Subscription Service

All Ads in Telugu

భారీగా తగ్గిన మిర్చి నిల్వలు - భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండే అవకాశం

హైదరాబాద్ : లభించిన సమచారం ప్రకారం ఈ ఏడాది మిరప ఉత్పత్తి తగ్గడం మరియు ధరలు భారీగా పెరగడంతో రైతులు తమ మొత్తం ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. సీజన్లో పొగాకు, పత్తి, ఆహార ధాన్యాల వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేసిన మిరపను కూడా శీతలగిడ్డంగుల నుండి తీసి లాభంతో విక్రయిస్తున్నారు. సరుకు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎగుమతులు తగ్గినప్పటికీ, గుంటూరు శీతలగిడ్డంగులలో మే మధ్యకాలంలో నిల్వలు గత ఏడాది 70 లక్షల బస్తాలతో పోలిస్తే ప్రస్తుతం 40 లక్షలబస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు సమాచారం మరియు మే మధ్య వరకు మరో 8 నుండి 10 లక్షల బస్తాల సరుకు నిల్వకు అవకాశం ఉంది. కావున గత ఏడాది మరియు ప్రస్తుత సంవత్సరం కలిసి మొత్తం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 20 లక్షల బస్తాలు తగ్గి 50 లక్షల బస్తాలకు మించి లేవు. ఇందులో 334, సూపర్-10 సరుకు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని పరుచూరు, ఇంకొల్లు ప్రాంతాలలో నెంబర్-5 రకం కొత్త మిరప రాబడి అవుతున్నది. పంట దిగుబడి మరియు సరుకు నాణ్యంగా ఉన్నందున తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలలో కౌంటర్ సేల్ కోసం ఎగుమతి అవుతున్నది. నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి, ప్రకాశం జిల్లాలోని దర్శి, పొదిలి, పాతపాడు, కనిగిరి ప్రాంతాలలో ప్రస్తుతం మొదటి విడత మిర్చి కోతల తేజ రకం సరుకు రాబడి అవుతున్నది. జూన్ వరకు రాబడులు కొనసాగగలవు. ప్రతి ఎకరానికి 30 క్వింటాళ్ల సరుకు దిగుబడి అవుతున్నది. అయినప్పటికీ, తేజ మిర్చి నిల్వలు 15 లక్షల బస్తాలలోపే ఉండే అవకాశం కలదు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది తేజ మిర్చి ధర పెరిగి రూ. 25,000 వరకు చేరే అవకాశం ఉంది. అలినినో ప్రభావం వలన వర్షాలు తగ్గడం మరియు ఎగుమతి డిమాండ్ ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం కలదు. గుంటూరు మార్కెట్లో గతవారం 4 రోజులలో క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు మరియు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల నుండి 3.60 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, మార్కెట్ యార్డులో నిల్వ సరుకు సహా 4.20 లక్షల బస్తాల సరుకు అమ్మకం కాగా, డీలక్స్ రకం రాబడులు తక్కువగా ఉన్నందున ధరలు నిలకడగా ఉన్నప్పటికీ,

Updated On: May 3, 2026, 8:22 pm
పసుపు రైతులు - నిల్వ వ్యాపారలకు మహర్దశ?

హైదరాబాద్ః పసుపు రైతుల కోసం 2026 సంవత్సరం గోల్డన్ సంవత్సరంగా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభం నుండి ఇంతవరకు ధర అనేక సంవత్సరాల తరువాత అధికంగా ఉండడంతో ఉత్పాదక రాష్ట్రాలలో రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. దీనితో రైతుల వద్ద సరుకు సమాప్తమవుతుంది. అలాగే జూన్ మధ్య వరకు సీజన్ సమాప్తమవుతుంది. కావున ధర రూ. 18,000 స్థాయిని కూడా దాటే పరిస్థితి కలదు. ఎందుకనగా, అధిక వేడిమి కారణంగా భూజల మట్టం తగ్గడంతో పాటు సాగునీటి వనరులు కూడా తగ్గగలవు. అన్నినో ప్రభావం వలన రాబోవు సీజన్లో ఈ ఏడాది మాదిరిగా సరుకు నాణ్యంగా ఉండే అవకాశం కనిపించడంలేదు. విస్తీర్ణం పెరిగినప్పటికీ, పంట దిగుబడి ప్రభావితం కావచ్చు. కోల్డు స్టోరేజీ స్టాకిస్టుల అమ్మకాలు తగ్గవచ్చు, ఎందుకనగా ఫిబ్రవరిలో కొత్త సీజన్ ప్రారంభమయ్యేంత వరకు మర ఆడించే యూనిట్లకు సరుకు అవసరం ఉండగలదు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది తెలంగాణాలో పసుపు ఉత్పత్తి కేవలం 10-15 శాతం తగ్గింది. అయితే, సీజన్ ప్రారంభం నుండి మార్కెట్తో పాటు వాయిదా ధరలు పెరగడంతో రైతుల సరుకు రాబడి దాదాపు తగ్గింది. మెట్పల్లి ప్రాంతంలో వారంలో కేవలం 5–6 వేలు మరియు నిజామాబాద్లో దినసరి 1800-2000 బస్తాలు, మహారాష్ట్ర ప్రాంతం నుండి 500-600 బస్తాలతో పాటు 2500 బస్తాల సరుకు రాబడి అవుతున్నది. నిజామ్ ప్రాంతంలో రైతుల సరుకు దాదాపు 11 లక్షల బస్తాలకు చేరింది. సీజన్ ప్రారంభం నుండి 1.50 లక్షల బస్తాల సరుకు గోందియా, నాగ్పూర్, బస్మత్, నాందేడ్, సాంగ్లీ మొదలగు నగరాలలో అమ్మకమయింది మరియు కేవలం 1 లక్ష బస్తాల సరుకు రాబడికి అవకాశం కలదు. మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 40-42 వేల బస్తాల రాబడిపై 30-35 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా యావరేజ్ రకం

Updated On: May 3, 2026, 8:21 pm
తగ్గిన జీలకర్ర మార్కెట్-వాయిదా ధరలు

ఊంజాః లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది దేశీయ వ్యాపారులు మరియు ఎగుమతి డిమాండ్ తక్కువకా ఉండడంతో మార్కెట్ తో పాటు వాయిదా ధరలు మందకొడిగా ఉన్నాయి. అయితే, ఎండల తీవ్రత తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పెద్ద రైతుల సరుకు మార్కెట్లకు రాబడి కావడంలేదు. దీనితో స్టాకిస్టులు కూడా ముందుకు రావడంలేదు. ఎందుకనగా, కొందరు జీలకర్ర స్టాకిస్టులు మెంతులు, ధనియాలు, ఆముదాలు, వేరుశనగ వ్యాపారంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గతవారం ఎన్సిడిఇఎక్స్లో జీలకర్ర మే వాయిదా ధర వారంలో సుమారు రూ. 1200 తగ్గి సోమవారం రూ. 20,860 తో ప్రారంభమైన తరువాత గురువారం వరకు రూ. 430 తగ్గి రూ. 20,430, జూన్ వాయిదా రూ. 21, 145 ప్రారంభమైన తరువాత రూ. 450 తగ్గి రూ. 20, 695 పై ముగిసింది. గుజరాత్ లోని ఊంజా మార్కెట్లో గతవారం సుమారు 60-65 వేల బస్తాల రాబడిపై రూ. 19,000-23,000, జామ్నగర్, గోండల్, జామ్జోధ్ పూర్, హల్వడ్, రాజ్కోట్, సాంచోర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 25-30 వేల బస్తాల రాబడిపై రూ. 19,000-21,750, రాజ్కోట్ లో యూరప్ క్వాలిటీ రూ. 20,000-20,250, 2 ລ້ . 18,250-19,250 వ్యాపారమయింది. రాజస్తాన్ లోని మెడతా, నాగోర్, జోధ్ పూర్, కేక్షి మొదలగు జీలకర్ర ఉత్పాదక మార్కెట్లలో వారంలో 38-40 వేల బస్తాల రాబడి పై 18,000-25,000 వ్యాపారమయింది. రూ. ధరతో

Updated On: May 3, 2026, 8:20 pm
మెంతుల స్టాకిస్టుల కొనుగోళ్లు

హైదరాబాద్ః లభించిన సమాచారం ప్రకారం గుజరాత్, రాజస్తాన్ మరియు మధ్య ప్రదేశ్లీలో మెంతుల ధర కొత్త సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటినప్పటికీ మరియు గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉన్నప్పటికీ రాబడులు పెరగడంలేదు. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లలో సరుకు రాబడులతో పాటు కిరాణా మార్కెట్ మరియు స్టాకుస్టుల కొనుగోళ్లతో ధరలు పెరిగాయి. అయితే, గత ఏడాది తక్కువ ధరతో నిల్వ చేసిన వారికి లాభం చేకూరడం ప్రారంభమయింది. గుజరాత్లోని రాజ్కోట్లో గతవారం 7-8 వేల బస్తాల మెంతుల రాబడిపై యావరేజ్ రూ. 5900-6450, సెమీ కిరాణా రూ. 6500-7250, కిరాణా రకం రూ. 7000–8000 మరియు రాజస్తాన్లోని కోటా, బారన్ ప్రాంతాలలో వారంలో 6–7 వేల బస్తాలతో పాటు బికనీర్, నోఖా, జయపూర్, జోధ్పూర్ లాంటి ఉత్పాదక కేంద్రాలలో కలిసి వారంలో 15-16 వేల బస్తాల రాబడిపై రూ. 6200–6600 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గతవారం 4-5 వేల బస్తాల రాబడిపై రూ.6300-6900, జావ్రాలో 8–10 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 6300-6600, నాణ్యమైన రంగు సరుకు రూ. 6650-6750 మరియు మందసోర్లో 6-7 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 6100-6400, మీడియం రూ. 6400-6550, బెస్ట్ రూ. 6600–6750 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

Updated On: May 3, 2026, 8:20 pm
గుజరాత్లో కొత్త మినుముల రాబడులు-అంతర్జాతీయ సరఫరా పెరిగే అంచనా

హెదరాబాద్ – అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ సరుకు 5-10 డాలర్లు తగ్గి ఎఫ్ఎక్యూ 840 డాలర్లు, ఎస్క్యూ 930 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడింది. ముంబెలో ఎఫ్ఎక్యూ ధర రూ. 200 తగ్గి రూ. 7950, చెన్నైలో ఎస్యూ రూ. 8550, ఎఫ్ఎక్యూ రూ. 7875, బ్రెజిల్ రూ. 8550, దిల్లిలో ఎస్క్యూ రూ. 8900, ఎఫ్ఎక్స్యూ రూ. 8300 ధరతో వ్యాపారమెంది. గుజరాత్లోని పాటన్ ప్రాంతంలో కొత్త సరుకు రాబడులు ప్రారంభమైనందున మిల్లర్లు అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. యాసంగి సీజన్ మినుము సేద్యం గత ఏడాదితో పోలిస్తే 1 లక్ష హెక్టార్లు పెరిగింది. మయన్మార్లో ఉత్పత్తి పెరగడంతో అంతర్జాతీయ వ్యాపారులు తక్కువ ధరను ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 24 ఏప్రిల్ నాటికి విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.75 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 3.72 ల.హె.లకు చేరింది. గత ఏడాది యాసంగి పంట సేద్యం 3.26 హెక్టార్లతో పోలిస్తే అధికంగా ఉంది. దీనితో ప్రస్తుత సీజన్లో మొత్తం విస్తీర్ణం భారీగా పెరిగే అంచనా కలదు. గుజరాత్లో 27 ఏప్రిల్ వరకు సేద్యం 30,196 హెక్టార్ల నుండి పెరిగి 30,616 హెక్టార్లకు చేరింది. తమిళనాడులోని తంజావూరు ప్రాంతపు కొత్త సరుకు చెన్నై డెలివరి రూ. 8300, ఆంధ్ర పాలిష్ సరుకు రూ. 8350, తెలంగాణ ఆత్మకూరు సరుకు రూ. 8250 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని వెరావల్, పాటన్ ప్రాంతాలలో కొత్త మినుములు రూ. 8200-8300 ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర ప్రదేశ్లోని క్రిష్ణా జిల్లాలో పాలిష్ సరుకు రూ. 8100, సాదా రు. 7800, నంద్యాల, ప్రొద్దటూరు ప్రాంతాలలో సాదా రూ. 7900-8000, పాలిష్ సరుకు రూ. 8100–8200, విజయవాడలో పాలిష్ గుండూ రకం పప్పు రూ. 11,600, నాణ్యమెన సరుకు రూ. 14,000, పప్పు రూ. 10,000–11,000 ధరతో వ్యాపారమెంది. మహారాష్ట్రలోని అకోలాలో సాదా మినుములు రూ. 8150 మరియు మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ లో రూ. 5000-8345, గుజరాత్లోని రాజ్కోట్లో 900-1000 బస్తాల సరుకు రాబడి కాగా, రూ. 6000-8200 మరియు ఉత్తరప్రదేశ్లోని మహోబాలో రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది.

Updated On: May 3, 2026, 8:19 pm
మెంతులు

మెంతులు జావ్రా : రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉత్పాదక రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో గత వారంలో నాలుగు రోజులు నిర్వహించిన మార్కెట్లో దాదాపు 80 వేల బస్తాల రాబడి అయ్యాయి. పొరుగు రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు జోరందుకున్నందున సార్టెక్స్ సరుకు ధరలకు మద్దతు లభిస్తున్నది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో 12 వేల బస్తాల కొత్త మెంతుల రాబడిపై సాధారణ రకం రూ. 4400-4700, మీడియం రూ. 5000-5600, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.6000-6500, బోల్డు సరుకు రూ. 7200-7300, జావ్రాలో 17 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4800-4900, మీడియం రూ. 5500-5700, నాణ్యమైన సరుకు రూ. 6500-7000, పాప్డా నాణ్యమైన సరుకు రూ. 8500-9500, మీడియం రూ. 7500-8000, మందసోర్లో 5 వేల బస్తాలు రాబడిపై సాధారణ రకం రూ. 4700-5000, మీడియం రూ. 5500-5800, నాణ్యమైన సరుకు రూ. 6200-6700 మరియు రాజస్తాన్లోని రామ్గంజ్మండీ, కోటా, నోఖా ప్రాంతాలలో 15 వేల బస్తాలు కొత్త మెంతులు నిమ్ము సరుకు రూ. 4500-4900, మీడియం రూ. 5000-5300, బోల్డు సరుకు రూ. 5500-6000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, జామ్నగర్, ఊంఝా, మెహసానా ప్రాంతాలలో 10 వేల బస్తాలు సాధారణ రకం రూ. 4350-5200, మీడియం రూ. 5250-5750, కిరాణా రకం రూ. 6450-6850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: April 21, 2025, 6:51 am
పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు

పెరగనున్న కొత్త జీలకర్ర రాబడులు హైదరాబాద్ ః గుజరాత్లోని ఊంఝాలో కొత్త జీలకర్ర రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున మరో 15 రోజులలో రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే, మార్చి వాయిదా రెండు నెలల క్రితం ముందస్తుగా కొనుగోలు చేసినందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 915-925 వృద్ధి చెందింది. ఏప్రిల్లో సరుకు సరఫరా మరింత ఊపందుకోగలదు. కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్ పంట అత్యంత సంతృప్తికరంగా ఉంది. కిరాణా వ్యాపారుల నిల్వ ఉన్న సరుకు విక్రయిస్తున్నారు. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 20,250 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 925 వృద్ధి చెంది రూ. 21,175, ఏప్రిల్ వాయిదా రూ. 915 పెరిగి రూ. 20,740, మే వాయిదా 19,750 వద్ద ముగిసింది. గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 40 వేల బస్తాలకు పైగా కొత్త జీలకర్ర రాబడి అవుతున్నది. ఊంఝాలో ప్రస్తుతం నాణ్యమైన సరుకు 23,000-27,000 మరియు 15 వేల బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం రూ. 17,500-18,000, మీడియం రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-21,000, గోండల్, రాజ్కోట్, జామ్జోధ్పూర్, జస్డన్, హల్వాడ్, జామ్నగర్ప్రాంతాలలో 12-14 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,500- 18,000, నాణ్యమైన సరుకు రూ. 19,500-20,000, రాజ్కోట్లో కిరాణా రకం రూ. 19,750-20,000, మీడియం రూ. 18,625-19,125, నాణ్యమైన సరుకు రూ. 19,500, యూరప్ రకం రూ. 19,750 మరియు రాజస్తాన్లోని మెడతా, నాగోర్, పాలి, సుమేర్పూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాలు సాధారణ రకం రూ. 17,000-19,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Updated On: February 17, 2025, 7:00 am