిసిఎఫ్) లాంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కందుల కొనుగోలు తుది గడువు మరో 15 రోజులు అనగా జూన్ 26 వరకు పొడిగించినట్లు శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. విదేశాల నుండి సరుకు దిగుమతులకు కోత విధించడంతో పాటు దేశీయ రైతులకు సాయం అందిస్తూ పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 2024-25 కోసం పిఎస్ఎస్ కింద రైతులు పండించిన మొత్తం సరుకు అనగా కందులు, మినుములు, సిరిశనగ ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రణాళిక 2028-29 సీజన్ వరకు మనుగడలో ఉండగలదు.
Updated On: June 16, 2025, 7:16 amమందగమనంలో చలిస్తున్న శనగల ధరలు - ఆందోళనలో స్టాకిస్టులు హైదరాబాద్ : దేశంలోని వ్యాపారులు మరియు రైతుల వద్ద భారీయెత్తున శనగల నిల్వలు పేరుకుపోయాయి. అంతేకాకుండా అధిక సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసిన వ్యాపారులకు గిడ్డంగి అద్దె, పెట్టుబడిపై వడ్డీ మరియు ధరలు దిగజారుడు బాట పట్టినందున వ్యాపారులకు కంటిమీద కునుకు కరవైంది. పప్పు మిల్లర్లు, పట్నాల పప్పు తయారీదారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. శూన్య శాతం సుంకంపై బఠాణీల దిగుమతులు పోటెత్తుతున్నందున వ్యాపారులు అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. కావున ఇలాంటి పరిస్థితులలో ధరలు పెరగడం మృగ్యమని చెప్పవచ్చు. ఖరీఫ్ సేద్యం ముగిసిన తక్షణమే రైతుల సరుకు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజులలో టాంజానియా, ఆస్ట్రేలియా నుండి సరుకు దిగుమతి అయే అవకాశం ఉంది. ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 5450, ఆస్ట్రేలియా సరుకు రూ. 5600, సూడాన్ కాబూలీ శనగలు రూ. 6400, ఆంధ్రప్రదేశ్ సరుకు విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 6300, కర్ణాటక సరుకు రూ. 6350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్లో అన్నిగిరి శనగలు రూ. 5500-5600, విజయ శనగలు రూ. 5300-5650, అకోలా, అమరావతి ప్రాంతాలలో సాదా శనగలు రూ. 5200-5450, దూధ్ని, సోలాపూర్లో మిల్లు రకం శనగలు రూ. 5500-5700, గుజరాత్ మార్కెట్లలో దేశీ సరుకు రూ. 5000-5300, ముళ్లశనగలు రూ. 5300-5600, కాబూలీ శనగలు రూ. 7500-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.దిల్లీలో గత వారం రాజస్తాన్ సరుకు రూ. 5775-5750, మధ్యప్రదేశ్ సరుకు రూ. 5675-5700 మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి 15 వేల బస్తాలు రూ. 4500-5400, విశాల్ శనగలు రూ. 5200-5600, కాబూలీ శనగలు రూ. 7500-9000, ఇండోర్లో విశాల్ శనగలు రూ. 5500-5600, ముళ్లశనగలు రూ. 5650-5800, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 10,900, 44-46 కౌంట్ రూ. 10,600, 46-48 కౌంట్ రూ. 10,300, 50-52 కౌంట్ రూ. 9600, 58-60 కౌంట్ రూ. 8150, 80-85 కౌంట్ రూ. 6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.రాజస్తాన్లోని మార్కెట్లలో రూ. 5100-5225 మరియు ఉత్తరప్రదేశ్లో రూ. 5400-5500 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 5800-5900, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6100-6200, డాలర్ శనగలు రూ. 8500-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 16, 2025, 6:55 amయాసంగిలోనూ సాగు యోగ్యమైన కంది వంగడాల అభివృద్ధి హైదరాబాద్ : అపరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోదన సంస్థ (ఇక్రిసాట్) అభివృద్ధిపరిచిన కంది వంగడం 120 రోజుల్లోనే పంట చేతికి రానున్నది. ఏడాది పొడుగునా సాగు చేసే వెసులుబాటు కలిగివుంది. తెగులు, అధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్ తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకత. ప్రస్తుతం ఖరీఫ్ పంట కోతలు ముగిసిన తర్వాత దాదాపు 1.20 కోట్ల హెక్టార్ల భూమిని నిరిపుయోగంగా వదిలేస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ భూమిని కంది సేద్యం కోసం వినియోగించవచ్చు. ప్రస్తుతం సాగు చేస్తున్న వంగడాలు ఖరీఫ్ సీజన్కు మాత్రమే అనువైనవి. ఈ పంట ఆరు నెలలకు చేతికి అందివస్తుండగా ప్రతి ఎకరం దిగుబడి 6 క్వింటాళ్లు మాత్రమే. ప్రస్తుతం అభివృద్ధిపరిచినసరికొత్త వంగడంతో 10 క్వింటాళ్లు దిగుబడి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతియేటా 35 ల.ట. ఉత్పత్తి అవుతుండగా దేశీయ వినియోగం భర్తీ చేసేందుకు మరో 15 ల.ట. కందులు దిగుమతి చేసుకోవలసి వస్తోంది. దీని వలన ప్రతియేటా 80 కోట్ల డాలర్ విదేశీయ మారకం భారత్ కోల్పోతున్నది. ఐసిపివి-25444 వంగడాన్ని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ ఆవిష్కరిస్తూ, పంట విత్తిన 40 రోజులలో పూత దశకు చేరుకుంటుందని మరియు మొత్తం 120 కాలావధిలో పంట చేతికి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రైతులకు ప్రతి హెక్టారు దిగుబడి 1110-1120 కిలోలకు గాను తాజాగా రూపొందించిన సరికొత్త వంగడంతో 2 టన్నులు లభ్యం కాగలదని కూడా ఆయన అన్నారు. ఇకనుండి దేశంలోని పలు ప్రాంతాలలో యాసంగిలో కంది సేద్యం చేపట్టవచ్చు. ఎందుకనగా నీటి వనరుల ఆవశ్యకత నామమాత్రమే ఉండగలదు. కర్ణాటక, ఒడిశ్సా, తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పంట విజయవంతమైంది. ఏడాది పొడుగునా సేద్యానికి అనువైన వంగడాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. దీని వలన దేశంలో అపరాల కొరత తీర్చడం మరియు సాగులో ఎదురవుతున్న సవాళ్లు ఎదుర్కొనేందుకు దోహదపడగలదు.
Updated On: June 16, 2025, 6:55 amతమిళనాడులో పెంచిన పెసల కొనుగోలు లక్ష్యం చెన్నై : తమిళనాడులోని మయిలాడుథురై జిల్లాలో రైతుల అభ్యర్థన మేరకు ధరల మద్దతు ప్రణాళిక (పిసిఎస్) కింద పెసల కొనుగోలు లక్ష్యం పెంపొందించబడింది. తదనుగుణంగా రైతులు స్వేచ్ఛా విపణిలో ప్రతి క్వింటాలు మద్దతు ధరకు దిగువన విక్రయించాల్సిన అవసరం తప్పింది. ప్రతి క్వింటాలు రూ. 8682 మద్దతు ధరతో జిల్లాలో 390 కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాత స్థానిక రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మరో 1092 టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి లభించింది. జూన్ 29 వరకు ప్రతి హెక్టారుకు 384 కిలోలు మరియు ప్రతి ఎకరానికి 155 కిలోల చొప్పున కొనుగోలు ప్రక్రియ నిర్వహించబడుతుంది.రైతులకు లాభసాటి ధర గిట్టుబాటయ్యేందుకు నాఫెడ్ సహకారంతో పిఎస్ఎస్ అమలు చేయబడింది. కొనుగోలు ప్రక్రియ నాగపట్నం మార్కెటింగ్ కమిటీలో భాగాంగా మయిలాడుథురై, కుథాలమ్, సెంబర్కోయిల్, సిక్కాజి సాధారణ కేంద్రాల నుండి కొనుగోళ్లు నిర్వహించబడతాయి. సవరించిన లక్ష్యంలో సెంబర్కోయిల్లో 425 టన్నులు, కుథాలమ్లో 222 టన్నులు, మయిలాడుథురైలో 238 టన్నులు, సిర్కాజిలో 207 టన్నులు కొనుగోలు చేయబడుతుంది. నాఫెడ్ నిర్ధారించిన ప్రమాణాలకు అనుగుణంగా సరుకు కొనుగోలు కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ హెచ్. ఎస్. శ్రీకాంత్ రైతులను కోరారు. తద్వారా కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగగలదని ఆయన అన్నారు. సరుకులో వ్యర్థాలు 2 శాతం, ఇతరత్రా విత్తులు 3 శాతం, తీవ్రంగా పాడైన సరుకు 3 శాతం, స్వల్పంగా పాడైన సరుకు 4 శాతం, పూర్తిగా పక్వానికి రాని సరుకు 3 శాతం, పాడైన సరుకు 4 శాతం మరియు సరుకులో నిమ్ము 12 శాతం మించకూడదని అధికారులు పేర్కొన్నారు.
Updated On: June 16, 2025, 6:53 amకర్ణాటకలో ప్రారంభమైన కందుల సేద్యం హైదరాబాద్ : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తు ప్రవేశించడంతో పాటు సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున మే 31 నాటికి రాష్ట్రంలో కంది సేద్యం గత ఏడాది పర్యంతం 8800 హెక్టార్లలో విస్తరించగా ఈసారి ఇప్పటి వరకే 4100 హెక్టార్లకు చేరింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం కందుల మద్దతు ధర రూ. 450 పెంచి రూ. 8000 నిర్ధారించినందున ఉత్తర కర్ణాటకలో మరో రెండు వారాలలో సేద్యం ప్రక్రియ జోరందుకోనున్నది. ఆప్రికా దేశాలలో గణనీయంగా పెరిగిన కందుల ఉత్పత్తి వలన భారత్ దిగుమతులు పోటెత్తే అంచనాతో అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 55 డాలర్ తగ్గి 720 డాలర్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు రూ. 55 తగ్గి రూ. 6350-6400, మట్వారా, మొజాంబిక్ కందులు రూ. 6150, గజరి కందులు రూ. 5850, అరుశ కందులు రూ. 6250-6300, చెన్నైలో లెమన్ కందులు రూ. 6400 ధరతో వ్యాపారమైంది. వుుంబైలో దిగువుతి అరుున లెవున్ కందులు రూ. 6350-6400, వుట్వారా వురియుు మెుజాంబిక్ తెల్ల కందులు రూ. 6150, గజరీ రూ. 5850, అరూష రూ. 6250-6300, చెనె్నైలో లెవున్ కందులు రూ. 6400 ధరతో వ్యాపారమైంది. వుహారాష్ట్ర కందులు చెనె్నై డెలివరి రూ. 7500-7600, గజరాత్ ప్రాంతపు బిడిఎన్ రూ. 7700-7800 ధరతో వ్యాపారమైంది. కర్ణాటక కందులు విరుధ్నగర్, సేలం డెలివరి ఎర్ర కందులు రూ. 7300, తెల్లవి రూ. 7600, కర్ణాటక సరుకు కట్నీ డెలివరి రూ. 6800-6850, రారుుపూర్ డెలివరి కర్ణాటక, వుహారాష్ట్ర సరుకు రూ. 6900-6950 ధరతో వ్యాపారమైంది.వుహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 12-15 వాహనాల కందుల రాబడి కాగా, గులాబీ రకం రూ. 6500-6900, సాధారణ రకం రూ. 6700-6850, లాతూర్లో వూరుతి, తెలుపు రకం, గులాబీ రకాలు రూ. 6500-6700 వురియుు కర్ణాటకలోని రారుుచూర్, గదగ్, హుబ్లీ, సేడం ప్రాంతాలలో రూ. 6500-6700, కల్బుర్గిలో రూ. 6000-6900 ధరతో వ్యాపారమైంది.గుజరాత్లోని రాజ్కోట్లో రూ. 6000-6800, లాతూర్లో పట్కా పప్పు రూ. 10,100-10,500, సవా నంబర్ పప్పు రూ. 9000-9300, అకోలాలో పట్కా పప్పు రూ. 9600-10,900, సవా నంబర్ రూ. 8600-9200 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:53 amధార్వాడ్ మినుముల విత్తులు కొనుగోలు చేసిన టాంజానియా ధార్వాడ్ : ఆఫ్రికా దేశమైన టాంజానియా భారతదేశం కర్ణాటకలోని ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి 24 టన్నుల మినుముల విత్తులు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది కోసం కూడా 50 టన్నులు కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ధార్వాడ్ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరిచిన మినుము విత్తులు మాలవి, నేపాల్తో పాటు మరికొన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల ముందస్తు వర్షాలు సంతృప్తికరంగా కురిసినందున గత ఏడాదితో పోలిస్తే విశ్వవిద్యాలయం ఈసారి ముందస్తుగా విత్తుల అమ్మకం ప్రారంభించింది. యుఎఎస్డి మరియు వ్యవసాయ సహకార శాఖ (డిఎసి) సలహాపొందిన కంపెనీలకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన విత్తులు సరఫరా చేస్తోంది. విశ్వవిద్యాలయం వద్ద సరిపడునంతగా విత్తులు అందుబాటులో ఉన్నట్లయితే డిఎసితో పాటు ఇతర కంపెనీలకు కూడా సరఫరా చేయనున్నది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం అభివృద్ధిపరిచిన డిఎస్బి-21, డిఎస్బి-34 మరియు 16 క్వింటాళ్ల సోయాచిక్కుడు, 550 క్వింటాళ్ల మినుములు మరియు 35 క్వింటాళ్ల ఉల్లి విత్తులు విక్రయించింది. ఈ ఏడాది ఉల్లి విత్తుల అమ్మకాలు కొంతమేర తగ్గినట్లు తెలుస్తోంది. సహజంగా ఉల్లి విత్తులు సున్నితమైనవి కావున దీర్ఘకాలం పాటు నిల్వ చేసే అవకాశం ఉండదు. గత ఏడాది ఉత్పత్తికి నష్టం వాటిల్లినందున ఈ ఏడాది 65 క్వింటాళ్ల పెసల విత్తులు విక్రయించింది. అయితే ఈసారి పరిస్థితిని అంచనా వేసిన విశ్వవిద్యాలయం 855 క్వింటాళ్లు నిల్వ చేయగా ఇందులో 800 క్వింటాళ్లు అమ్మకమైంది. గడిచిన 50 ఏళ్లలో 300 కొత్త వంగడాల విత్తులు అభివృద్ధిపరిచినట్లు యుఎఎస్డి వైస్ ఛాన్సలర్ డా. పి. ఎల్. పాటిల్ తెలిపారు. ఈ ఏడాది అదనంగా మరో 15 శాతం ఉత్పత్తికి అవకాశం ఉంది. భారత్తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నది. మహారాష్ట్ర, ఒడిశ్శా, గోవా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల విత్తన సంస్థలకు కూడా సరఫరా చేయనున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు రవాణా చేయబడింది. ఎసి సరుకు అమ్మకాలతో బలోపేతం చెందుతున్న బెల్లం ధరలు హైదరాబాద్ ః కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర్ మరియు తమిళనాడు చెరకు ఉత్పాదక ప్రాంతాలలో రుతుపవనాల వర్షాలు సంతృప్తికరంగా కురిసినందున చెరకు పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. 2025-26 సీజన్ కోసం దేశంలో పంచదార ఉత్పత్తి వృద్ధి చెందే అంచనాతో ఇరు రాష్ట్రాల మిల్లులలో చెరకు డిమాండ్ నామమాత్రంగా ఉండగలదు. తద్వారా బెల్లానికి లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున సరుకు తయారీ ఇనుమడించగలదు. కావున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు. తద్వారా బెల్లం ధరల పెరుగుదలకు కళ్లెం పడే అవకాశం ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు ముగిసినందున శీతల గిడ్డంగుల సరుకు అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం పరిమితంగా ఉన్న నిల్వలు మరియు రాబోయే పండుగల కోసం కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు అధికంగా ఉన్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి నమోదైంది.ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూన్ 2 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాదితో ఇదే వ్యవధితో పోలిస్తే 11,63,443 నుండి 2,11,144 బస్తాలు తగ్గి 9,52,299 బస్తాలకు పరిమితం కాగా ఇందులో చాకూ బెల్లం 5,41,229 నుండి తగ్గి 4,47,217 బస్తాలు, పాప్డి 1,64,839 నుండి 1,32,883, రస్కట్ 39,344 నుండి 36,252, ఖరుపా 15,360 నుండి 8044, చదరాలు 1,41,644 నుండి 1,38,491, రాబిటన్ 2,25,643 నుండి 1,88,962 బస్తాలకు పరిమిత మయ్యాయి.ముజఫర్నగర్లో గత వారం 3 వేల బస్తాల సరుకు రాబడిపై ప్రతి 40 కిలోలు రస్కట్ రూ. 1200 -1325, ముద్ద్డబెల్లం రూ. 1650- 1700, ఖరుపా రూ. 1450-1500 మరియు పాప్డి 100 కిలోలు రూ. 3800 -4100 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 2 వేల దిమ్మల ఎసి బెల్లం అమ్మకంపై సురభి రకం రూ. 4200 -4300, మీడియం రూ. 3950-4000, ఎరుపు-నలుపు మిక్స్ సరుకు రూ. 3700-3850, సోలాపూర్లో 1000 దిమ్మలు రాబడిపై సురభి నాణ్యమైన సరుకు రూ. 4250-4300, మీడియం రూ. 3700-3800, కొల్హాపూర్లో 20 వేల దిమ్మలు రూ. 4000-4500 మరియు మధ్యప్రదేశ్లోని బైతుల్లో ప్రతి రోజు 400 క్వింటాళ్లు రూ. 3540-3911 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో రాబడులు క్షీణించాయి. గులాబీ రకం రూ. 4800-4850, నలుపు రూ. 3800-3850, చిత్తూరులో 25 వాహనాల సరుకు అవ్ముకంపై సూపర్-ఫైన్ రూ. 5200-5300, సురభి రూ. 4900-5000, నలుపు రూ. 4100-4200 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని శిమోగాలో గత వారం 25 వాహనాల సరుకు రాబడిపై దేశీ బెల్లం రూ. 4250-4300, మాండ్యాలో ప్రతి రోజు 25 వాహనాలు సాధారణ రకం రూ. 4800-5000, 10 కిలోల దిమ్మలు 5000-5200, ఒక కిలో దిమ్మలు రూ. 5250-5300, అర కిలో దిమ్మలు రూ. 5400 మరియు హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం 10 కిలోల ప్యాకింగ్ రూ. 5700 -5800, సాంగ్లీ సరుకు రూ. 4900 -5000, ఒక కిలో దిమ్మలు రూ. 4700- 4800, అర కిలో దిమ్మలు రూ. 4800-4900, ముద్దబెల్లం మహారాష్ట్ర సరుకు రూ. 4500-4600, ఉత్తరప్రదేశ్లోని మంగుళూరు ముద్దబెల్లం రూ. 5100-5200 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:52 amస్టాకిస్టుల శనగ అమ్మకాలపై పెరుగుతున్న ఒత్తిడి హైదరాబాద్ : ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 5550-5575 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. టాంజానియాలో ఆగస్టులో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అంచనాతో మహారాష్ట్ర స్టాకిస్టలు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. ఆస్ట్రేలియా శనగలు రూ. 5675. ముంద్రా ఓడరేవు డెలివరి రూ. 5575 ప్రతి క్వింటాలు ధరతో నామమాత్రపు సరుకు అమ్మకమైంది. దేశంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్న సరుకు నిల్వలు మరియు బఠాణీల దిగుమతులపై శూన్య శాతం సౌలభ్యం తుది గడువు పొడిగించినందున అపరాల కొనుగోళ్లు క్షీణించాయి. పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. తమిళనాడు పుట్నాల తయారీ కర్మాగారాలు ఏరోజుకారోజు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం సరుకు ఈరోడ్ డెలివరి రూ. 6350, కర్ణాటక సరుకు రూ. 6450 ధరతో వ్యాపారమవుతుండగా మహారాష్ట్ర విక్రేతలు రూ. 6300 కే తమ సరుకు విక్రయించేందుకు కృషి చేస్తున్నారు. అయితే, తమిళనాడు పుట్నాలపప్పు మిల్లర్లు ఆంధ్ర, కర్ణాటక సరుకునే కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మహారాష్ట్రలోని లాతూర్లో 5 వేల బస్తాల శనగల రాబడిపై రూ. 5200-5550, అకోలా, అమరావతి, ఖామ్గావ్, ధరియాపూర్, కరంజా, హింగన్ఘాట్ ప్రాంతాలలో రూ. 5200-5500, దూధ్ని, సోలాపూర్లో మిల్లు రకం శనగలు రూ. 5100-5700, అన్నిగిరి శనగలు రూ. 5800-6000, రాజ్కోట్లో 2 వేల బస్తాల శనగలు దేశీ సరుకు రూ. 5200-5350, ముళ్లశనగలు రూ. 5450-5550 మరియు 1500 బస్తాల కాబూలీ శనగలు రూ. 7400-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిల్లీలో గత వారం 25 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5775-5800, మధ్యప్రదేశ్ సరుకు రూ. 5700-5750 మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి 25 వేల బస్తాలు రూ. 4500-5200, దేవాస్లో 1500 బస్తాల కాబూలీ శనగలు రూ. 7000-8900, ఉజ్జయిన్లో రూ. 7500-8800, ఇండోర్లో రూ. 8000-8400, సాదా శనగలు రూ. 5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని మార్కెట్లలో రూ. 5000-5400 మరియు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లిలిత్పూర్లో 5400-5600 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 5800-5900, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6000-6400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 9, 2025, 6:52 am