గిరాకీ లేక పసుపు వెలవెల హైదరాబాద్ : ఎన్సిడిఇఎక్స్ వద్ద గత రెండు వారాలలో జూన్ వారుుదా సువూరు రూ. 500 తగ్గింది. వురియుు గత సోమవారం 15 రోజుల క్రితం రూ. 14,520తో పోలిస్తే తగ్గి రూ. 14,098తో ప్రారంభమై శుక్రవారం వరకు రూ. 108 తగ్గి రూ. 13,990 వద్ద వుుగిసింది. అరుుతే ఆగస్టు వారుుదా రూ. 250 తగ్గి రూ. 14,320, అక్టోబర్ వారుుదా రూ. 110 పెరిగి రూ. 14,600 వద్ద వుుగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 8-9 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 13,000-14,000, దుంపలు రూ. 12,000-12,500, పాలిష్ సరుకు కొమ్ములు రూ. 14,400-14,500, దుంపలు రూ. 13,500- 13,700, వరంగల్ వూర్కెట్లో 3-4 వేల బస్తాలు, కేసముద్రం మార్కెట్లో 2-3 వేల బస్తాలు కొమ్ములు రూ. 10,100 -12,200, దుంపలు రూ. 10,150 -11,000, సదాశివపేట, వికారా బాద్, మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు, దుంపలు రూ. 10,200 -10,800 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల లో 700-800 బస్తాలు కొమ్ములు, దుంపలు మీడియం సరుకు రూ. 9500 -9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో 20-22 వేల బస్తాలు, బస్మత్నగర్ లో 15-16 వేల బస్తాలు, నాందేడ్ లో 7-8 వేల బస్తాలు కొమ్ములు రూ. 12,000 -13,000, దుంపలు రూ. 11,400 -12,500, సాంగ్లీలో 5-6 వేల బస్తాలు రాజాపురి కొమ్ములు రూ. 13,500-15,000, దుంపలు రూ. 12,500-13,000, మీడియుం లక్డీ రకం రూ. 16,000-16,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్లో 12-13 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు రూ. 9122-14,568, దుంపలు రూ. 8209-13,039, పెరుందురైలో కొమ్ములు రూ. 8155-13,839, దుంపలు రూ. 7219-12,879, గోబిచెట్టిపాలయంలో కొమ్ములు రూ. 12,512-13,199, దుంపలు రూ. 11,601-12,402, ఒడిశ్శాలోని బరంపురంలో కొమ్ములు రూ. 11,300, పాలిష్ సరుకు రూ. 12,200 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:32 amఉ.ప్ర., పంజాబ్లో కుంటుపడిన మిర్చి రాబడులు గుంటూరు : ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, బరేలి మరియు పంజాబ్లోని ప్రముఖ మిర్చి ఉత్పాదక ప్రాంతమైన తరణ్-తరణ్ ప్రాంతంలో రైతుల సరుకు రాబడులు ముగిశాయి. ఎందుకనగా ఈ ఏడాది ధరలు చౌకగా ఉన్నందున సీజన్ ప్రారంభమైన తర్వాత కొందరు రైతులు పచ్చి మిర్చినే విక్రయించారు. కొంత నాసిరకం పంటను రైతులు చేనులోనే వదిలేశారు. ఈ ఏడాది ఇరు రాష్ట్రాలలో గణనీయమైన ఉత్పత్తి మరియు నాణ్యమైన సరుకు రాబడి అయినందున రాజస్తాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, హరియాణా రాష్ట్రాలకు సరుకు సరఫరా చేయడం వలన ఆంధ్ర సరుకు కోసం డిమాండ్ సన్నగిల్లింది. ఈ ఏడాది దేశంలో నెలకొన్న సానుకూల వాతావరణం మరియు సంతృప్తికరమైన వర్షాలు కురవగలవని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో రైతులు మిర్చి స్థానంలో పత్తి సాగు చేపడుతున్నారు. కావున నాణ్యమైన రకాల ధరలు తగ్గే అవకాశం లేదు. అయితే రాబోయే కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల మార్కెట్లలో రెండేళ్ల క్రితం పాత సరుకుతో పాటు గత ఏడాది నిల్వ ఉంచిన సరుకు వురియుు ప్రస్తుత సంవత్సరంలోని వూర్చి, ఏప్రిల్ నెల కొత్త సరుకులో ఎక్కువగా మీడియుం, మీడియుం బెస్ట్ రకాలు కలిసి సువూరు 1 లక్ష 05 వేల బస్తాల సరుకు రాబడి కాగా 85 వేల బస్తాల సరుకు అవ్ముకం అరుుంది. గుంటూరు శీతలగిడ్డంగులలో నుండి వారంలో 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, 1 లక్ష 70 వేల బస్తాల సరుకు అవ్ముకం అరుుంది. ఇందులో 341, తేజ, 334, సూపర్-10 లాంటి డీలక్స్ రకాల ధర రూ. 200-300 వృద్ధి చెందారుు. వురియుు ఆర్మూర్ తాలు రకానికి డివూండ్ నెలకొన్నది. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది. గత వారం గుంటూరు వూర్కెట్లో నాన్ ఎసి తేజ రూ. 8000-11,000, ఇతర రకాలు రూ. 7000-9000, తేజ తాలు కాయులు రూ. 5500-6500, సాధారణ రకం తాలు కాయులు రూ. 3000-5000 ధరతో వ్యాపారమైంది. గత వారం గుంటూరు వూర్కెట్లో ఎసి తేజ రూ. 11,000-13,500, డీలక్స్ రూ. 13,600 -13,800 వురియుు 355 బడిగ రూ. 10,000-12,500, సింజెంట బడిగ (5531 రకం) రూ. 10,000-12,000, డిడి రూ. 10,000 -13,000, 2043 బడిగ రకం రూ. 11,000 -13,000, 341 రకం రూ. 11,000 -13,500, డీలక్స్ రూ. 14,000, నెంబర్-5 రకం రూ. 11,000-13,500, 264 రకం (నంబర్-5) రూ. 11,000-12,500 వురియుు 273, కుబేర రకాలు రూ. 10,000-12,500, 334, సూపర్-10 రకం రూ. 10,000-13,000, ఆర్మూర్ రకం రూ. 9500-10,500, రోమి రకం రూ. 11,000-12,500, షార్క్-స్పార్క్ రూ. 11,000-12,000, క్లాసిక్ రూ. 9500-10,500, బంగారం రూ. 10,000-12,000, బుల్లెట్ రకం రూ. 10,000-12,500, తేజ తాలు కాయులు రూ. 6500-7500, తాలు కాయులు రూ. 4500-6000 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గత వారం 1,05,200 బస్తాల ఎసి సరుకు అమ్మకమైన తర్వాత శనివారం సాయంత్రం వరకు మిగిలు నిల్వలు 21,39,900 బస్తాలు ఉన్నాయి. వచ్చే వారం మరో లక్ష బస్తాల సరుకు అమ్మకమయ్యే అవకాశం ఉంది. గత వారం ఖవ్ముం వూర్కెట్లో 8-9 వేల బస్తాల రైతుల సరుకు అవ్ముకం కాగా, రూ. 9650-9700 వురియుు 34-35 వేల బస్తాల శీతలగిడ్డంగుల సరుకు రాబడి కాగా, తేజ తాలు కాయులు రూ. 14,000, మీడియుం రూ. 13,000-13,500, తాలు కాయులు రూ. 7000-7500, మీడియుం రూ. 5500 వురియుు వరంగల్ మార్కెట్లో గత వారం 25 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,000, మీడియం రూ. 11,000, 341 నాణ్యమైన సరుకు రూ. 12,500-12,800, మీడియం రూ. 10,000, వండర్హాట్ నాణ్యమైన సరుకు రూ. 14,000-14,500, మీడియం రూ. 11,000, 5531 రూ. 11,500, దీపిక రూ. 13,000, మీడియం రూ. 11,500, చపాటా నాణ్యమైన సరుకు రూ. 27,000-28,000, మీడియం రూ. 15,000-19,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు వుహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 12,000-13,500, సూపర్-10 రూ. 11,000-12,000, ఆర్మూరు రూ. 10,000-12,500, 273 రూ. 11,000-12,500, 341 రూ. 10,000-14,000, 2043 రూ. 11,000- 14,000, సింజెంట రూ. 10,000-12,000, తాలు కాయలు తేజ రూ. 5000- 8000, ఇతర రకాలు రూ. 3000-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్గీ మార్కెట్లో గత గురువారం 15 వేల బస్తాల శీతల గిడ్డంగుల మిర్చి రాబడి కాగా 9 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 2043 రూ. 9000-14,000, 5531 రూ. 7500-11,000, డబ్బీ రూ. 15,500- 21,000, కెడిఎల్ రూ. 15,000-19,000, డిడి రూ. 11,000-11,500, తాలు కాయలు 2043 రూ. 3000-3500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 11,500-13,700, షార్క్-1 రూ. 11,000-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:31 amఆంధోళన చెందుతున్న జీలకర్ర స్టాకిస్టులు ముంబై : ఈ ఏడాది రాజస్తాన్లో జీలకర్ర ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు ధరలు పతనమవుతున్న తరుణంలో దిగ్గజ రైతులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నందున సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయాయి. సానూకూల వాతావరణంతో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున రాబోయే సీజన్ దీపావళి నుండి ప్రారంభమయ్యే సేద్యం తగ్గే అవకాశం లేదు. గుజరాత్ రైతుల వద్ద కూడా సమృద్ధిగా సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే సీజన్ ప్రారంభం నాటికి ధరలు మందగమనంలో చలించగలవని స్పష్టమవుతున్నది. పంజాబ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు భారత్లో కిరాణా వ్యాపారులు భవిష్యత్తులో ధరలు పెరిగే అంచనాతో సీజన్ ప్రారంభంలో చౌక ధరతో పెద్దయెత్తున సరుకు కొనుగోలుచేసి నిల్వ చేసుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏరోజుకారోజు ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి. కావున సరుకు అమ్మకాలు మందగించాయి. ప్రస్తుత సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైంది. రాబోయే సీజన్ కూడా మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ధర మరో రూ. 1000-1500 పతనం కాగలదని స్పష్టమవుతున్నది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా రూ. 19,450 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 1275 పతనమై రూ. 18,725 వద్ద ముగిసింది. జూలై వాయిదా సోమవారం రూ. 19,510 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి 500 తగ్గి రూ. 19,010, ఆగస్టు రూ. 204 క్షీణించి రూ. 19,195 వద్ద కదలాడుతున్నది. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో 35 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యూరప్ రకం రూ. 20,000-20,500, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, మీడియం రూ. 18,500-19,000, సాధారణ రకం రూ. 17,500-18,500, రాజ్కోట్లో 5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-17,750, మీడియం రూ. 17,750-18,250, నాణ్యమైన సరుకు రూ. 18,250-18,750, యూరప్ రకం రూ. 18,750-19,000, కిరాణా రకం రూ. 19,250, పాత సరుకు రూ. 17,000-18,500, గోండల్లో ప్రతి రోజు 6 వేల బస్తాలు రూ. 18,000-22,000, జామ్నగర్లో 5 వేల బస్తాలు రూ. సాధారణ రకం రూ. 15,800-17,000, మీడియం రూ. 17,300-18,200, నాణ్యమైన సరుకు రూ. 18,500-19,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కెట్లకు రాబడులు మందగించాయి. కొనుగోళ్లు క్షీణించినందున ధరలకు మద్దతు లభించడంలేదు. తద్వారా మెడతా, నాగోర్, కేక్డి, జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 5 వేల బసాలు, బాడ్మేర్లో 7 వేల బస్తాలు మరియు పరిసర మార్కెట్లలో కలిసి 1000 బస్తాల జీలకర్ర రాబడిపై సాధారణ రకం రూ. 15,500-17,000, మీడియం రూ. 17,500-17,800, నాణ్యమైన సరుకు రూ. 19,300-20,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:30 amవృద్ధి చెందిన మినుముల సేద్యం - బ్రెజిల్ నుండి ఆగస్టులో కొత్త సరుకు హైదరాబాద్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో మినుముల సేద్యం భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దిగుమతి అయిన మినుములతో పాటు యాసంగి సరుకు ఎడతెరిపి లేకుండా సరఫరా అవుతున్నది. దేశంలో జూన్ 13 నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18 వేల హెక్టార్ల పెరిగి 41 వేల హెక్టార్లలో విస్తరించింది. కర్ణాటకలో 37,600 హెక్టార్లు, గుజరాత్లో జూన్ 16 నాటికి 7 వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎస్క్యూ మినుములు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ 845 డాలర్, ఎఫ్ఎక్యూ 775 డాలర్ వద్ద కదలాడుతున్నది. ప్రస్తుత సీజన్లో బ్రెజిల్ ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పంట నూర్పిడి ప్రక్రియ కొనసాగుతున్నది. ఆగస్టు నాటికి చెన్నైకి చేరగలదు. ప్రస్తుతం బ్రెజిల్ పాత సరుకు నాణ్యత కొరవడినందున ప్రతి క్వింటాలు రూ. 7500-7600 ధరతో నత్తనడకన వ్యాపారమవుతున్నది. చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు రూ. 275 పెరిగి రూ. 7650, ఎఫ్ఎక్యూ రూ. 6750 మరియు గుజరాత్లోని పఠాన్, జామ్నగర్ ప్రాంతాల టి-9 మినుములు దేశీ మిక్స్ సరుకు చెన్నై డెలివరి రూ. 7900, వెరావల్, పోర్బందర్, సోమనాథ్ ప్రాంతాల నాణ్యమైన సరుకు రూ. 8100, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం గ్రేడింగ్ చేసిన కొత్త మినుములు చెన్నై డెలివరి రూ. 7800, ఆంధ్ర ప్రాంతం పాలిష్ సరుకు రూ. 7300, అన్-పాలిష్ సరుకు రూ. 7200, తమిళనాడులోని ట్యుటికోరిన్, తంజావూరు ప్రాంతాల మినుములు సాధారణ రకం రూ. 6200-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలో కొత్త మినుములు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు సరుకు నాణ్యత కొరవడింది. అలహాబాద్, కాన్పూర్ ప్రాంతాల కొత్త మినుముల ధర పెరిగి రూ. 8300 కు చేరిన తర్వాత తాజాగా మరో రూ. 200-250 వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, తెలంగాణలో యాసంగి మినుముల రాబడులకు తెర పడింది. ఆంధ్రప్రదేశ్లోని కడప, క్రిష్ణా, నంద్యాల, ప్రొద్దుటూరు ప్రాంతాలలో పాలిష్ సరుకు ధర రూ. 100 వృద్ధి చెంది రూ. 7100-7200, అన్-పాలిష్ రూ. 6900-7000, మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి 40 వేల బస్తాల సరుకు రాబడిలో కేవలం జబల్పూర్లో 10 వేల బస్తాలు రూ. 6000-7200, ఇండోర్లో రూ. 6500-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:29 amతగ్గిన బెల్లం నిల్వలు - పెరుగుతున్న ధరలు హైదరాబాద్ : దేశంలోని ప్రవుుఖ ఉత్పాదక రాష్ట్రాలలో బెల్లం నిల్వలు తగ్గుతున్నారుు. కాగా, వచ్చే పండుగల సీజన్ కోసం గిరాకీ నెలకొన్నందున నాణ్యమైన రకాల ధరలలో సువూరు రూ. 100 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందారుు. వురియుు ఆగస్టు మెుదటి వారం నుండి వురో రూ. 200 పెరిగే అవకాశం ఉన్నది. కర్ణాటకలోని వూండ్యా, చావురాజనగర్, శివమోగ్గ ప్రాంతాలలో సంతర4జు 80-85 వాహనాల సరుకు రాబడి కాగా, ఆగస్టు చివరి వారం వరకు కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాగలవు. దీనితో రాడులు పెరిగే అవకాశం ఉంది. కాని దేశంలోని వినియోగం కోసం సరిపడునంతగా సరుకు నిల్వలు లేవని విశ్వసనీయు వర్గాలు తెలిపారుు. ఇదే విధంగా తమిళనాడులోని సేలం, కౌందప్పాడి ప్రాంతాల అన్ని వూర్కెట్లలో కలిసి సువూరు 40 వేల బస్తాల సరుకు రాబడి కాగా, పూర్తి సరుకు అవ్ముకం అరుునట్లు సవూచారం. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూన్ 16 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాదితో ఇదే వ్యవధితో పోలిస్తే 11,23,110 నుండి 2,13,965 బస్తాలు తగ్గి 9,09,145 బస్తాలకు పరిమితం అరుుంది. ఇందులో చాకూ బెల్లం 5,16,638 నుండి తగ్గి 4,25,330 బస్తాలు, పాప్డి 1,62,876 నుండి 1,32,637, రస్కట్ 39,104 నుండి 35,617, ఖరుపా 10,000 నుండి కేవలం 5500, చదరాలు 1,39,295 నుండి 1,30,288, రాబిటన్ 2,22,603 నుండి 1,79,323 బస్తాలకు పరిమితమయ్యాయి. ముజఫర్నగర్లో ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1600-1750, రస్కట్ రూ. 1350-1500, ముద్ద్డబెల్లం రూ. 1700-1800, ఖరుపా రూ. 1500-1600 మరియు పాప్డి 100 కిలోలు రూ. 3900-4100 మరియు మధ్యప్రదేశ్లోని బైతుల్లో ప్రతి రోజు 400-500 క్వింటాళ్లు రూ. 3550-3931, దిల్లీలో ముద్దబెల్లం రూ. 4400-4500, చాకూ బెల్లం రూ. 4700-4800, అచ్చులు రూ. 4800-5000 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 2-3 వేల దిమ్మల ఎసి బెల్లం అమ్మకంపై సురభి రకం రూ. 4200-4350, మీడియం రూ. 4000-4100, ఎరుపు-నలుపు మిక్స్ సరుకు రూ. 3700-3850, సోలాపూర్లో 5-6 వేల దిమ్మలు రాబడిపై రూ. 3000-3150, సాంగ్లీలో 12-15 వేల దిమ్మలు రూ. 3900-4400 మరియు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ప్రతిరోజు 1-2 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు గులాబీ రకం రూ. 4750-4800, మీడియం రూ. 4300-4400, నలుపు రూ. 3800-3850, చిత్తూరులో 4-5 వాహనాల సరుకు అవ్ముకంపై సూపర్-ఫైన్ రూ. 6000-6100, సురభి రకం రూ. 5100-5200, నలుపు రూ. 4150-4200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో వూండ్యా ప్రాంతపు సరుకు ్ర10 కిలోల బట్టి రూ. 5200-5300, సాంగ్లీ సరుకు రూ. 4900-5000, ఒక కిలో దివ్ములు రూ. 4800-4900, అర కిలో వుుక్కలు రూ. 4900-5000, వుహారాష్ట్ర లడ్డు రూ. 4600-4700, ఉత్తరప్రదేశ్లోని వుంగళూరు లడ్డు రకం రూ. 5100-5200 ధఱో వ్యాపారమైంది. కర్ణాటకలోని శిమోగాలో గత వారం 24-25 వాహనాల సరుకు రాబడిపై దేశీ బెల్లం రూ. 4250-4300, మాండ్యాలో 40-45 వాహనాల రాబడి కాగా, రూ. 3850-4600 మరియు తమిళనాడులోని సేలం వూర్కెట్లో 10 వేల బస్తాల బెల్లం రాబడి కాగా, తెలుపు రకం రూ. 1460-1480, సురభి రకం రూ. 1440-1460, ఎరుపు రకం రూ. 1400-1420 వురియుు పిలికెలిపాలయుంలో 8-9 వేల బస్తాల సరుకు రాబడి కాగా, తెలుపు రకం రూ. 1340-1360, సురభి రకం రూ. 1320-1340, ఎరుపు రకం రూ. 1300-1320 వురియుు చిత్తోడ్లో 7-8 వేల బస్తాల సరుకు రాబడి కాగా, తెలుపు రకం రూ. 1360-1380, సురభి రకం రూ. 1330-1350, ఎరుపు రకం రూ. 1300-1320 వురియుు కౌందప్పాడిలో 4 వేల బస్తాల సరుకు రాబడిపై పౌడర్ బెల్లం రూ. 1420-1450 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:28 amనిలకడగా పత్తి ధరలు అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా పత్తి రాబడులు సన్నగిల్లాయి. రైతుల సరుకు దాదాపు మొత్తం అమ్మకమైంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి 5 వేల బేళ్ల పత్తి రాబడిపై ప్రతి క్వింటాలు రూ. 6500-6800, నాణ్యమైన సరుకు రూ. 7800-8000 మరియు కండీ 30 మి.మీ. పొడుగు పింజ పత్తి రూ. 54,800-55,000, నాగ్పూర్ సరుకు రూ. 55,000-55,300, 29 మి.మీ. మీడియం పింజ పత్తి 53,500-53,800, ఖాన్దేశ్, మట్వారా ప్రాంతాలలో 29 మి.మీ. పింజ రూ. 54,000-54,500 మరియు మధ్యప్రదేశ్లో 54,100, ఆరడి 72-73 రూ. 52,000-52,500, 30 మి.మీ. రూ. 54,300-54,500 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులో 30 మి.మీ. పొడుగు పింజ పత్తి రూ. 57,000, 28-29 మి.మీ. రూ. 53,000-56,000 ప్రతి కండీ మరియు ప్రతి క్వింటాలు రూ. 5600-7600, గింజలు రూ. 3400-3900, కర్ణాటకలో 30 మి.మీ. పొడుగు పింజ పత్తి ప్రతి కండీ రూ. 55,000-55,500, 29.5 మి.మీ. రూ. 54,500-55,000, 29 మి.మీ. రూ. 54,000-54,500 మరియు ప్రతి క్వింటాలు రూ. 7000-7800, గింజలు రూ. 3900-4200 మరియు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 29 మి.మీ. రూ. 53,100-53,500, 30 మి.మీ. రూ. 53,000-53,700 మరియు ప్రతి క్వింటాలు రూ. 6850-7200, గింజలు రూ. 3350-3950, ఆదోనిలో 29 మి.మీ. ప్రతి కండీ రూ. 54,000-54,500 మరియు ప్రతి క్వింటాలు రూ. 5300-8025, గింజలు రూ. 3900-4100 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:28 amదిగుమతి అయిన శనగలు బలోపేతం హైదరాబాద్ : దేశంలో వర్షాకాలం ప్రారంభంతో పాటు శనగపప్పు గింజలకు గిరాకీ నెలకొన్నందున దేశీయ మరియు విదేశీ శనగల ధరలు పురోగమిస్తున్నాయి. ధర మరో రూ. 50-100 పెరిగినట్లయితే స్టాకిస్టుల అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారబోవని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మరాట్వాడ, విదర్భ ప్రాంతాలలో చిన్నతరహా స్టాకిస్టుల వద్ద సరుకు నిల్వలు అడుగంటాయి. దీపావళి పండుగ వరకు ఎడతెరిపి లేకుండా డిమాండ్ కొనసాగనున్నది. ఇలాంటి పరిస్థితులలో ధర రూ. 150-200 హెచ్చు-తగ్గులు కొనసాగే అవకాశం ఉంది. ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 150 పెరిగి రూ. 5600, ఆస్ట్రేలియా సరుకు రూ. 5750, సూడాన్ కాబూలీ శనగలు రూ. 6450, ఆంధ్రప్రదేశ్ సరుకు విరుధ్నగర్, ఈరోడ్ డెలివరి రూ. 6350, కర్ణాటక సరుకు రూ. 6400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో మిల్లు రకం శనగలు రూ. 5700-5800, అన్నిగిరి శనగలు రూ. 5800-5900, సోలాపూర్లో మిల్లు రకం శనగలు రూ. 5500-5750, అన్నిగిరి శనగలు రూ. 5900-6000, అకోలా, అమరావతి ప్రాంతాలలో సాదా శనగలు రూ. 5400-5925, ఖాంగావ్లో మిల్లు రకం శనగలు రూ. 5200-5475, గుజరాత్ మార్కెట్లలో దేశీ సరుకు రూ. 5100-5500, ముళ్లశనగలు రూ. 5500-5600, కాబూలీ శనగలు రూ. 7500-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిల్లీలో గత వారం రాజస్తాన్ సరుకు రూ. 5800-5825, మధ్యప్రదేశ్ సరుకు రూ. 5750-5775 మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి 18 వేల బస్తాలు రూ. 5000-5450, కాబూలీ వి-2 రకం శనగలు 2100 బస్తాలు రాబడిపై రూ. 5200-6400, ఇండోర్లో రూ. 5900-5925, డాలర్ శనగలు రూ. 8605-8805, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 11,400, 44-46 కౌంట్ రూ. 11,100, 46-48 కౌంట్ రూ. 10,800, 50-52 కౌంట్ రూ. 9900, 58-60 కౌంట్ రూ. 8600, 80-85 కౌంట్ రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని మార్కెట్లలో రూ. 5200-5450 మరియు ఉత్తరప్రదేశ్లో రూ. 5300-5550 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ. 5900, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6100-6200, డాలర్ శనగలు రూ. 8800 ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:27 amతగ్గిన కందిపప్పు కొనుగోళ్లు హైదరాబాద్ : గత వారం వరకు కందుల ధరలు దిగజారుడు బాట పడుతున్నందున స్టాకిస్టు రైతులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. వర్షాలు కురవడం వలన జూలై నుండి కొనుగోళ్లు జోరందుకోగలవనే అంచనాతో దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు కొంతమేర పురోగమిస్తున్నాయి. అయినప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో కందుల సేద్యం కొనసాగుతున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే వెనుకబడిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. కర్ణాటకలో జూన్ 13 నాటికి కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,65,100 హెక్టార్ల నుండి తగ్గి 1.12 ల.హె., గుజరాత్లో జూన్ 16 నాటికి 338 హెక్టార్ల నుండి 168 హెక్టార్లలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల కోసం మధ్యప్రదేశ్ పప్పు నాగ్పూర్, కట్ని, ఒడిశ్శా, పశ్చిమ బెంగాల్, అస్సాం, భాటాపారా, బిలాస్పూర్, రాయిపూర్ ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ కందుల ధర పెరిగి ప్రతి టన్ను 725 డాలర్ ప్రతిపాదించబడుతున్నది. తద్వారా ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందుల ధర రూ. 285-300 పెరిగి ప్రతి క్వింటాలు రూ. 6385-6400, మట్వారా రూ. 5750, మొజాంబిక్ తెల్లకందులు, గజరి కందులు రూ. 5590-6000, సూడాన్ కందులు రూ. 6500, చెన్నైలో లెమన్ కందులు రూ. 6375-6400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం తమిళనాడు పప్పు మిల్లర్లు అత్యధికంగా నాణ్యమైన కందులు, పెసలు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర కందులు అన్-క్లీన్ సరుకు చెన్నై డెలివరి జనవరి నుండి ఇప్పటి వరకు రూ. 700 తగ్గి రూ. 7350, గ్రేడింగ్ చేసిన క్లీన్ సరుకు రూ. 7700, గుజరాత్ బిడిఎన్-2 కందులు రూ. 7600, కర్ణాటక ఎర్రకందులు విరుధ్నగర్, సేలం డెలివరి రూ. 7200, తెల్లకందులు రూ. 7500, కట్ని డెలివరి రూ. 6900-7000, రాయిపూర్ డెలివరి రూ. 6700-6725 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని ఉద్గిర్, ఔరద్, షాజ్హాని, లాతూర్ ప్రాంతాల నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 7400-7450, గుజరాత్ బిడిఎన్-2 కందులు రూ. 7600-7700, లెమన్ కందులు కంటైనర్లో రూ. 6425, గిడ్డంగు సరుకు రూ. 6375, కర్ణాటక ఎర్రకందులు విరుధ్నగర్, సేలం డెలివరి రూ. 7300, తెల్లకందులు రూ. 7600, కట్ని డెలివరి రూ. 7150-7250, రాయిపూర్ డెలివరి రూ. 6850-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతి రోజు 17 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ. 5800-6800, సాధారణ రకం రూ. 6400-6600, లాతూర్లో మారుతి, గులాబీ, తెల్లకందులు రూ. 6500-6850 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రూ. 6000-6600, దాహోద్లో మీడియం సరుకు రూ. 5100-5400, కల్బుర్గిలో రూ. 6000-6800, పప్పు మేలిమి రకం రూ. 9800, సవానంబర్ పప్పు రూ. 8400-8800, లాతూర్, అకోలా, నాగ్పూర్ ప్రాంతాలలో పప్పు మేలిమి రకం రూ. 9600-9800, సవానంబర్ రూ. 8900-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:26 amమ.ప్ర.లో పెసల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ : దేశంలో ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం ప్రారంభమైంది. సేద్యం ప్రక్రియ శరవేగంతో కొనసాగుతున్నదని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పేర్కొన్నది. కర్ణాటకలో గత ఏడాదితో పోలిస్తే 2,47,500 హెక్టార్ల నుండి పెరిగి 2,54,600 హెక్టారు, గుజరాత్లో 31 వేల హెక్టార్ల నుండి 57 వేల హెక్టార్లలో విస్తరించింది. ఉత్తర కర్ణాటకలో మే చివరి వారం మరియు జూన్ మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాలకు ధార్వాడ్, హవేరి ప్రాంతాలలో పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున పెసల పంటకు నష్టం వాటిల్లింది. పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నందున మరో వారం పాటు సేద్యం చేపట్టే అవకాశం లేదు. మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వంచే పెసల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడు కోసం మధ్యప్రదేశ్ పెసరపప్పు లారీ బిల్టి రూ. 8900-9300, జైపూర్, బికనీర్ సరుకు రూ. 9200-9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మిల్లర్లచే పప్పు కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున మధ్యప్రదేశ్, గుజరాత్ మార్కెట్లలో సరుకు సమృద్ధిగా సరఫరా అవుతున్నందున పెసల ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. కర్ణాటకలో ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం కోసం 4.14 ల.హె. లక్ష్యం నిర్ధారించగా జూన్ 6 నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,38,300 హెక్టార్ల నుండి పెరిగి 1,52,400 హెక్టార్లలో విస్తరించింది. రాజస్తాన్లో మిటుకుల పప్పు ప్రతి క్వింటాలు రూ. 7000-7100 ధరతో వ్యాపారమైనందున మహానగరాలలో పెసరపప్పులో మిటుకుల పప్పు కలిపి విక్రయిస్తున్నారు.ఆంధ్ర ప్రాంతం సాదా పెసలు చెన్నై డెలివరి రూ. 7500-7600, రాజ్కోట్ పాలిష్ పెసలు రూ. 8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆగస్టు మొదటి వారం నాటికి కర్ణాటకలో కొత్త పెసలు రాబడి ప్రారంభం కానున్నందున ప్రస్తుతం స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. కందిపప్పు ధరలను దృష్టిలో పెట్టుకొని పెసరపప్పు ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదు. సెప్టెంబర్ నుండి దేశవ్యాప్తంగా కొత్త సరుకు సరఫరా పోటెత్తనున్నది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, హర్దా, హోశంగాబాద్, రత్లాం మరియు పరిసర ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 40 వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతున్నందున రైతులు తమ సరుకు విక్రయించేందుకు తొందరపాటు ప్రదర్శించడంలేదు. అయితే, స్థానికంగా ప్రతి క్వింటాలు రూ. 5700-7700, ఇండోర్ డెలివరి రూ. 6700-7400, గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతి రోజు 3 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6500-7500, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, జాలౌన్ మార్కెట్లలో 500 బస్తాలు రూ. 6500-7000, ఉరైలో 2 వేల బస్తాలు రూ. 6000-6900, మహోబాలో 6000-6700 మరియు మహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్, జాల్నా ప్రాంతాలలో రూ. 6000-7500 మరియు రాజస్తాన్లోని జోధ్పూర్లో రూ. 6100-7050, మోగర్ పెసలు రూ. 9350, మిటుకులు రూ. 4200-4900, జైపూర్లో పెసలు రూ. 6800-7200, పప్పు రూ. 8400-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:26 amఎగబాకుతున్న కొబ్బరి ధరలు హైదరాబాద్ : దేశంలోని ప్రవుుఖ ఉత్పాదక రాష్ట్రాలలో బంతి కొబ్బరి నిల్వలు అడుగంటడం వురియుు జూలై నుండి దీపావళి వరకు నిరంతరం గిరాకీ ఉండే అంచనాతో అక్టోబర్ నాటికి ప్రతి కిలోకు రూ. 100-150 పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు అభిప్రాయుపడుతున్నారు. ఎందుకనగా గత వారంలో సువూరు రూ. 15 నుండి రూ. 20 ప్రతికిలోకు పెరిగింది. కర్ణాటకలోని టిప్టూరులో వారంలో 5-6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై బంతికొబ్బరి గత వారానికి ధీటుగా క్వింటాలుకు రూ. 1500-2200 పెరగగా మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉండగా, బంతి కొబ్బరి రూ. 24,200-24,500, కిరాణా రకం నాణ్యమైన సరుకు రూ. 23,500, మీడియం రూ. 19,000-20,000, మెరికో రూ. 22,000-22,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 22,200, స్పెషల్ రూ. 22,700, మెరికో రూ. 22,800, కిరాణా రకం రూ. 24,400, మీడియుం రూ. 23,900 వురియుు కోజికోడ్లో బంతికొబ్బరి రూ. 23,000, రాజాపురి కొబ్బరి రూ. 26,500, మిల్లింగ్ సరుకు రూ. 23,600, ఇలమతూరు, కొడుముడి, పెరుందురై, అవిల్పుందురై ప్రాంతాలలో కలిసి గత వారం 8-10 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 23,500-24,500, మీడియం రూ. 18,000-20,000, త్రిచూర్లో కొబ్బరినూనె రూ. 36,500, కోజికోడ్లో రూ. 37,300, కొచ్చిలో రూ. 36,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతి రోజు 50-60 వాహనాల కొబ్బరికాయల రాబడిపై గుజరాత్ రకం పాత సరుకు పెద్దసైజు కాయలు రూ. 19,000, మీడియం రూ. 16,000, సాధారణ రకం రూ. 12,000-14,000, నాణ్యమైన కొత్త సరుకు రూ. 17,000-18,000, మీడియం రూ. 15,000, సాధారణ రకం రూ. 11,000-12,000 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.
Updated On: June 23, 2025, 6:17 am