Subscription Service

All Ads in Telugu

నగదు, వాయిదా మార్కెట్లో ఎగిసిపడుతున్న పసుపు ధరలు

హైదరాబాద్ : దేశంలో పసుపు సేద్యం ప్రక్రియకు చరమాంకంలో పడింది. మహారాష్ట్రలో సంతృప్తికరంగా విస్తరించినప్పటికీ నీటి వనరులు కొరవడినందున తమిళనాడులో సేద్యం తగ్గినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గత ఏడాదికి ధీటుగా విస్తరించగా మిగిలిన రాష్ట్రాలలో వాతావరణం ఆధారంగా సేద్యం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశ్శాతో పాటు అన్ని రాష్ట్రాలలో వర్షాలు కురిసిన తర్వాత రైతులు తమ నిల్వ సరుకు విక్రయిస్తుండగా, తమిళనాడులో ఇందుకు భిన్నంగా వేచి-చూచే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత వృద్ధి చెందిన ధరలను దృష్టిలో పెట్టుకొని చిన్నతరహా రైతులు తమ సరుకు విక్రయించగా, దిగ్గజ రైతులు ప్రస్తుతం నగదు, వాయిదా ధరలను అనుసరించి సరుకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని వాషిం, రిసోడ్, హింగోళి, బస్మత్నగర్, నాందేడ్ ప్రాంతాలలో కలిసి గత వారం 75 వేల బస్తాల పసుపు రాబడి అయినప్పటికీ ధరలు ఒరవడి కొనసాగుతున్నందున వాయిదా మార్కెట్ వద్ద స్పెక్యులేటర్లు అప్రమత్తమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. మహారాష్ట్రలో పసుపు సేద్యం విస్తృతంగా విస్తరించగా గత వారం కురిసిన వర్షాలకు పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. అయితే, ఉత్పత్తి భవిష్యత్ వాతావరణంపై ఆధారపడి ఉండగలదు. ఎందుకనగా ఈసారి సూపర్ ఎల్నెనొ పొంచివుడడమే ప్రధాన కారణం. కావున నగదు మరియు వాయిదా ధరలు మరింత వృద్ధి చెందగలవని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద సోమవారం ఆగస్టు వాయిదా రూ. 21,234 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 456 వృద్ధి చెంది రూ. 21,690, అక్టోబర్ వాయిదా రూ. 736 పెరిగి రూ. 21,540 మరియు డిసెంబర్ రూ. 648 ఇనుమడించి రూ. 21,650 వద్ద ముగిసింది. మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో గత వారం 20 వేల బస్తాలు, బస్మత్నగర్లో 10 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 15,500-17,000, దుంపలు రూ. 15,400–16,400, వాషింలో సోమవారం (జూలై 27) 28 వేల బస్తాలు, రిసోడ్ 12 వేలు, కరంజా 2 వేలు, నాందేడ్లో 2 వేల బస్తాలు కొమ్ములు రూ. 16,000–17,400, దుంపలు రూ. 15,000–15,500, శుక్రవారం సాంగ్లీ మార్కెట్లో 1000 బస్తాల సరుకు రాబడిపై రాజాపురి రూ. 20,000-20,200, దుంపలు రూ. (మిగతా 2వ పేజీలో

Updated On: August 3, 2026, 7:54 am
మెంతుల భవిష్యత్తు ఉజ్జ్వలం

హైదరాబాద్ : వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల తర్వాత మెంతుల కొనుగోలు జోరందుకుంటున్నందున వ్యాపారులు మరియు స్టాకిస్టుల అమ్మకాలు ధరల పురోగమనానికి కళ్లెం పడింది. డిసెంబర్ చివరి నాటికి నిల్వలు అడుగంటిన తర్వాత జనవరి-మార్చి శీతాకాలం డిమాండ్తో ధరలు వృద్ధి చెందే అవకాశం ఉంది. రబీ సీజన్ కోసం వెల్లుల్లి, శనగ, ఆవాలు, ధనియాల సేద్యంపై రైతులు ఆసక్తి చూపుతున్నందున మెంతుల సేద్యం తగ్గి ఉత్పత్తి ప్రభావితం కానున్నది. రాజస్తాన్లోని బికనీర్, నోఖా, కోటా, బారన్ మరియు ఇతర ప్రాంతాలలో రూ. 6100–6300 మరియు మధ్య ప్రదేశ్లోని నీమచ్లో 4 వేల బసాలు, జావ్రలో 6 వేల బస్తాల సరుకు రాబడిపై పాపా నాణ్యమైన సరుకు రూ. 7800-9500, నాణ్యమైన పచ్చ సరుకు రూ. 6750-6950, సాధారణ రకం రూ. 6400–6500, పాత నాణ్యమైన సరుకు రూ. 6350-6450, సాధారణ రకం రూ. 6150–6350, మందసోసోర్లో 1500 బస్తాలు సాధారణ రకం రూ. 5900-6300, సన్న రకం మీడియం రూ. 6450-6600, నాణ్యమైన సరుకు రూ. 6700-6800, బోల్డు సరుకు రూ. 7800-8300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్, గోండల్, జామ్నగర్, జునాగఢ్, ఊంఝా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3 వేల బస్తాలు మెంతులు రాబడిపై సాధారణ రకం . 4800-6550, . 6600-7300, సరుకు రూ. 7350-8100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: August 3, 2026, 7:53 am
దక్షిణాదిలో కొత్త వేరుశనగ రాబడులు ప్రారంభం

హెదరాబాద్ – ప్రస్తుత సీజన్లో జూలె, 31 వరకు దేశంలో వేరుశనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 41 లక్షల 90 వేల హెక్టార్ల నుండి పెరిగి 43 లక్షల 06 వేల హెక్టార్లకు చేరగా ఇందులో రాజస్తాన్లో 29 జూలె వరకు 9 లక్షల 58 వేల 514 హెక్టార్ల నుండి పెరిగి 10 లక్షల 70 వేల 852 హెక్టార్లకు చేరింది. గుజరాత్లో జూల్మె 27 వరకు వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 20 లక్షల 11 వేల 129 హెక్టార్ల నుండి తగ్గి 17 లక్షల 50 వేల 871 హెక్టార్లకు చేరగా, మహారాష్ట్రలో 72 శాతం అనగా 1 లక్ష 19 వేల హెక్టార్లు ఉంది. ఈ ఏడాది వేరుసెనగ ధరలు భారీగా పెరగడంతో కర్ణాటక, ఆంధ్రలలో రెతులు చెరువులు, బావులు, బోరు బావుల క్రింద సాగు చేపట్టడం జరిగింది. కర్నూలు ప్రాంతంలో 25-30 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 45-50 వేలు, నరపాల, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్ ప్రాంతాలలో 10-15 వేల బస్తాలు, ఆదోనిలో 55-60 వేల బస్తాలు, కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరే ప్రాంతాలలో 30-35 వేల బస్తాలు సహా వారంలో 1.80 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై నిమ్ము రకం రూ. 5500-6000, పాత నాణ్యమెన సరుకు రూ. 9000, వేరుసెనగ గింజలు మహారాష్ట్ర కోసం 80-90 కౌంట్ రూ. 12,600, 70-80 కౌంట్ రూ. 12,900, హెదరాబాద్ కోసం 12,600, 60-70 కౌంట్ రూ. 13,100 ధరతో వ్యాపారమెంది. ఉత్తర ప్రదేశ్లోని మెనురి, ఏటా, మాధవంజ్ ప్రాంతాలలో దినసరి 20-25 వేల బస్తాలు మరియు మధ్య ప్రదేశ్లోని నిమచ్, మందసోర్ ప్రాంతాలలో 6-7 వేల బస్తాల రాబడిపై నాణ్యమెన సరుకు రూ. 7000-7200, మీడియం రూ. 6900-7000, యావరేజ్ రూ. 6000-6500, పాత సరుకు రూ. 8000-8500, మీడియం రూ. 7400–8000, యావరేజ్ రూ. 6500-7000 ధరతో వ్యాపారమయింది. గుజరాత్లోని గోండల్, జూనాఘడ్, భావనగర్, రాజ్కోట్ తదితర ప్రాంతాల మార్కెట్లలో దినసరి 3-4 వేల బస్తాల వేరుశనగ రాబడిపై రాజ్కోట్లో గిర్నార్ .7500-7760, -20 . 7800-8250 ລ້ 28–32 కౌంట్ రూ. 7500-7900 మరియు ముంద్రా పోర్ట్ డెలివరీ వేరుశనగ గింజలు బోల్డు 50-60 కౌంట్ రూ. 10,550, 40-50 కౌంట్ రూ. 10,750, 38-42 ໖ . 11,150, ໖ 80-90 ໖. 12,300, 50-60 కౌంట్ రూ. 12500 మరియు కేసోద్లో వేరుశనగ గింజలు జావా 80-90 కౌంట్ రూ. 12600, 60-70 కౌంట్ రూ. 13600 ధరతో వ్యాపారమయింది. కర్నాటకలోని బళ్ళారి, చెల్లకేరె ప్రాంతాల నుండి వేరుశనగ గింజలు 80-90 ໖ .12,500–12600, 70-80 ໖ . 12900-13000, ໐໖ . 13200-13300, 90-100 కౌంట్ రూ.12000–12100 మరియు ఆంధ్ర, తెలంగాణా కొత్త 60-70 కౌంట్ . 12900-13000, 90-100 ໐໖. 12000-12100, 60-65 కౌంట్ రూ. 13100–13200 ధరతో వ్యాపారమయింది. 60-70

Updated On: August 3, 2026, 7:51 am
కర్ణాటకలో కొత్త నువ్వులు ప్రారంభం

హెదరబాద్ - దేశ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కోసం నువ్వు పంట విత్తడం వేగంగా కొనసాగుతున్నది. జూలె 31 వరకు విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8 లక్షల 17 వేల హెక్టార్ల నుండి పెరిగి 9 లక్షల 27 వేల హెక్టార్లకు మరియు గడ్డి నువ్వుల సేద్యం 11 వేల హెక్టార్ల నుండి తగ్గి 9 వేల హెక్టార్లకు చేరింది.రాజస్తాన్లో జూలె 29 వరకు విస్తీర్ణం గత ఏడాది తో పోలిస్తే 1 లక్ష 43 వేల 541 హెక్టార్ల నుండి తగ్గి 1 లక్ష 41 వేల 875 హెక్టార్లకు చేరింది. మరియు గుజరాత్లో 27 జూలె వరకు విస్తీర్ణం 29 వేల 835 హెక్టార్ల నుండి తగ్గి 7 వేల 597 హెక్టార్లకు చేరింది. అయితే ప్రస్తుతం దేశంలో నాణ్యమెన తెల్లనువ్వులు తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో ఉత్పత్తి భారీగా తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గింది. కర్ణాటకలోని నువ్వుల ఉత్పాదక ప్రాంతాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై వారం రోజులలో 5-6 లారీల సరుకు రాబడి కాగా, నల్ల నువ్వులు రూ,12,500–13,500 ప్రతి క్వింటాలు మరియు 75 కిలోల బస్తా రూ. 11,000 ధరతో వ్యాపారమె విరుధ్నగర్ కోసం వ్యాపారమెంది. పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా, బేల్దా తదితర ప్రాంతాలలో దినసరి 6-7లారీల నువ్వుల రాబడిపై అన్లైన్ రూ. 8900-9000 మరియు 2 శాతం ఎఫ్ఎఫ్ కండీషన్ రూ. 11,000, 3 శాతం ఎఫ్ఎఫ్ కండీషన్ రూ.10400-10500 ధరతో వ్యాపారమయింది. నిజామాబాద్లో యాసంగి నువ్వులు రూ. 11800–12500 మరియు మహారాష్ట్రలోని యావత్మల్లో రూ. 11500-12500 లోకల్లూజు ధరతో వ్యాపారమయింది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 10-12 వేల బస్తాల యాసంగి నువ్వుల రాబడిపై రాజ్కోట్లో తెలుపు హల్లింగ్ క్వాలిటీ రూ.11500-11800, 98.2 రకం రూ. 11875–12150, 99.1 రకం రూ. 12250–12650, 99 రకం రూ. 11750-12750 మరియు నలుపు ప్రీమియం జెడ్ బ్లాక్ రూ. 18750-19000, జెడ్ బ్లాక్ రూ. 17,000-18,625, యావరేజ్ రూ. 13000-16750, క్రషింగ్ సరుకు రూ. 8500-10500 ధరతో వ్యాపారమయింది. మధ్యప్రదేశ్లోని నిమచ్లో నాణ్యమెన సరుకు రూ. 12000–12400, మీడియం రూ. 11600-12000, యావరేజ్ రూ. 11000–11500 మరియు కడప, నందికొట్కూరు, రాజంపేట ప్రాంతాలలో ఎరుపు రకం సరుకు రూ. 12500 ప్రతి క్వింటాలు మరియు విరూధనగర్ డెలివరీ ( 75 కిలోలు ) రూ. 9000-9500, నరసారావుపేటలో ఎర్ర నువ్వులు నెం. 1 క్వాలిటీ రూ. 12000–12500, ఒంగోలు రూ. 12700, పార్వతీపురం, చీపురుపల్లి ప్రాంతాలలో రూ. 12500–13000 ధరతో వ్యాపారమెంది.

Updated On: August 3, 2026, 7:49 am
కర్ణాటకలో ప్రారంభమైన కొత్త పెసలు

హైదరాబాద్ : కర్ణాటకలోని గదగ్, గురుమిటల్, యాద్గిర్ ప్రాంతాలలో 10 బస్తాలతో కొత్త పెసల రాబడి ప్రారంభమైంది. స్థానికంగా నిమ్ము సరుకు రూ. 9000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపామైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి కోసుకుపోయే అంచనా వ్యక్తమవుతున్నది. రుతుపవనాల సీజన్కు ముందస్తుగా కురిసిన వర్షాలకు విత్తిన పంట స్వల్పంగా రాబడి అవుతున్నది. అయితే, ఈ ఏడాది ఎలిన్నినొ ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు కాగాలదని తెలుస్తోంది. తెలంగాణలోని నారాయణపేటలో స్థానికంగా కొత్త పెసలు రూ. 7300-9600, కర్ణాటకలోని గదగ్లో 800 బస్తాల సరుకు రాబడిపై రూ. 8400–11,071, గురుమిట్కల్, యాద్గిర్ ప్రాంతాలలో 150 బస్తాల కొత్త పెసలు చెన్నై డెలివరి రూ. 10,000, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో జూలై 31 నాటికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32 లక్షల 23 వేల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి 29 లక్షల 32 వేల హెక్టార్లు, మిటుకులు 8 లక్షల 66 వేల నుండి తగ్గి 6 లక్షల 95 వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఇందులో గుజరాత్ పెసల సేద్యం 38 వేల 614 నుండి తగ్గి 11 వేల 908, మిటుకులు 7231 నుండి పెరిగి 7791 హెక్టార్లు, రాజస్తాన్లో జూలై 29 నాటికి పెసల సేద్యం 22 లక్షల 57 వేల 914 నుండి పెరిగి 21 లక్షల 10 వేల 712 హెక్టార్లు, మిటుకులు 8 లక్షల 58 వేల 845 నుండి తగ్గి 6 లక్షల 86 వేల 696 హెక్టార్లు, మహారాష్ట్రలో పెసల సేద్యం 3 లక్షల 2 వేల 459 నుండి 55 శాతం తగ్గి 1 లక్షల 34 వేల 787 హెక్టార్లలో విస్తరించింది. మధ్య ప్రదేశ్ రైతుల నుండి పెసల కొనుగోళ్లు 25 శాతం నుండి పెంచి 60 శాతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొనుగోలు వ్యవధి పొడిగించినందున ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గి ధరలకు మద్దతు లభిస్తున్నది. మధ్య ప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 14 వేల బస్తాల పెసల రాబడిపై రూ.6000-8000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 1000 బస్తాలు రూ. 7000–8500, జునాగఢ్ రూ. 6500-9050, వెరావల్లో 8600- 9000, ఉత్తరప్రదేశ్లోలోని లలిత్పూర్, ఉరై, ఝాన్సీ మార్కెట్లలో రూ. 6000-7000 మరియు మహారాష్ట్ర అకోలాలో యాసంగి సరుకు రూ. 6350-7600, పాలిష్ సరుకు రూ. 7600-8750 మరియు రాజస్తాన్లోని జైపూర్లో రూ. 6400, మిటుకుల పప్పు రూ. 7700, మోగర్ రూ. 8700, దిల్లీలో రాజస్తాన్ మిటుకులు రూ. 6275-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: August 3, 2026, 7:46 am
పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు

పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 17, 2025, 7:00 am